కర్ణాటకలో మహిళా సాధికారిత సాధిస్తున్నారా?
x
మహిళా ప్రయాణికులతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

కర్ణాటకలో మహిళా సాధికారిత సాధిస్తున్నారా?

ఉచిత బస్సు పథకం వల్ల ప్రజారంగంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి?


జానకీ నాయర్

మహిళల భద్రతకు కర్ణాటక ప్రభుత్వం పెద్దపీట వేయడం వలన చెప్పలేని ప్రభావాలు కనిపిస్తున్నాయి. మనకళ్లముందు కనిపిస్తున్న దృశ్యాలు, ప్రజారంగంలో వారు దూసుకుపోతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది.

ఏడాది క్రితం జేడీ(ఎస్) అధినేత హెచ్ డీ కుమారస్వామి మాట్లాడుతూ.. కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి హమీ ఇవ్వడం వలన అనేక దుష్ఫ్రప్రభావాలు ఉన్నాయని హెచ్చరించారు. గ్రామాల్లోని తల్లులు దారి తప్పారని అన్నారు. మహిళలు తమ కుటుంబాల గురించి ఆలోచించాలని హెచ్చరించారు. అయితే రాష్ట్ర మహిళా కమిషన్ వెంటనే దీనిపై స్పందించి, ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైనప్పటికీ చాలామంది పురుషులు భయపడుతున్న దానినే ఆయన బహిరంగంగా చెప్పారు. ఉచిత ప్రయాణం వలన మహిళలు రాష్ట్రవ్యాప్తంగా విహరయాత్రలకు వెళ్తున్నారు. తమ కుటుంబాలను పట్టించుకోకుండా ఈ యాత్రలు చేస్తున్నారు. వారు చాలాకాలంగా చూడాలనుకుంటున్న తీర్థయాత్రలు, ఆరాధన రూపాలు, సాధువులు, దేవుళ్లు, దేవతల మందిరాలను దర్శిస్తున్నారు. ఇవన్నీ నేటీ ప్రజా జీవితంలో పెరిగిన మతతత్వం గుర్తించబడకుండా పోతోంది.
కుటుంబాలు ప్రమాదంలో ఉన్నాయా?
ప్రస్తుతం ప్రజారంగంలో మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇంట్లో వారికి ఉన్న పరిమితులు ఇప్పుడు తొలగిపోయాయి. దీనితో యుగాల నాటి పాత సామెతలను ముందుకు తెస్తున్నారు.
శక్తి పథకం ప్రారంభించినప్పటి నుంచి మహిళల ఆర్థిక ప్రభావాలు, శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పెరిగింది. అయితే ఇది ప్రారంభ దశ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. పథకం అమలు తరువాత నెలల్లో డబ్ల్యూపీఎఫ్ఆర్ లో కనీసం ఒక ప్రారంభ అధ్యయనం 5 శాతం పెరుగుదలను చూపించింది.
కానీ బస్సులలోని పెద్ద సంఖ్యలను బట్టి చూస్తే చాలామంది తక్కువ బడ్జెట్ లపై గొప్ప పొదుపులు చేయడమే కాకుండా ప్రయాణించడానికి అనుమతి లేదా డబ్బు అడగడం అనే అవమానాల నుంచి ఉపశమనం పొందుతున్నారనేది జగమెరిగిన సత్యం.
గతవారంలోనే మహిళలు ప్రదర్శించిన నిజాయితీ, వ్యక్తిత్వం వెలుగులోకి వచ్చాయి. వ్యాఖ్యాతలు, రాజకీయ నాయకులు, క్రైమ్ రిపోర్టర్ల దృష్టిని ఆకర్షించాయి. హసన్ కు చెందిన ఒక మహిళ కళ్యాణ మండపంలో ఉన్నప్పుడూ తన పెళ్లి చేసుకోవడానికి తిరస్కరించింది.
తను ప్రేమించిన అబ్బాయిని వివాహం చేసుకోవడానికి ఆసక్తిని కనపరిచింది. అయితే ఇప్పటి వరకూ జరిగిన ఖర్చును ఎవరు భరిస్తారనేది పెద్ద సమస్యగా మారింది. అయితే చివరకు ఈ విషయం సామసర్యకంగా పరిష్కరించబడింది.
కుటుంబ గౌరవం కాపాడటం కోవడం..
ఈ సమస్య ఇలా పరిష్కరించబడిన తరువాత మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. మైసూర్ తాలుకాలో ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. తన పెద్ద కుమార్తె ప్రేమించిన వ్యక్తితో పారిపోవడంతో భార్య, భర్త, చిన్న కుమార్తె అంతా ఆత్మహత్య చేసుకున్నారు.
తన కుటుంబ పరువు పోయిందని భావించిన కుటుంబం ఈ కఠిన నిర్ణయానికి తీసుకున్నారు. అయితే తన మరణం తరువాత కూడా కుమార్తెను నియంత్రించడానికి బాధిత వ్యక్తి భావించారు. తన ఆస్థిలో ఎటువంటి వాటా కూడా తనకు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు.
చాలాకాలంగా మహిళలను బంధించి కులచట్రం అప్పుడప్పుడూ తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఇటీవల వలసలు, కులాంతరీకరణ కారణంగా సమాజం లో నెలకొన్న దయనీయ స్థితిని బహిరంగంగా చెప్పారు. ఆయన స్వయానా బ్రాహ్మణుడు.
దీనికి కొంతకాలం ముందు 2021 లో పెజావర్ మఠంలో స్వామీజీ బ్రాహ్మణ మహిళలు తమ సమాజంలోనే వివాహాలు చేసుకోవాలని సలహ ఇచ్చారు.
హక్కుల ఉల్లంఘన జరుగుతుందని భయం..
2015 లో ప్రభుత్వం సర్వే చేసిన సామాజిక- ఆర్థిక సర్వే వివరాల ప్రకటనతో కుల సమీకరణం మారుతుందని చాలా మంది భయపడ్డారు.
నేడు కర్ణాటకలో ఎస్సీలలో భాగంగా ఉన్న 101 కులాలలో ఉపరిజర్వేషన్ ను నిర్ణయించడానికి మూడు దశల ఎస్సీల కులగణన జరుగుతున్నందున సంఖ్యల ఆధారంగా హక్కులు హరిస్తారనే ఆందోళన ఎక్కువ మందిలో ఉంది.
వివాహం అనే ముఖ్యమైన విషయంలో మహిళల తమ అభిప్రాయాన్ని ఉపయోగించకుండా నిరోధించే విధానం ఇంకా కొనసాగుతోంది. ఇటీవల జరిగిన రెండు పెళ్లి సంఘటనలు కులం, కుటుంబం, మర్యాద అనే వాటికి బలం తెలియజేస్తున్నాయి. ప్రజాస్వామ్యం ద్వారా మహిళల విస్తరణ అనేది పితృస్వామ్య ద్వారా బలహీనపడుతాయనే భయం ఉంది.
ఇటీవల జరిగిన రెండు సంఘటనల ప్రాముఖ్యతను మనం పెంచకూడదు లేదా ప్రపంచాన్ని ఇసుక రేణువులో చదవకూడదు. చాలా వరకూ మహిళలు కుల, కుటుంబ గౌరవాన్ని మోసేవారుగానే కొనసాగుతున్నారు. మేరీ జాన్ వంటి స్త్రీవాదులు గుర్తించినట్లుగా భారత్ లో తప్పనిసరి వివాహ వ్యవస్థ శ్రామిక శక్తి భాగస్వామ్య రేటుపై కూడా ముఖ్యమైన(దురదృష్టకర) ప్రభావాలను చూపింది.
మహిళలకు నిజమైన ముప్పు..
ప్రపంచమంతా మహిళల శ్రమను ఇష్టపడకపోవచ్చు. కానీ స్వతంత్య్ర ఆదాయాలు, జీవనోపాధి లేదా రాష్ట్ర విధానం సామాజిక, సాంస్కృతిక స్వాతంత్య్రం కొత్త రూపాలకు బహుశా సామాజిక, సాంస్కృతిక అవిధేయతకు దారి తీస్తుందా? అనేది వేరే విషయం.
గత సంవత్సరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శివమొగ్గ హోటల్ లో గుమిగూడిన డజన్ల కొద్దీ మహిళలపై రైట్ వింగ్ వ్యక్తులు దాడి చేశారు. శ్రీరామ సేనకు చెందిన ప్రమోద్ ముతాలిక్ వంటి వారు కోరుకున్నట్లు నిజమైన హిందూ మహిళలకు శిక్షణ ఇవ్వడం చాలా ముఖ్యం.
రాజకీయ నాయకుల దుర్మార్గం, ధనవంతుల విచిత్రాలు, పత్రికల బానిసత్వం, మెజారిటీ బాధితుల భంగిమలను చూపించడం మాత్రమే కాదు. ఇది అసాధారణమైనది.
ఇవన్నీ మన జీవన విధానానికి దర్ఫణం పట్టేది. ఎంతమంది పురుషులు తమ ప్రత్యేక హక్కు గురించి మాట్లాడే ధైర్యం చేస్తారు. తమను తాము బాధితులుగా చిత్రీకరించడం ద్వారా దానిని రక్షించుకోవాలనే కోరికను వ్యక్తం చేస్తున్నారు. మన మహిళలను రక్షించడానికి ఆసక్తిగా కనిపిస్తున్న వాళ్లు ఇళ్లు, కుటుంబాలలో మహిళలకు నిజమైన ముప్పు ఎక్కడ ఉందో వాటిని కనిపెట్టి నిర్వీర్యం చేయాలి.

(ఇందులో వ్యక్త పరిచిన అభిప్రాయాలు సమాచారం రచయితకు సంబంధించినవి. ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను గౌరవిస్తుంది. మేము ఒక వేదికగా మాత్రమే ఉన్నాము )

Read More
Next Story