ఆరంభం అదిరింది.. కానీ సూర్య తన మార్క్ చూపించాడా?
x

ఆరంభం అదిరింది.. కానీ సూర్య తన మార్క్ చూపించాడా?

సీనియర్ ఆటగాళ్ల రిటైర్ మెంట్, ప్రధాన పేస్ బౌలర్ బూమ్రా గైర్హాజరీ, చైనామన్ బౌలర్ కుల్దీప్ లేకుండా శ్రీలంక పర్యటనకు వెళ్లిన మన జట్టు తొలి మ్యాచ్ లో విజయం..


(ఆర్. కౌశిక్)

శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ ఆడటానికంటే ముందు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘టీంలో ఇంజన్ మాత్రమే మార్చబడింది.. బోగీలు అవే’’ అనే వ్యాఖ్యానం చేశారు. తొలి టీ20 మ్యాచ్ చూసిన వారికి ఇది నిజమే అనిపించింది.

టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఐదుగురు సభ్యులు ఇందులో లేరు. అందులో ముగ్గురు శాశ్వతంగా టీ20 కెరిర్ నుంచి తప్పుకున్నారు. మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ కోర్ టీం స్వభావం మాత్రం మారలేదు. అదే తీవ్రతతో మ్యాచ్ ఆడారు. బోగీలు మారలేదు కానీ.. ఇంజిన్ల పనితీరులో మాత్రం స్పష్టమైన మార్పు కనిపించింది. తన ముంబై సహచరుడు, కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ గా ఎంపికయిన సూర్య తన మార్క్ పనితనాన్ని మైదానంలో చూపించాడు.

ఏమీ మారలేదు... ఎందులో తెలుసా..
సూర్యకుమార్ అన్నట్లుగానే, “నేను ఇప్పటివరకు ఆడిన విధంగానే ఆడబోతున్నాను, ఏమీ మారదు.” ఏమీ మారలేదు, నిజం చెప్పాలి. కానీ విలేకరుల సమావేశంలో మాట్లాడటం వేరు, మైదానంలో బండి నడపడం వేరు. కెప్టెన్‌గా తాను 'వాక్ ది టాక్'లో ఉన్నానని 24 గంటల తర్వాత జరిగిన మ్యాచ్ లో, సూర్యకుమార్ తన మాటకు కట్టుబడి ఉన్నాడు.
అతను తన అద్భుతమైన స్ట్రోక్‌ప్లేతో శత్రుత్వం లేని కానీ పక్షపాత అనుకూల స్వదేశీ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ మెంట్ అందించాడు. చివరికి, భారత్ 43 పరుగుల విజయాన్ని సాధించింది. శ్రీలంక ఛేజింగ్ దిగినప్పుడు కూడా మైదానం మొత్తం సూర్య, సూర్య అంటూ నినాదాలు వినిపించాయి. తనదైన స్ట్రోక్ మేకింగ్ ప్లేతో ప్రత్యర్థి జట్టు అభిమానులను సైతం తన వశం చేసుకున్నాడు ఈ ఇండియన్ నయా కెప్టెన్.
సూర్య.. క్రీజులో వచ్చేసరికి జట్టు పటిష్ట స్థితిలో ఉంది. ఒపెనర్లు జైస్వాల్- గిల్ మంచి పునాది వేశారు. తొలి వికెట్ కు 74 పరుగుల భాగస్వామ్యం అందించారు. అప్పటికే ఈ యంగ్ ఒపెనర్లు తమదైన స్ట్రోక్ ప్లేతో శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 11 ఫోర్లు, 3 సిక్సర్లు బాదేశారు. ఇదే పునాదిపై సూర్య భారీ స్కొరు సాధించడానికి అవసరమైన స్ట్రోక్ ప్లే అందించారు. మొదట కెప్టెన్సీ ప్రభావంతో బంతులు ఎడ్జ్ తీసుకుంటున్న కనిపించినా, తరువాత తనదైన శైలితో ఆడాడు. కొంతమంది ఉత్తమ ఆటగాళ్లు సైతం కెప్టెన్సీ ఒత్తిడిలో సరిగా ఆడలేరు. ఆ ప్రభావం స్కై మ్యాన్ పై పడిందని తొలి రెండు బంతుల సమయంలో అనిపించినా.. తరవాత అదేం లేదని తేలిపోయింది.
సూర్యకుమార్ యాదవ్ 2014-15లో వివాదాస్పద పరిస్థితులలో తిరిగి ముంబై కెప్టెన్‌గా నిష్క్రమించినా పర్వాలేదు. శనివారం ముందు, అతను తాత్కాలిక హోదాలో ఏడు T20I లలో భారతదేశానికి నాయకత్వం వహించాడు. ఇందులో గెలుపొటముల రికార్డు 5-2 గా ఉంది. ఆ ఏడు మ్యాచ్‌లలో చివరిది అతనికి టీ20లలో నాల్గవ సెంచరీని తెచ్చిపెట్టింది, గత డిసెంబర్‌లో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సారి, కెప్టెన్‌గా అతని మొదటి మ్యాచ్ లో, 26 బంతుల్లో 58 పరుగులు సాధించాడు. అర్హమైన సెంచరీ కానీ ఖచ్చితంగా మరొక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మాత్రం లభించలేదు.
బాస్ ఎవరో చూపించాడు..
ఇన్నింగ్స్ ప్రారంభంలో బంతి ఎడ్జ్ తీసుకుని వెళ్లినప్పుడు కాస్త నిదానంగా ఆడటానికి ప్రయత్నిస్తారు. కానీ సూర్య తరువాత ఓవర్ నుంచే తన ప్రతాపం చూపించాడు. ఈ దాడికి గురైంది దిల్షాన్ మధుశంక. ఖచ్చితమైన లైన్ అండ్ లెగ్త్ తో బంతులు వేసే ఈ లెప్టార్మ్ పేసర్ కే చుక్కలు చూపించాడు. మిస్టర్ 360 డిగ్రిలు, స్కై మ్యాన్ అనే అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారో ఈ ఓవర్లో స్పష్టంగా ఆడిన షాట్ల ద్వారా చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు స్టాండ్స్ మార్చుకుంటూ... బంతిని ప్రేక్షకుల మధ్యలోకి పంపించడం నిజంగా ఆనందంగా అనిపించింది. ఇలా అందరి బౌలింగ్ ను సూర్య తనదైన మార్క్ షాట్లతో వినోదం పంచి, పరుగులు పిండుకున్నాడు.
రియాన్ పరాగ్ నైపుణ్యం..
బ్యాట్‌తో సూర్య తన పని ముగించాడు. అతను తన నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది సమయం. మంచి బంతులు కూడా శ్రీలంక బ్యాట్స్ మెన్ బౌండరీకి తరలించినప్పుడు.. బౌలర్లకు అండగా నిలబడ్డాడు. వీపుతూ తడుముతూ.. డోంట్ వర్రీ అంటూ ధైర్యం చెప్పాడు.
"అతను బౌలర్ల కెప్టెన్, అంటే మాకు ప్రపంచం" అని అక్షర్ పటేల్ వ్యాఖ్యానించాడు. ధారాళంగా పరుగులు ఇచ్చిన అక్షర పటేల్ ను 15 ఓవర్ లో బౌలింగ్ దించిన సూర్య... ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న లంక బ్యాట్స్ మెన్లకు కళ్లెం వేశాడు. ఈ ఓవర్ లో రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ మన వైపు మొగ్గింది.
నిజానికి పరుగులు ధారాళంగా వస్తున్నప్పుడు బౌలర్లు ఒత్తిడికి గురవుతారు. కానీ సూర్య వారికి నమ్మకం కలిగించడంలో సఫలం అయ్యాడు. ఆ తరువాత శ్రీలంక కేవలం 30 పరుగుల తేడాతో మిగిలిన 9 వికెట్లను కొల్పోయింది.
సూర్యకుమార్ డైస్‌లో ఒక ఆఖరి త్రోను రిజర్వ్ చేసాడు, ఇది అతని స్లీవ్‌లో ఒక ప్రత్యేక ట్రిక్ - అతనే రియాన్ పరాగ్. శ్రీలంక చివరి నాలుగు ఓవర్లలో 56 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ ఇద్దరికీ చెరో రెండు ఓవర్లు మిగిలి ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరంగా కొత్త వ్యక్తికి బంతి అందించాడు. నిజానికి ఈ పరిస్థితుల్లో అనుభవం ఉన్న ఫాస్ట్ బౌలర్లు కూడా జంకుతారు. స్కోర్ బోర్డు మీద అప్పటికే చేధించాల్సిన లక్ష్యం చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ రియాన్ పరాగ్ ను బౌలింగ్ కు దించాడు.
పరాగ్ కు చివరి ఐదు వికెట్లకు మూడు తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి వికెట్ తీయగానే అతను ప్రపంచాన్ని జయించినట్లు అరిచాడు. అతని నైపుణ్యంతో భారత్ ఈ ఏడాది 17 టీ20ల్లో 16వ విజయం సాధించింది. గౌతమ్ గంభీర్ కోచింగ్ కెరీర్ సమగ్ర విజయంతో ప్రారంభమైంది, సూర్యకుమార్ కెప్టెన్సీ స్టింట్ బ్రిడ్జ్‌టౌన్ రీప్రైజ్‌తో ప్రారంభించబడింది, అయితే వాటాలు అంత ఎక్కువగా లేకపోయినా, మ్యాచ్ అంత 'గోన్ కేసు' కాదు. సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ కాదు, కానీ తనదైన రీతిలో, అతను మార్కర్‌ను వేశాడు. భయపడకు, నేనిక్కడున్నాను అన్నట్లుంది.
Read More
Next Story