
సంజు శాంసన్ మెరుపు హాఫ్ సెంచరీ! గెలుపు బాటలో ఇండియా
సూర్యకుమార్ యాదవ్ ఔట్.. 18 పరుగులకే
వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా పక్కా ప్రణాళికతో దూసుకుపోతోంది. సరిగ్గా సగం ఓవర్లు (10 ఓవర్లు) ముగిసే సమయానికి భారత్ దాదాపు సగం లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ సంజు శాంసన్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది.
సంజు శాంసన్ 'టాప్' గేర్
ఈ ఇన్నింగ్స్లో ప్రధాన ఆకర్షణ సంజు శాంసన్. ఆరంభం నుంచే విండీస్ బౌలర్లపై విరుచుకుపడిన సంజు, కేవలం 26 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. షెఫర్డ్ వేసిన 9వ ఓవర్లో ఒక ఫోర్, ఒక సిక్సర్తో 13 పరుగులు రాబట్టిన సంజు, జట్టు స్కోరు వేగాన్ని పెంచాడు. ప్రస్తుతం అతను 54 పరుగులతో క్రీజులో ఉండి ఇన్నింగ్స్ను నడిపిస్తున్నాడు.
తడబడ్డ ఓపెనర్లు.. ఆదుకున్న సూర్య
భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.
అభిషేక్ శర్మ (10): అకీల్ హొసీన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి హెట్మయెర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇషాన్ కిషన్ (10): క్రీజులో సెట్ అవుతున్న సమయంలో హోల్డర్ బౌలింగ్లో హెట్మయెర్ పట్టిన అద్భుత క్యాచ్కు పెవిలియన్ చేరాడు.
సూర్యకుమార్ యాదవ్: కెప్టెన్ సూర్య (18*) సంజుకు చక్కని సహకారం అందిస్తున్నాడు. హోల్డర్, మోతీ బౌలింగ్లో సిక్సర్లు, ఫోర్లతో టచ్లోకి వచ్చాడు. కాని ఓ సిక్స్ కొట్టబోయి 18 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
ప్రస్తుతం క్రీజ్ లో తిలక్ వర్మ, సంజూశాంసన్ ఆడుతున్నారు.

