
ఐపీఎల్ 2026 ఆరంభం ఘనం... మెరిసిన ఐదుగురు ఆటగాళ్లు
ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్లలో డఫీ, పడిక్కల్, రోహిత్, సూర్యవంశీ, బర్గర్ మెరుపులు మెరిపించి జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 తొలి మ్యాచ్లతోనే ఉత్సాహంగా ప్రారంభమైంది. మొదటి మూడు మ్యాచ్లలోనే ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనలతో అభిమానులను ఆకట్టుకున్నారు.
మార్చి 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంబర్స్ బెంగళూరు (RCB) జట్టు, 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించి సన్రైజర్స్ హైదరాబాద్పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తరువాతి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టు, కోల్కతా నైట్ రైడర్స్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఇక మార్చి 30న రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు, చెన్నై సూపర్ కింగ్స్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.
ఈ మ్యాచ్లలో ప్రత్యేకంగా మెరిసిన ఐదుగురు ఆటగాళ్లు..
జాకబ్ డఫీ (ఆర్సీబీ):
జాకబ్ డఫీ (Jacob Duffy) తన ఐపీఎల్ అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్లలో 22 పరుగులకే 3 వికెట్లు తీసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పవర్ప్లేలోనే ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాడు.
దేవదత్ పడిక్కల్ (ఆర్సీబీ):
దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) కీలక సమయంలో 26 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టును విజయానికి నడిపించాడు. అతను విరాట్ కొహ్లి (Virat Kohli) తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
రోహిత్ శర్మ (ఎంఐ):
రోహిత్ శర్మ (Rohit Sharma) 38 బంతుల్లో 78 పరుగులు చేసి ఎంఐ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అతని దూకుడు బ్యాటింగ్ మ్యాచ్ను ఏకపక్షంగా మార్చింది.
వైభవ్ సూర్యవంశీ (ఆర్ఆర్):
వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కేవలం 15 ఏళ్ల వయసులోనే సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టుకు సునాయాస విజయం అందించాడు.
నంద్రే బర్గర్ (ఆర్ఆర్):
నంద్రే బర్గర్ (Nandre Burger) బౌలింగ్లో రాణించి 4 ఓవర్లలో 26 పరుగులకే 2 వికెట్లు తీశాడు. ప్రత్యర్థి జట్టును ప్రారంభంలోనే ఒత్తిడిలోకి నెట్టాడు.
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్లతోనే ఉత్కంఠభరిత పోటీలు, ఆటగాళ్ల ప్రతిభ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

