విరాట్ కి, బాబర్ మధ్య పోలికనా? పాకిస్తాన్ మాజీ గ్రేట్
x

విరాట్ కి, బాబర్ మధ్య పోలికనా? పాకిస్తాన్ మాజీ గ్రేట్

కింగ్ విరాట్ కోహ్లి, బాబర్ ఆజం కి మధ్య పోలికేంటీ? కోహ్లి తన అంతర్జాతీయ కెరియర్ లో 80 సెంచరీలు సాధించాడు. బాబర్ ఇప్పటి వరకూ కేవలం 31 సెంచరీలు కొట్టాడు.


క్రికెట్ లో ఎప్పుడు సమ ఉజ్జీవులు, గ్రేట్ అంటూ కొంతమంది ఆటగాళ్ల మంది పోలీకలు వస్తూ ఉంటాయి. ప్రస్తుత తరంలో ఉత్తమ ఆటగాళ్లుగా పేరున్న విరాట్ కోహ్లి, జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవెన్ స్మిత్ మధ్య పోలీకలు చర్చకు తెస్తూ బాబర్ ఆజంను చేర్చి ఫ్యాబ్ ఫైవ్ గా పిలిచేవారు. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ క్రీడాకారులు. అయితే పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు విరాట్ కోహ్లి- బాబర్ ఆజం సమానమంటూ వాదనలు వినిపిస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ నిరాధారమైనవని పాకిస్తాన్ గ్రేట్ జహీర్ అబ్బాస్ అభప్రాయపడ్డారు. విరాట్ కంటే బాబర్ ఆజం ఎన్నో మెట్లు వెనకబడి ఉన్నాడని అన్నారు.

"యే ఫిజూల్ కి బాతీన్ హై (పోలికలు అర్ధంలేనివి). విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్‌లో స్కోర్ చేస్తాడు. కానీ బాబర్ ఆటతీరు ఎలా ఉందో మీరు చూస్తున్నారుగా అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కోహ్లీ తన పేరు మీద 80 అంతర్జాతీయ సెంచరీలు చేయగా, బాబార్ చేసిన సెంచరీలు సంఖ్య 31 మాత్రమే. ప్రతి ఫార్మాట్‌లలో భారతదేశం ప్రదర్శించిన నిలకడను కూడా అబ్బర్ అంగీకరించాడు. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు బలమైన పోటీదారుగా ఉంటుందని చెప్పాడు.
"భారత జట్టు మొత్తం చాలా బాగుంది. బ్యాట్స్ మెన్లు బాగా రాణిస్తున్నారు. బౌలర్లు ఇద్దరూ బాగానే ఉన్నారు. ఇది చాలా బ్యాలెన్స్‌డ్ టీమ్, సోచ్ సమాజ్ కర్ (ఆలోచనాపూర్వకంగా) ఆడే జట్టు" అని అబ్బాస్ అన్నాడు.
"వారికి చాలా మంచి కెప్టెన్ ఉన్నాడు, అతను క్రికెట్‌ను బాగా అర్థం చేసుకుంటాడు. కాబట్టి, ప్రతిదీ మీకు అనుకూలంగా జరుగుతున్నప్పుడు అది సజావుగా సాగుతుంది. ప్రస్తుతం భారతదేశం విషయంలో కూడా అలాగే ఉంది.
"వారు బ్యాలెన్స్‌డ్ టీమ్‌ని కలిగి ఉన్నందున (చాంపియన్స్ ట్రోఫీలో) వారు బాగా ఆడటానికి చాలా మంచి అవకాశం ఉంది" అని 77 ఏళ్ల అన్నాడు. అబ్బాస్ పాకిస్తాన్ తరపున 78 టెస్టులు, 62 ODIలు ఆడాడు, ఇందులో వరుసగా 5062, 2572 పరుగులు చేశాడు.
" టెస్ట్ క్రికెట్ నిజమైన క్రికెట్. ఇది ఏ ఆటగాడికైనా, బౌలర్కైనా నిజమైన టెస్ట్ అని. ఒకప్పుడు భారత్, పాకిస్తాన్ టెస్టు జట్టు బాగానే ఉండేది. ఇక టెస్ట్ క్రికెట్ లేకుండా మనం కొనసాగలేమని బోర్డులు గుర్తిస్తున్నాయి. "మీరు ఎన్ని T20లు ఆడగలరు? ICC ఎన్ని వైట్-బాల్ టోర్నమెంట్‌లను నిర్వహించగలదు? బహుశా 2 లేదా 3 కానీ చివరికి మీరు ODI లేదా టెస్ట్‌లకు తిరిగి రావాలి.
"మీరు టెస్ట్ క్రికెట్‌ను కొనసాగిస్తే క్రికెట్ ఎక్కువ కాలం ఉంటుంది. ప్రజలు వేగంగా ఫలితాలను పొందాలని ఇష్టపడతారని నాకు తెలుసు, కానీ నెమ్మదిగా వారు T20లతో విసుగు చెందుతారు. మాకు టెస్టులు- ODIలు అవసరం." T20 ఫ్రాంచైజీ లీగ్‌లలో కెరీర్‌పై దృష్టి పెట్టడానికి వారి బోర్డుల నుంచి సెంట్రల్ కాంట్రాక్ట్‌లను తిరస్కరిస్తున్న ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది, ఆందోళనకరమైన ధోరణిని పరిష్కరించాలని అభిప్రాయపడ్డారు.
టెస్ట్ క్రికెట్ లోనే మజా ఉంటుంది
"టెస్ట్ క్రికెట్ అంతిమమైనది. టీ20లో ఎవరైనా గెలవగలరు. జట్లను ఫ్లూక్‌తో గెలవవచ్చు. కానీ టెస్ట్ క్రికెట్‌లో రెండు ఇన్నింగ్స్‌లు ఉన్నందున అలా కాదు. మీకు ఒక ఇన్నింగ్స్‌లో రాణించగల స్కోప్ ఉంది. టెస్ట్ క్రికెట్ మీకు చాలా నేర్పుతుంది.
"ఏదైనా మీరు సంవత్సరానికి కనీసం 5 లేదా 6 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలి, ఆపై మీరు ODI లేదా T20లు ఆడవచ్చు. ప్రతి సంవత్సరం కనీసం టెస్ట్ మ్యాచ్‌లను కేటాయించాలి," అన్నారాయన.
బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ అధో ముఖంలో ప్రయాణిస్తుందని అభిప్రాయపడ్డారు. ఓడిపోవడం వేరు.. ఘోరంగా ఓడిపోవడం వేరని చెప్పారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.
" ఒకప్పుడు వెస్టిండీస్ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. కానీ పాకిస్థాన్ క్రికెట్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంటుందని నేను ఆశిస్తున్నాను, అబ్బాయిలు చాలా కష్టపడుతున్నారు." 2023 ODI ప్రపంచ కప్ తర్వాత T20I లలో బాబర్ స్థానంలో పేసర్ షాహీన్ అఫ్రిది కెప్టెన్‌గా ఉన్నాడు, అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో మాజీ కెప్టెన్‌గా తిరిగి నియమించబడ్డాడు.
సమస్య మరింత తీవ్రమయ్యేలోపు కొన్ని చర్యలు తీసుకోవాలని అబ్బాస్ పీసీబీని కోరారు. "అవును, గతంలో పాకిస్తాన్ జట్లలో పోటీలు ఉన్నాయి, అయితే బాబర్ మరియు షాహీన్ మధ్య ఉన్న పోటీని బోర్డు గమనించాలి. ఎంత వేగంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే అది పెరుగుతూనే ఉంటుంది. శత్రుత్వం మంచిదే కానీ సీరియస్‌గా మారకూడదని, అలా జరిగితే జట్టుకు హాని కలుగుతుందని అబ్బాస్ అన్నాడు.


Read More
Next Story