పారిస్ ఒలింపిక్స్‌లో దూకుడు ప్రదర్శించిన భారత హాకీ జట్టు
x

పారిస్ ఒలింపిక్స్‌లో దూకుడు ప్రదర్శించిన భారత హాకీ జట్టు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు దూకుడు ప్రదర్శిస్తోంది. ఆదివారం క్వార్టర్‌ఫైనల్లో బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది.


పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు దూకుడు ప్రదర్శిస్తోంది. ఆదివారం క్వార్టర్‌ఫైనల్లో బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. క్వార్టర్‌ ఫైనల్‌లో భారత్ 1 (4)- 1 (2) తేడాతో విజయం సాధించింది. తొలుత హాఫ్ లో 1-1తో టై అయింది. షూటౌట్‌లో 4-2తో గెలుపొందింది. తొలి హాఫ్ లో ఇరుజట్లు గోల్ చేయలేదు. రెండో హాఫ్ లో మొదలైన కొద్దిసేపటికి భారత డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌ మ్యాచ్‌ నుంచి బయటకు పంపారు. హాకీ స్టిక్‌తో బ్రిటన్ ఆటగాడి తలపై ఉద్దేశపూర్వకంగా కొట్టాడని భావించిన రిఫరీలు రోహిదాస్‌ను రెడ్‌కార్డ్ ద్వారా ఆట నుంచి దూరం చేశారు. దీంతో తర్వాత భారత్ 10 మందితోనే ఆడింది. 22వ నిమిషంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్ పెనాల్టీ కార్నర్‌ ద్వారా గోల్‌ సాధించి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. 27వ నిమిషంలో మోర్టన్ లీ గోల్‌ చేయడంతో స్కోర్ సమం అయింది. తర్వాత రెండు క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్‌ షూటౌట్‌కు దారితీసింది.

Read More
Next Story