ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాకి కొమ్ముగాసిన రాజకీయ నేత ఎవరు?
x
RED SANDAL

ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాకి కొమ్ముగాసిన రాజకీయ నేత ఎవరు?

తిరుపతి జిల్లాలో దొరికిపోయిన ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగ్ వెనుక ఏ రాజకీయ పార్టీ నేతలున్నారు? అసలు ఈ నిందితులు ఎవరు?


ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో కీలకవ్యక్తిగా భావిస్తున్న నల్లపరెడ్డి అజిత్‌కుమార్‌రెడ్డిని టాస్క్ ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనది ఉలవపాడు మండలం కరేడు గ్రామం. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలం దూబగుంటలో అగ్రిగోల్డ్‌ సంస్థకు చెందిన భూముల్లోని అత్యంత విలువైన ఎర్రచందనం చెట్లను అజిత్‌కుమార్‌రెడ్డి బృందం నరికి నిల్వచేసినట్టు గుర్తించారు. ఈ బృందంలో లంకా వినోద్‌కుమార్‌రెడ్డి, కార్పెంటర్‌ శ్రీహరి, అతని కుమారుడు నిరంజన్‌తో పాటు మరికొందరు ఉన్నారు.
రవాణాకు వీలుగా ఆ దుంగలను మూడడుగుల పొడవు, అడుగు వెడల్పుతో కోయించారు. దుంగలను కొన్ని కరేడు, మరికొన్ని బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప ప్రాంతంలో దాచారు. జూలై 17న చెన్నైకు తరలిస్తుండగా తిరుపతి జిల్లా వరదాయపాళెంలో వినోద్‌కుమార్‌రెడ్డి పోలీసులకు చిక్కారు. ఈ అక్రమ రవాణాలో అజిత్‌కుమార్‌రెడ్డి కీలకంగా ఉన్నట్టు ప్రచారం జరిగింది.
అటవీ, పోలీసు శాఖల అధికారులు కరేడు ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ప్రధానంగా ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు గ్రామంలోనే ఉండి కేసులో కీలక వ్యక్తులపై ఆరా తీశారు. ఈ క్రమంలో కలిగిరి సీఐ వెంకటనారాయణ, ఎస్‌ఐ ఉమాశంకర్‌ ఆధ్వర్యంలో టాస్‌్కఫోర్స్‌ బృందం అజిత్‌రెడ్డితో పాటు, శ్రీహరి, అతని కుమారుడు నిరంజన్‌ను కూడా అరెస్ట్‌ చేసినట్టు తెలిసింది.
ఇప్పుడు ఈ ముఠా ఏ రాజకీయ పార్టీ ఉందీ అనే దానిపై చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ ఉన్నారని కొందరు, విపక్షానికి చెందిన ముఖ్య నేతలే ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
Read More
Next Story