లీడ్స్ టెస్ట్: ఇంగ్లాండ్ లక్ష్యం 371
x
భారత టెస్ట్ కెప్టెన్ శుభ్ మన్ గిల్, ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్

లీడ్స్ టెస్ట్: ఇంగ్లాండ్ లక్ష్యం 371

రాహుల్, పంత్ సెంచరీలు.. మరోసారి కుప్పకూలిన లోయర్ ఆర్డర్, భారమంతా బౌలర్లపైనే


లీడ్స్ టెస్ట్ రసపట్టులో పడింది. రెండో ఇన్సింగ్స్ లో టీమిండియా 365 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లీష్ టీమ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం ఆ జట్టు 21 పరుగులు చేసి వికెట్లేమీ కోల్పోకుండా ఉంది.

ఆ జట్టు ఆట చివరి రోజైన ఈ రోజు మరో 350 పరుగుల సాధించాలి. కానీ భారత బౌలర్లలో ఒక్క బూమ్రా తప్ప మిగిలిన వాళ్లంతా తేలిపోతుండటంలో అభిమానుల్లో కలవరం కలిగిస్తోంది.

అయితే పిచ్ కాస్త నెమ్మదించిందని నాలుగో రోజు ఆటను చూసిన వాళ్లకు అర్థమవుతుంది. ఈ పిచ్ పై ఇంగ్లీష్ టీమ్ అనుసరించే బజ్ బాల్ గేమ్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

ఆదిలోనే షాక్
క్రితం రోజు 90/2 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ మరో రెండు పరుగులు మాత్రమే జోడించి పెవిలియన్ చేరాడు. కార్స్ సంధించిన బంతి, బ్యాట్ ఎడ్జ్ కు తగిలి వికెట్లను గిరాటేసింది. దీనితో పంత్ క్రీజులోకి వచ్చాడు.
ఆకాశం మబ్బులు పట్టి ఉండటంతో ఇంగ్లీష్ బౌలర్లు భారత బ్యాట్స్ మెన్లను ఇబ్బంది పెట్టారు. పంత్, రాహుల్ కూడా అంతే జాగ్రత్తగా ఆడారు. తొలి సెషన్ లో కేవలం 60 పరుగులు మాత్రమే సాధించారు.
లంచ్ తరువాత జోరు
లంచ్ తరువాత ప్రారంభమైన రెండో సెషన్ లో ఇద్దరు బ్యాట్స్ మెన్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా పంత్ తనదైన షాట్లతో అలరించగా, రాహుల్ తన క్లాస్ ఆటతో పరుగులు సాధించాడు. ఈ క్రమంలో రాహుల్, పంత్ సెంచరీలు సాధించారు.
జట్టు స్కోర్ మూడు వందలు దాటిన తరువాత పంత్(118), బషీర్ బౌలింగ్ భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. కాసేపటికే రాహుల్ కూడా (137) వెనుదిరగడంతో భారత్ 365 పరుగులకే ఆలౌట్ అయింది.
భారత లోయర్ ఆర్డర్ మరోసారి విఫలం అయింది. చివరి నలుగురు బ్యాట్స్ మెన్లలో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఈ మ్యాచ్ లో పంత్ రెండు ఇన్సింగ్స్ లోనూ సెంచరీ సాధించాడు.
ఇంతకుముందు ఈ ఘనత జింబాబ్వే ఆటగాడు ఆండీ ఫ్లవర్ పేరిట ఉంది. ఆ తరువాత పంత్ ఈ రికార్డును సమం చేశాడు. ఇంగ్లీష్ బౌలర్లలో బ్రైడర్ కార్స్ , జోష్ టంగ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, బషీర్ కు రెండు వోక్స్, స్టోక్స్ కు చెరో వికెట్ దక్కింది.


Read More
Next Story