ఇవాళ మ్యాచ్ లో టాస్ కీలకం: భారత్–దక్షిణాఫ్రికా సూపర్-8 పోరు
x

ఇవాళ మ్యాచ్ లో టాస్ కీలకం: భారత్–దక్షిణాఫ్రికా సూపర్-8 పోరు

కోట్లాది మంది ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇదే.. అభిషేక్ శర్మకి ఛాన్స్ ఉండేనా..


టీ-20 ప్రపంచకప్ సూపర్-8 దశలో ఇవాళ భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. రెండు జట్లు సమ ఉజ్జీలుగా కనబడుతుండడంతో ఈ మ్యాచ్ ఫలితాన్ని టాస్ ఖరారు చేస్తుందని భావిస్తున్నారు. నాణెం ఎటు పడుతుందనే దానిపైన్నే అందరి చూపు నిలిచింది.

మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి మ్యాచ్ కావడంతో మైదానంలో తేమ (డ్యూ) ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లకు బంతిపై పట్టుదల తగ్గిపోవడం సాధారణం. ముఖ్యంగా స్పిన్నర్లకు ఇది ఇబ్బందిగా మారుతుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భారత్ బలమైన బ్యాటింగ్ లైనప్‌తో బలంగా కనిపిస్తున్నప్పటికీ, స్పష్టమైన లక్ష్యంతో ఛేజ్ చేయడం జట్టుకు అనుకూలంగా మారవచ్చు. పవర్‌ప్లేలో వేగంగా పరుగులు సాధించడం, మధ్య ఓవర్లలో లెక్కచేసిన ఆటతీరు ప్రదర్శించడం భారత్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది.
మరోవైపు దక్షిణాఫ్రికా బౌలింగ్ స్క్వాడ్ వేగం, క్రమశిక్షణకు మారుపేరు. తేమ ప్రభావం కారణంగా డెత్ ఓవర్లలో యార్కర్లు, స్లో ఓవర్ల నియంత్రణ కాస్త కష్టమయ్యే అవకాశం ఉంది. అందువల్ల వారు కూడా ముందుగా బౌలింగ్ చేయడానికే మొగ్గు చూపే అవకాశం ఉంది.
పిచ్ స్వభావం దృష్ట్యా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 200 వరకు స్కోరు సాధిస్తే పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అయితే తేమ ప్రభావం పెరిగితే, రెండో ఇన్నింగ్స్‌లో ఛేజ్ చేయడం సులభతరం కావచ్చు. నరేంద్ర మోదీ స్టేడియం పిచ్‌ను నల్ల మట్టితో తయారుచేశారు. దీంతో ఈ ట్రాక్‌ స్పిన్నర్లకు అంతగా అనుకూలించకపోవచ్చు. చక్కటి బౌన్స్‌తో పేసర్లకు మాత్రం లాభిస్తుంటుంది. అలాగే భారీ స్కోర్లకు అవకాశం ఉంది.
సెమీ-ఫైనల్ దిశగా కీలకమైన ఈ పోరులో రెండు జట్లు కూడా సమాన స్థాయిలో ఉన్నప్పటికీ, టాస్ గెలిచిన జట్టుకు భరోసా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ ప్రతిభ తర్వాతి అంశాలు కాగా, ఇవాళ మొదటి విజయం మాత్రం బొమ్మే (టాస్) నిర్ణయించవచ్చు.
అభిషేక్‌కే చాన్స్‌ ఇస్తారా...
డాషింగ్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మూడు డకౌట్లతో కిందామీద పడుతున్నారు. తాను జట్టులో లేనప్పుడు ఓపెనర్‌గా శాంసన్‌- నమీబియాపై చెలరేగిపోయాడు. 8 బంతుల్లోనే 22 పరుగులతో చెలరేగాడు. దీంతో నేటి మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఎవరిని ఆడిస్తారనే సందేహాలు నెలకొన్నాయి. కానీ కెప్టెన్‌ సూర్య మాత్రం అభిషేక్‌పై పూర్తి నమ్మకాన్ని ఉంచాడు. అభిషేక్‌ టచ్‌లోకి వచ్చేందుకు ఒక్క ఇన్నింగ్స్‌ చాలనే అభిప్రాయంతో టీమ్‌ ఉండడంతో ఇషాన్‌తో కలిసి తనే బరిలోకి దిగే చాన్సుంది. అయితే అభిషేక్‌ త్వరగా అవుట వడం వన్‌డౌన్‌లో తిలక్‌ వర్మ బ్యాటింగ్‌పై ప్రభావం పడుతోంది. వికెట్‌ కాపాడుకునేందుకు అతను భారీ షాట్లకు వెళ్లడం లేదు. దీంతో మధ్య ఓవర్లలో స్కోరు నెమ్మదిస్తోంది. అయితే తమ సూచన మేరకే తిలక్‌ అలా ఆడాల్సి వస్తోందని కెప్టెన్‌ చెబుతున్నాడు.
దక్షిణాఫ్రికా బౌలింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉండడంతో భారత బ్యాటర్లు రాణించాల్సి ఉంది. పేసర్‌ బుమ్రా, స్పిన్నర్‌ వరుణ్‌ల బంతులను గ్రూప్‌ దశలో ప్రత్యర్థి జట్లు ఆడలేకపోయాయి.
తుది జట్ల అంచనా...
భారత్‌: ఇషాన్‌, అభిషేక్‌, తిలక్‌, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), హార్దిక్‌, దూబే, రింకూ, అక్షర్‌, కుల్దీప్ /అర్ష్‌దీప్‌, బుమ్రా, వరుణ్‌.
దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), డికాక్‌, రికెల్టన్‌, బ్రెవిస్‌, స్టబ్స్‌, మిల్లర్‌, యాన్సెన్‌, బాష్‌, కేశవ్‌, రబాడ, ఎన్‌గిడి.
Read More
Next Story