
ఆర్సీబీ జట్టు
విజయోత్సవ పరేడ్ నిర్వహించబోతున్న ఆర్సీబీ ఫ్రాంచైజీ
సీఎం సిద్ధరామయ్య ను కలిసిన తరువాత ప్రారంభం కానున్న యాత్ర
తొలిసారి ఐపీఎల్ టైటిల్ సాధించిన ఆర్సీబీ జట్టు, తమ విజయోత్సవాన్ని జరుపుకోవడానికి నేడు బెంగళూర్ లో పరేడ్ నిర్వహించనున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది.
మంగళవారం రాత్రి ఐపీఎల్ 2025 ఫైనల్ లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఐపీఎల్ ప్రారంభమైన 18 సంవత్సరాలకు కానీ ఆ జట్టుకు టైటిల్ అందలేదు. ఇప్పటికి మూడు సార్లు ఆ జట్టు ఫైనల్ ఓటమి చవిచూసిన నాలుగోసారి మాత్రం టైటిల్ ను ముద్దాడింది.
విజేతగా నిలవగానే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా ఆర్సీబీకి ఉన్న అభిమానులు సైతం రోడ్లపైకి వచ్చి తమ సంబరాలను జరుపుకున్నారు.
ఈరోజు సాయంత్రం బెంగళూర్ లో సైతం భారీ స్థాయిలో విజయోత్సవ ర్యాలీ జరిపేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కర్ణాటక శాసనసభ, సచివాలయం నుంచి చిన్నస్వామి స్టేడియం వరకూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించబోతున్నారు. స్టేడియంలో వేడుకలు సాయంత్రం 6 గంటల తరువాత కొనసాగుతాయి.
బెంగళూర్ నగరంలో సాయంత్రం 3.30 నిమిషాలకు ఈ పరేడ్ ప్రారంభమవుతుందని ఫ్రాంచైజీ బుధవారం తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పేర్కొంది.
‘‘బెంగళూర్ లో ఆర్సీబీ విక్టరీ పరేడ్!! ఇది మీకోసం, గేమ్ లో 12 మ్యాన్ ఆర్మీ. విధేయత అనేది రాయల్టీ, నేడు కిరీటం మీదే’’ అని రాసుకొచ్చారు. జట్టును విజయపథంలో నిలిపినందుకు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ను విరాట్ కోహ్లి ప్రశంసించాడు. జట్టుకు మద్దతు ఇచ్చిన అభిమానులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
‘‘ఇది నాకు, విరాట్ కోహ్లీకి, అభిమానులందరికీ నిజంగా ప్రత్యేకమైనదని నేను భావిస్తున్నాను. సంవత్సరాలుగా మద్దతు ఇచ్చిన వారు, కాబట్టి మీరందరూ దీనికి అర్హులని నేను భావిస్తున్నాను. మీరు చాలా స్థిరంగా మాతోనే ఉన్నారు. కానీ నిజంగా ట్రోఫిని గెలుచుకునే అవకాశం ఉందని మీకు ఎప్పుడు అనిపించింది? ఐపీఎల్ ఏ దశలో ఉన్న మీరు ఈ ఆట గురించి మాట్లాడుకున్నారని నేను అనుకుంటున్నాను’’ అని విజయం తరువాత పాటిదార్ అన్నారు.
పరేడ్ వివరాలు..
అహ్మదాబాద్ నుంచి బయలుదేరే సమయం: ఉదయం పది గంటలు
మధ్యాహ్నం 1.30కి బెంగళూర్ రాక, హాల్ విమానాశ్రయం, బెంగళూర్. కర్ణాటక ముఖ్యమంత్రి పర్యటన
సమయం : సాయంత్రం 4 -5 గంటల మధ్య, స్థానం కర్ణాటక విధానసభ
విజయోత్సవ ర్యాలీ: ముఖ్యమంత్రి సందర్శన తరువాత, సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం.
మార్గం: విధాన సభ నుంచి ఓపెన్ టాప్ బస్సు ద్వారా చిన్నస్వామి స్టేడియం వరకూ సాయంత్రం ఆరు గంటలకు వేడుకలు
Next Story