
ఇండియా ఫస్ట్ వికెట్ డౌన్, సంజూ శాంసన్ ఔట్
ధాటిగా ఆడుతున్న క్రమంలో సంజు శాంసన్ (23 పరుగులు) పెవిలియన్ బాట పట్టాడు
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న కీలక పోరులో టీమ్ ఇండియా ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అయితే, భారీ స్కోరు దిశగా సాగుతున్న తరుణంలో సంజు శాంసన్ అవుట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
హెడ్ లైన్ హైలైట్స్:
టాస్: టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
మార్పులు: భారత జట్టులో రెండు కీలక మార్పులు జరిగాయి. రింకు సింగ్ స్థానంలో సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు.
పవర్ఫుల్ స్టార్ట్: అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన సంజు శాంసన్, మొదటి ఓవర్లోనే సిక్సర్తో తన ఖాతా తెరిచాడు.
మూడో ఓవర్లో పరుగుల సునామీ
జింబాబ్వే బౌలర్ మపోస వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో భారత బ్యాటర్లు విరుచుకుపడ్డారు. అభిషేక్ శర్మ రెండు ఫోర్లు, ఒక సిక్సర్తో చెలరేగగా.. సంజు కూడా ఒక బౌండరీ బాదాడు. ఈ ఓవర్లో ఏకంగా 23 పరుగులు రావడంతో భారత్ 3 ఓవర్లకే వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.
తొలి వికెట్ డౌన్..
ధాటిగా ఆడుతున్న క్రమంలో సంజు శాంసన్ (23 పరుగులు) పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం క్రీజులో అభిషేక్ శర్మతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. అంతకుముందు స్టేడియంలో సంగీత దర్శకుడు అనిరుధ్ తన ప్రదర్శనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

