
ప్రధాని నరేంద్ర మోదీ
దేశపు ఉత్తమ ప్రధాని ఎవరూ? మోదీ నేనా?
నెహ్రూ రికార్డ్ ను బ్రేక్ చేయడంలో మోదీ దూసుకుపోతున్నారా?
నరేంద్ర మోదీ దేశ అత్యుత్తమ ప్రధానా? చాలా రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ నన్ను ఈ అంశం పై జరిగే డిబెట్ లో పాల్గొనమని ఆహ్వానించింది. అయితే ముందస్తు షెడ్యూల్ వల్ల నేను ఆ కార్యక్రమానికి వెళ్లలేకపోయాను.
అయితే ఇక్కడ లేవనెత్తిన ప్రశ్న అత్యుత్తమైనది. ఇది అత్యంత గంభీరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఛానెల్ ఎడిటర్లు, బహుశా యజమానులకు కూడా మోదీ మీడియా, ఇమేజ్ మేనేజర్లను సంతృప్తిపరచడానికి ఉద్దేశించిన ఓ మోసపూరిత కార్యక్రమం కావచ్చు. అందుకే ఛానెల్ ఈ కార్యక్రమం కోసం ప్రణాళిక రచించి ఉండవచ్చు.
ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు స్వీకరించి మొన్నటితో 11 సంవత్సరాలు పూర్తయింది. అందుకే ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. మోదీ, భారత్ కు 14 వ ప్రధానమంత్రిగా మొదటిసారిగా బాధ్యతలు స్వీకరించిన తేదీ మే 26 కాబట్టి ఈ కీలక తేదీని వాస్తవానికి చేరుకున్నప్పటికీ, ప్రభుత్వం ఈ సంవత్సరం జూన్ 9 న అధికారిక వేడుకను నిర్వహించింది. అదే రోజున ఆయన 2024 లో మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
రూల్ ఆఫ్ 75, నెహ్రూ రికార్డు
అధికారికంగా నిర్వహించిన వార్షికోత్సవ వేడుకను చూసి ఎవరూ ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా అరుదుగా నిర్వహిస్తారు. కానీ మోదీ అతని మీడియా నిర్వాహకులు అతిముఖ్యమైన మైలురాళ్లను కూడా జరుపుకుంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఎందుకంటే ఈ సంఘటనలు పరిశీలనకు అన్ని ప్రయత్నాలను అణిచివేసే అవకాశం ఉంది.
మోదీ రూల్ 75 ని పక్కన బెట్టారు. వాటిని ఆయన అమలు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. తన కాలంలో ఉన్న అనేక మంది ప్రత్యర్థులను ఆయన సైడ్ లైన్ చేశారు.
నెహ్రూ 16 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా ఉన్నారు. మోదీ కూడా ఈ రికార్డును దాటడానికి దేశంలోని ఏ శక్తి ఆపలేదని తెలుస్తోంది.
ఇది కచ్చితంగా చరిత్ర పుస్తకాలలో, భవిష్యత్ అధికారిక రికార్డులలో చేర్చబడాలని భారత మొదటి ప్రధాని అధిగమించి, తద్వారా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పచుకోవాలని ఆయన కోరుకునే అవకాశం ఉంది.
అయితే నెహ్రూ అనేక సంస్థలకు పర్యాయపదంగా మారారు. ఇప్పుడు ఉనికిలో లేని ప్రణాళిక సంఘం నుంచి ఆధునిక భారత దేవాలయాలుగా పిలవబడే ఆనకట్టలు, ఉక్కు కర్మాగారాలు, పరిశోధన సంస్థలు వంటి ప్రధాన ప్రజా పనుల ప్రాజెక్ట్ లను పట్టాలెక్కించారు.
మోదీ తను అధికారం చేపట్టినప్పటి నుంచి గత సంస్థలను మూసివేయడం, కొత్త సంస్థలను సృష్టించడం, సబర్మతి తీర ప్రాంతం, నర్మదా నది ఒడ్డున సర్ధార్ పటేల్ విగ్రహ స్థాపన, సెంట్రల్ విస్టా, కొత్త పార్లమెంట్ భవనం, కొత్త ప్రగతి మైదాన్ వరకూ సంస్థలు విధానాలతో తన సంతకాన్ని చరిత్రలో లిఖించుకోవడం ప్రారంభించారు.
నన్ను ఆహ్వానించిన ఛానెల్ లోని చర్చా కార్యక్రమం బహుశా ఇప్పటికి చరిత్ర అయి ఉండవచ్చు. నేను ఎక్కువగా చూడలేదు. కొన్ని ఎంపిక చేసిన భాగాలను మాత్రమే చూశాను. చాలా వరకూ మోదీ అనుకూల వ్యాఖ్యలు ఉన్నాయి.
వీటిని టీవీ సోషల్ మీడియాలో ప్రసారం చేసి ఉండవచ్చు. అవి ఇప్పటికి సర్క్యూలేట్ అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే మోదీ కెరీర్ లో మైలురాయిని గుర్తించే సంఘటనలు చాలా రోజుల ప్రణాళికబద్దంగా ప్రతిధ్వనిస్తాయి.
సైద్దాంతిక ప్రీమియర్..
ఈ కార్యక్రమంలో కచ్చితంగా తిరస్కరించేవారు ఉండేవారు. ఎందుకంటే చాలా ఛానెల్స్ దృష్టిలో నేను వారిలో ఒకడిని. అందుకే నన్ను ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. నాకు వేరే కార్యక్రమాలు లేకపోయి ఉంటే చర్చా కార్యక్రమానికి నా ప్రతిస్పందన కూడా చెప్పేవాడిని.
మోదీ ఉత్తమ భారతీయ ప్రధానమంత్రి కాదు. అలాగని అధమ స్థాయి ప్రధాని కాదు. కానీ కచ్చితంగా ఉత్తమ ప్రధాని మాత్రం కాదు. మోదీ పరిపాలనకాలంలో సానుకూల, ప్రతికూల ఫలితాలను చెప్పడానికి ట్రాఫిక్ లైట్లు నుంచి పోలికలను తీసుకుంటే.. ఆకుపచ్చ, ఎరుపు షేడ్స్ రెండూ ఉన్నాయి. 2014 లో కొన్ని రంగాలలో చాలా మంచి పని జరిగింది. అనేక ఇతర రంగాలలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.
ఇందులో నెహ్రూ తరువాత మోదీ అత్యంత సైద్దాంతికంగా నడిచే ప్రధానమంత్రి. కానీ వారిద్దరూ దాదాపు ప్రతిదానిపైనా విరుద్దమైన భావాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయవాదం, జాతీయత అనే ఆలోచనపై వీరికి అసలు పోలికే లేదు.
ఆర్థిక అసమానత
భారత్ దేశంలో పేదల సంఖ్య ధనవంతుల కంటే ఎక్కువగా ఉంది. దేశంలో ఆర్థిక అసమానతల స్థాయిలు చరిత్రలో ఎన్నడూ లేనంతంగా ఉన్నాయని అందరికి తెలుసు. భారత జనాభాలో పదిశాతం మంది దగ్గర 77 శాతం సంపద ఉంది. ముఖ్యంగా ఒక శాతం దగ్గర భారతీయుల వద్ద 58 శాతం సంపద ఉంది.
గత పదకొండు సంవత్సరాలుగా ధనవంతులు మరింత ధనవంతులుగా మారారని, దేశంలోని అత్యంత ధనవంతులు, పేదల మధ్య అంతరం విస్తృతంగా మారిందని అనేక గణాంకాలు తెలియజేస్తున్నాయి.
రాజ్యాంగంలోని ప్రవేశికలో హోదా అవకాశాల సమానత్వం అనే హమీ ఇచ్చింది. ఇది ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన వాగ్థానాలను పూర్తిగా అపహస్యం చేయడమే.
ఈ విషయం జనవరి- ఫిబ్రవరిలో జరిగిన ప్రపంచ అతిపెద్ద మానవ కార్యక్రమం అయిన మహాకుంభమేళాలో స్పష్టంగా కనిపించింది. పేదలు అనేక ఇబ్బందులు పడుతూ శిథిలా ఆశ్రయాలలో ఉండగా, ధనవంతులు మాత్రం డేరా గ్రామాలలో నివసించారు.
దేశపు ఏకైక పవిత్ర గ్రంథంలో పేర్కొన్నట్లుగా లక్ష్యం వైపు ముందుకు సాగడంలో ప్రభుత్వం విఫలమైనప్పటికీ ‘‘సేవ, సుశాసన, గరీభ్ కళ్యాణ్’’ సూత్రాల ద్వారా నడిచే అద్భుతమైన పరివర్తన దశాబ్ధంగా దాని ప్రచార కరపత్రాలలో పేర్కొంది. ఇదే కొత్త వాదన కాదు. గత దశాబ్ధ కాలంగా పదేపదే చెప్తున్నారు.
‘‘ఒక అబద్ధాన్ని చాలాసార్లు చెప్తే అది నిజం అవుతుంది’’ అని ప్రసిద్ద నానుడిని ఇప్పుడు వీరు ఫాలో అవుతున్నారు. అడాల్ప్ హిట్లర్ దేశాన్ని పరిపాలించిన సంవత్సరాల్లో జర్మన్ ప్రచార మంత్రి జోసెఫ్ గోబెల్స్ కు ఈ ప్రచార సూత్రాన్ని తరుచుగా చెప్పేవారు. మనస్తత్వవేత్తలు దీనిని ‘‘సత్యపు భ్రాంతి ప్రభావం’’ అని కూడా అంటున్నారు.
అయితే గత 11 సంవత్సరాలలో ఏమి చేయలేదని కాదు. కొంతవరకూ పేదరిక నిర్మూలన జరిగింది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆహార పథకాలలో ఒకటైన ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 2028 వరకూ అమలు కానుంది. దీనితో క్లెయిమ్ లు తగ్గించబడతాయి.
కోవిడ్ కాలంలో ప్రారంభించిన ఈ పథకం ప్రారంభించడం తప్పనిసరి. అయినప్పటికీ దీనిని కొనసాగించడం విధానపరమైన వైఫల్యం. ప్రజలకు తగినంత ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం అసమర్థతను నొక్కి చెబుతుంది.
అదే విధంగా మౌలిక సదుపాయాలు అభివృద్ది చేస్తూనే ఉన్నారు. కానీ మరోవైపు వంతెనలు కూలిపోతునే ఉన్నాయి. కొత్త రహదారులు తక్కువ కానీ కఠినమైన ప్రయాణాలు అందిస్తున్నాయి.
అయితే రాజకీయంగా మోదీ మాత్రం మెరుగ్గా రాణించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో తన సొంత మెజారిటీని సాధించడంలో విఫలమైన సందర్భాన్ని మినహాయించి, మోదీ పెద్దగా సవాళ్లను ఎదుర్కోలేదు.
హిందూత్వ ఎజెండా..
భారత్ ఇప్పుడున్నంతగాప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ ఒంటరిగా లేనప్పటికీ, ఆపరేషన్ సిందూర్ తరువాత దేశంలోని తన ప్రజాదరణను మోదీ స్పష్టంగా పెంచుకోగలగడంలో వైరుధ్యం ఉంది.
చాలా స్పష్టంగా మోదీ ‘‘భారతీయ పాస్ పోర్టు హోల్డర్ ప్రతిష్ట’’ పెంచారనే వాదనలు సోషల్ మీడియా కథనంలో ఒక భాగం కానీ వాస్తవం మరో విధంగా ఉంది.
కానీ మోదీ ఇటీవలి వారాల్లో ఆయన తన స్థాయిని, ప్రజాదరణను పెంచుకున్నారు. కాబట్టి పదవీ బాధ్యతలు స్వీకరించి 11 వ వార్షికోత్సవాన్ని మోదీని ప్రశంసిస్తూ ఢంకారం మోగించడానికి ఉపయోగించుకుంటున్నారు.
మీడియాలో ఎక్కువ భాగం కూడా మోదీ నిజంగానే అత్యుత్తమ ప్రధానమంత్రి అనే సందేశాన్ని ప్రచారం చేస్తున్నాయి.
అయితే నిజం ఏంటంటే.. అతిగా ప్రచారం చేసిన సృష్టించిన భ్రమకాదు. మోదీ నిజంగా బ్యాంకింగ్ నెట్ వర్క్ ను విస్తృతం చేసి ఉంటే ప్రభుత్వం ప్రజల నుంచి తెరిపించిన జన్ ధన్ ఖాతాలు చాలా వరకూ జీరో బ్యాలెన్స్ ఉందనేది కూడా వాస్తవం.
మోదీ తిరస్కరించలేని విధంగా ప్రదర్శించిన ఒక భాగం ఏంటంటే హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లారు. మెజారిటీ వాదం అనే ఆలోచనకు ఎక్కువ మద్దతు పొందడం, రాజకీయాలు, సమాజంలో మతపరమైన మైనారిటీలను ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులను అణగదొక్కడం జరుగుతోంది.
ప్రజాస్వామ్య సంస్థలు, రాజ్యాంగం కూడా నెమ్మదిగా దారి తప్పుతున్నాయి. అధికార వర్గంలో తమ విశ్వాసులను నియమించి, వాటిని క్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారు.
దీనితో భారత రాజ్యాంగం సంస్థలు పెళుసుగా మారుతున్నాయి. భారత రాజ్యం పెళుసుగా ఉండటమే కాకుండా భారత్ స్వతంత్య్రం వచ్చిన తరువాత పగ్గాలు చేపట్టిన దేశ వ్యవస్థాపక పితామహులు తదుపరి నాయకులు ఊహించిన దానికి చాలా దూరంగా ప్రయాణిస్తోంది.
( ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు ప్రచురిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. అవి ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)
Next Story