అభిమానులను ఆకర్షించిన ‘ఈ సాలా కప్ నమ్దే’ నినాదం
x
ఐపీఎల్-2025 టైటిల్ గెలిచిన ఆర్సీబీ జట్టు

అభిమానులను ఆకర్షించిన ‘ఈ సాలా కప్ నమ్దే’ నినాదం

నాలుగో ఫైనల్ ను ఓడిసిపట్టిన బెంగళూర్


ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ బాగా ప్రజాదరణ జట్టు ఏదైనా ఉందంటే అది ఆర్సీబీ అని టక్కన చెప్తారు క్రికెట్ లవర్స్. ప్రతి సీజన్ ప్రారంభంలో ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ బరిలోకి దిగడం, టైటిలో పోరులో వెనకబడటం, గత 17 సంవత్సరాలుగా ఆర్సీబీ అలవాటుగా మార్చుకుంది.

అయితే మంగళవారం రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఆరు పరుగుల తేడాతో ఓడించడంతో ఆర్సీబీ కల నెరవేరింది. ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా జరిగింది. అయితే ఆర్సీబీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చివరి వరకూ పోరాటం కొనసాగించింది. చివరకు అద్భుతమైన విజయాన్ని సాధించింది.
కోహ్లీ నాక్..
బ్యాటింగ్ లో రాణించడంలో ఆర్సీబీ ఇబ్బందిపడుతున్నప్పటికీ అభిమానులు మాత్రం ఆర్సీబీ పై ఆశలు వదులుకోలేదు. దీనికి కారణం విరాట్ బ్యాటింగ్ మాయాజాలం. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ 650 కి పైగా పరుగులు సాధించాడు.
ఈ మ్యాచ్ లో కూడా కింగ్ కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులు చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవరల్లో 190 పరుగులు బోర్డ్ పై పెట్టగలిగింది. ఆర్సీబీ బౌలర్లు కూడా కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి మ్యాచ్ పై పట్టుబిగించారు.
పంజాబ్ కింగ్స్ విజయానికి చివరి ఓవర్లో 29 పరుగులు అవసరం కాగా, జోష్ హాజిల్ వుడ్ మొదటి రెండు బంతులు డాట్ బాల్స్ వేయడంతో ఆర్సీబీ విజయం ఖరారు అయింది.
శశాంక్ సింగ్ 30 బంతుల్లో 61(3X4, 6X6) పరుగులు సాధించి ఆర్సీబీ గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. చివరి వరకూ క్రీజులో నిలిచిన ఈ ఫినిషర్ పంజాబ్ ను గెలిపించడానికి విశ్వప్రయత్నం చేశాడు. కానీ చివరకు పంజాబ్ 184 పరుగులే చేయగలిగింది.
ఆర్సీబీ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పంజాబ్ కు ఆదిలోని హాజిల్ ఉడ్ షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా 4-0-17-2 తో అద్బుత స్పెల్ వేసి పంజాబ్ బ్యాట్స్ మెన్లపై ఒత్తిడి పెంచాడు.
ఈ సీజన్ లో అద్భుత ఫామ్ లో ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ ను రోమారియో షెఫర్డ్ పెవిలియన్ పంపడంతో మ్యాచ్ ఏ దిశగా సాగుతుందో అర్థమయింది. క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లో శ్రేయస్ ముంబై పై విశ్వరూపం చూపించి గెలిపించిన సంగతి తెలిసిందే.
కానీ ఫైనల్ లో మాత్రం షెఫర్డ్ బంతికి శ్రేయస్ అయ్యార్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అయితే జోష్ ఇంగ్లిస్(23 బంతుల్లో 39, 1X4, 4X6) దూకుడుగా ఆడి స్కోర్ బోర్డును పరుగు పెట్టించాడు. కానీ 13 ఓవర్లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో స్కోర్ బోర్డు వేగం తగ్గింది.
తరువాత ఆర్సీబీ డాట్ బాల్స్ వేస్తూ పంజాబ్ పై ఒత్తిడి పెంచింది. ఇదే సమయంలో స్క్రీన్ పై ఏబీ డివిలియర్స్ కనిపించడంతో స్టేడియంలో పెద్ద ఎత్తున కేరింతలు వినిపించాయి.

సాల్ట్ అద్బుత క్యాచ్..
ధాటిగా ఆడుతున్న పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యను హజిల్ ఉడ్ పెవిలియన్ పంపాడు. డీప్ లో సాల్ట్ అందుకున్న అద్బుత క్యాచ్ కు ప్రియాంశ్ వెనుదిరిగాడు. పంజాబ్ జట్టు పవర్ ప్లే పూర్తి చేసే నాటికి 52/1 స్కోర్ సాధించింది.
అయితే మరో ఒపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ మాత్రం ఒత్తిడికి లొంగిపోయాడు. 22 బంతుల్లో 26 పరుగులు మాత్రమే సాధించాడు. అయితే 17 ఓవర్లలో మూడు బంతుల వ్యవధిలో నెహల్ వధేరా(15), మార్కస్ స్టాయినిస్(6) లను భువి పెవిలియన్ పంపడంతో ఆర్సీబీ విజయం ఖరారు అయింది.
ఫైనల్లో ఆర్సీబీ బ్యాట్స్ మెన్లు కూడా ఒత్తిడికి తలొగ్గారు. ఇప్పటికే మూడుసార్లు ఫైనల్లో ఓడిపోయిన ఆ జట్టు, నాలుగోసారి కూడా చేతులెత్తేసిందని అంతా అనుకున్నారు.
ఓ వైపు కోహ్లీ క్రీజులో ఉన్న స్కోర్ బోర్డు పరుగులు పెట్టలేదు. తొమ్మిదో ఓవర్ లో మూడు ఫోర్లు కొట్టి, 43 పరుగులు సాధించాడు. కేవలం 35 బంతుల్లో 122.85 స్ట్రైక్ రేట్ తో మాత్రమే సాధించాడు. అయితే ఇదే ఇన్సింగ్స్ కు మూలస్తంభంలా నిలిచింది.
పవర్ ప్లే తరువాత ఆర్సీబీ స్పీడ్ కు బ్రేక్ పడింది. 6-11 ఓవర్ల మధ్య జట్టు కేవలం 42 పరుగులు మాత్రమే సాధించింది. కేవలం స్ట్రైక్ రోటేట్ చేస్తూ వికెట్ ను కాపాడుకున్నారు.
ఈ దశలోనే సాల్ట్ నిష్రమించడంతో ఆర్సీబీ కుదుపులకు లోనైంది. మయాంక్ అగర్వాల్ 24, రజత్ పాటిదార్, లివింగ్ స్టోన్ 25 సహ ఎవరూ కూడా ఆరంభాలను ఉపయోగించుకోలేకపోయారు.
ఆర్సీబీ బ్యాట్స్ మెన్లు కైల్ జేమీసన్ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి బాగా ఇబ్బంది పడ్డారు. వైవిధ్యమైన బంతులతో సాల్ట్, జితేశ్ శర్మ, పాటిదార్ పెవిలియన్ చేరారు. అయితే 17 ఓవర్లలో జితేశ్ శర్మ 10 బంతుల్లో రెండు సిక్స్ లు, లివింగ్ స్టోన్ ఒక సిక్స్ బాదడంతో జేమీసన్ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. దీనివల్ల కివీస్ బౌలర్ గణాంకాలు మారాయి.
మరో బౌలర్ అర్ష్ దీప్ సింగ్ చివరి ఓవర్లో కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రోమారియే షెఫర్డ్ లను పెవిలియన్ పంపి ఆర్సీబీ రెండువందలు దాటకుండా కళ్లేం వేశాడు.


Read More
Next Story