
ICC Champions Trophy: భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ (India) ఇవాళ (ఫిబ్రవరి 20) తొలి మ్యాచ్ ఆడుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో టీమిండియా.. బంగ్లాదేశ్(Bangladesh)తో తలపడుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకాగా.. బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది.
ఇక ప్లేయర్ల విషయానికొస్తే..
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI):
తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్
భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్
A గ్రూపులో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నారు. గ్రూపుB లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుంచి 2 జట్లు సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తాయి.