నివేదికలూ..!నిష్టుర సత్యాలు!
ప్రధాన పాలక పార్టీలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉ న్నా రాజకీయ అవసరాల కోసం మహిళలను ఒక కవచంగా వాడుకోవటం ఒక చౌకబార్ ఎత్తుగడ. ఆంధ్రప్రదేశ్ లో ఇది ప్రస్తుతం హైపిచ్లో నడుస్తున్నది. 12 శాతం సెక్స్ వర్కర్ల తో సంఖ్య పరంగా క ర్ణాటక తర్వాత ఎపి రెండవ స్థానంలో ఉందని పి ఎం పి ఎస్ ఇ ఈ అనే ఒక సంస్థ నివేదిక గతవారం ఇచ్చింది.టై మ్స్ అఫ్ ఇండియా పేరు ఎక్కువగా వినిపిస్తున్నా ఆ వార్త చాలా పత్రికల్లో వచ్చింది. ఇది కొత్త వార్త కూడా కాదు. గత పాతిక ముప్పై ఏళ్లలో చాలాసార్లు ఇలాటి నివేదికలు వస్తూనే వున్నాయి.
ఎయిడ్స్ భయాందోళనలు తారాస్థాయిన వున్నకారణంగా ఈ అధ్యయనాలు పెరిగాయి. 2000 ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై పెద్ద క్యాంపైన్ నిర్వహించేవారు. అప్పుడు కూడా బాగా ప్రచారంలోకి వచ్చిన ‘పులిరాజు పాఠం’ మహిళలకు వ్యతిరేకంగా వుందని పెద్ద దుమారం రేగితే తర్వాత సవరించుకున్నారు. అప్పట్లో చంద్రబాబు ఈ వృత్తికి లైసెన్సు ఇవ్వడం గురించి కూడా ప్రస్తావించి విమర్శలతో వెనక్కు తగ్గారు.
ఇన్నేళ్లలోనూ ఐక్యరాజ్యసమితి నుంచి స్వచ్చంద సంస్థల వరకూ ఈ విషయమై నివేదికలు విడుదల చేస్తూనే వున్నాయి.2017లో మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి కార్యాలయం (యుఎన్వోడిసి) కూడా మహిళలు వ్యభిచార వృత్తికి నెట్టివేయబడుతున్న రాష్ట్రాల్లో ఎపిరెండవ స్థానంలో ఉందని చెప్పింది. 14.73% ఈ రాష్ట్రానికి చెందిన వారని ఐరాస అప్పుడు చెప్పింది. 2021లో ‘నెట్వర్క్ ఆన్ వుమెన్ ట్రాఫికింగ్ అండ్ సెక్సువల్ ఎక్స్ ప్లా యిటేషన్’ కూడా అంతకు ముందు ఏడాది కంటే 2019లో 8.7% సెక్స్ వర్కర్లను అదనంగా గుర్తించినట్టు చెప్పింది.
రాష్ట్రంలోని అనేక జిల్లాలు ఈ సవాలును అధికంగా ఎదుర్కొంటున్నయని ఆర్టీఐ సమాధానం లో కేంద్రం తెలిపింది. ఇప్పటి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం ఉండగా 2023లో రాష్ట్రంలో 30 వేల మందికి పైగా మహిళలు అదృశ్యం అయ్యారని ఆరోపించారు.వలంటీర్లపై ఆ నిందవేయడం తప్పయినా కీలక అంశం ఇదే. అప్పుడు పవన్ మాటలపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్పై కేసు కూడా నమోదైంది.
ఫ్యూడల్ లక్షణాలు గల సమాజంలో ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ప్రత్యక్షంగా పరీక్షంగానూ మహిళలను టార్గెట్గా చేసుకోవడం ఒక ఎత్తుగడ, ఒక దురహంకారం. పురుషాధిక్య సమాజంలో అసమానతలకు అత్యాచారాలకు గురవుతున్న స్త్రీ మూర్తులకు గౌరవప్రదమైన స్థానం కల్పించడం వాటి లక్ష్యం కాదు. గత శాసన సభలోపలా వెలుపలా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణిపై క్షుద్ర వ్యాఖ్యానాలు పెనుమార్పులకు ఒక కారణమైనాయి.
ఇటీవల సోషల్ మీడియాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ భార్యపై నీచ వ్యాఖ్యలు వస్తే స్వయంగా చంద్రబాబు ఆదేశాలతో త క్షణం అరెస్టు చేశారు. కానీ ో దిగువ స్థాయిలోనూ మీడియా సోషల్మీడియాలలోనూ అటు అత్యాచారాలు ఇటు బూతు దాడులు ఆగింది లేదు. న్నాయి. ఆఖరుకు నేతల కుటుంబాలలో ఆడపడుచులను, ఏకీభవంచని వారిని కూడా వదలిపెట్టింది లేదని షర్మిల నుంచి కవిత ఉ దంతం దాకా చెబుతున్నాయి.
ఇంకా బాధా కరంగా ఆ ్ద పార్టీలలోని మహిళ నాయకులు కూడా అవతలి వారిపై దాడి చేయడానికి ఖండిరచవలసిందే గాని మొత్తం మహిళా సమస్యలు మాట్లాడనివ్వరు. మరి పైన చెప్పుకున్న ఈ నివేదికలపై వేరువేరు మహిళా కమిషన్ల చైర్మన్లు నిజంగా దృష్టి సారించారాగ కాల్ మనీ రాకెట్ల వంటవి వచ్చినప్పుడు కదలిక చూపించారా? మహిళల ఉపాధి రిజర్వేషను పనిగంటలు ్ల సమాన వేతనాలు అత్యాచారాలవాంటి అంశాలపై కృషి చేశారా అంటే లేదు.
తమ పార్టీలకు సంబంధించిన నేతలు ఆరోపణల గురైనప్పుడు వీరు గట్టిగా నిలదీస్తున్నారు? అంటే లేదు. కేవలం వామపక్ష మహిళా సంఘాలు, కార్యకర్తలు మాత్రమే నిరంతరం పట్టుదలతో అన్నిసమస్యలపై ముందుండి పోరాడుతుంటారని అందరికీ తెలుసు. ఈ మద్య కాదంబరి జత్వాని కేసులోనూ ఆమె వీరి సహకారమే తీసుకోవడానిక కారణమదే
దిద్దుబాటేదీ?
ఈ నేపథ్యంలో కొమ్మినేని నిర్వహించిన షోలో వినిపించిన అసభ్య వ్యాఖ్యలు నిస్సందేహంగా ఖండిరచాల్సిందే. తీవ్ర విమర్శల తర్వాత కూడా ఆయన కానీ, వ్యాఖ్యానకర్తగాని భే షరతుగా తప్పు ఒప్పుకోలేదు.ఆయన సుతిమెత్తగా వారించినట్టు చేయడాన్ని గొప్పగా చెబుతున్నారు. అంతే తప్ప క్షమాపణలు చెప్పలేదు. ఎవరో వ్యాఖ్యానిస్తే నాకు బాధ్యత ఏంటి అని ఆయన అంటే, సంస్థ యాజమాన్యం అసలు మాకు బాధ్యత ఏమిటన్నది.
యజమానిగా వైయస్ భారతి రెడ్డి, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని టిడిపి కోరుతుంట మా పార్టీకి కావాలనే ముడిపెడుతున్నారని ఎదురుదాడికి దిగింది. మీ ఛానళ్ల లో ఇటువంటి వచ్చినప్పుడు ఎంఏం చేశారని కూడా వైసీపీ ప్రశ్నిస్తున్నది. సాక్షిలో తనకూ భాగం వుందని చెప్పే వైఎస్ షర్మిల మాత్రం దీన్నంతటినీ తప్పు పట్టారు.
జగన్ హయాంలో కూడా పలు ఛానల్లో కీలక జర్నలిస్టుల పైన మాత్రమే కాక వాట్సాప్ గ్రూపులో సోషల్ మీడియాలో మాట్లాడిన వారిపై కూడా అరెస్టులు జరిగాయి. వయసులో ఇంచుమించువారైన కొల్లు అంకబాబును వున్న ఫ లాన తీసుకుపోవ్టడం చూశాం.సంస్థకు సంబంధం లేదనే వాదన నిలబడేది కాదు. నిజంగా తప్పు అని గుర్తిస్తే ఒప్పుకోవటం దిద్దుకోవడం వారి బాధ్యత. అప్పుడు న్యాయస్థానాలలో కూడా ముందస్తు రక్షణ పొందే అవకాశం ఉండేది.ఈ వ్యాఖ్యలను ఖండిరచే పేరిట ప్రత్యర్థి సంస్థల చర్చలలో నిర్వాహకులు, ప్యానలిస్టులుకూడా మహిళలను కించపర్చే భాషనే వాడటం మరో విచిత్రం.
అరెస్టులు కేసుల విషయంలో మీడియా స్వేచ్చ, మానవ హక్కులు వంటి కోణాలు ఎప్పుడూ ఎవరికైనా వర్తింపచేయవలసిందే. అరెస్టు తర్వాత కోర్టులో హాజరుపరిచినప్పుడు న్యాయమూర్తులు ఎలాగూ స్పందిస్తారని ఆశించవచ్చు. ఎందుకంటే నిబంధనల ప్రకారం వ్యవహరించటం పోలీసులు, ప్రభుత్వాల బాధ్యత. ఏది ఎలా వున్నా మందులు కూడా తీసుకొనివ్వకుండా పట్టుకురానవసరం లేదు. గతంలో మీరు ఇలాగే చేశారు అన్నది దానికి సమాధానం కానీ సమర్థన కానీ కాదు. ఇలాటి సందర్భంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ఎలా పెడతారు అని చాలామంది వేస్తున్న ప్రశ్న. దీనికీ న్యాయస్థానాల్లోనే సమాధానం దొరకాలి.మీడియా రెండుగా విడిపోయిన నేపథ్యం లో రాజకీయ కక్షలకు అవకాశమివ్వకూడదు.చట్టబద్ధంగా వ్యవహరించాలి.
రాజధాని సమస్యలెక్కడ?
ఒక విధంగా ఇవన్నీ డైవర్షన్ ఎత్తుగడలే. మహిళల చర్చ అటూ ఇటూ తిరిగి రాజధాని మార్గం పట్టడమేంటి?అమరావతిని మరోసారి రాజకీయ ఘర్షణకు, సెంటిమెంటల్ వాదనలకు కేంద్రంగా చేసుకోవడం రాష్ట్రానికి మంచిది కాదు. ఇంచుమించు ఈ షో సమయంలోనే విజయవాడలో వివిధ పార్టీలసీనియర్ నాయకులు మేధావులతో రాజధాని నిర్మాణం సంబంధిత సమస్యలపై సమగ్ర సెమినార్ జరిగింది అనేక విలువైన సూచనలు, విమర్శలు వచ్చాయి. వాటిపై కాస్తైనా చర్చ లేకుండా ఈ వివాదం చుట్టూనే మొత్తం పరిభ్రమించడం అంటే అటు మహిళలకు ఇటు రాజధాని చర్చకు కూడా అన్యాయం చేయడమే. ఇలాంటి పరిస్థితి సృష్టించడంలో ప్రధాన పార్టీలకు తమవైన వ్యూహాలు ఉండకపోవు. కానీ కావలసింది ఆ వ్యూహాలను పక్కనపెట్టి వాస్తవాలను అంగీకరించడం, తప్పులను దిద్దుకోవడం, .
వాళ్లు మనుషులు కారా?
ఈ ఎపిసోడ్లో అన్నిటికంటే ఘోరమైంది వేశ్యలన్న పద ప్రయోగం. రఘుపతి వెంకటరత్నం కాలం నుంచి సంస్కర్తలు వేశ్యాసమస్యపై పోరాడుతూనే ఉన్నారు.కందుకూరి వీరేశలింగం వేశ్యలను ఈసడిరచుకుంటే వృత్తిని తప్ప వారిని అవమానించచరాదని చెప్పడానికన్నట్టు గురజాడ అప్పారావు మధురవాణిని నాయికగా చేసుకొని కన్యాశుల్కం రచించారు. గిరీశం గురించి ప్రచారం చేశారు గానీ దానికి హీరో మధురవాణి.
అనేక రకాల ఈసడిరచబడిన వారిని సాటి మనుషులేనని చెప్పడానికే ఆధునిక కాలంలో సెక్స్ వర్కర్లు అనే మాట పుట్టింది. సుప్రీం కోర్టు కూడా నిర్దేశించిన ఈ పదమే పై నివేదికలలో కూడా ఉంది.. రకరకాలుగా మాట్లాడే నాయకులకు జర్నలిస్టులకు కూడా ఈ వాస్తవం దృష్టిలో లేకపోవడం విచారకరం. ఇప్పటికైనా పక్కదోవపట్టిన చర్చ పట్టాలెక్కించాలి . ఏదో చర్చలో ఎవరో చేసిన తప్పువల్ల ఒక తీవ్ర సామాజిక సమస్య పక్కకు పోకూడదు.
పులిరాజా మలిపాఠం అదే. .అదేవిధంగా ప్రాంతాలను వర్గాలను రాష్ట్రాలను కించపరిచే పనులు ఎప్పటికీ అనుమతించరానివి. అలాంటివి జరిగినప్పుడు వాటిని ఖండిరచడం కనీసం విడగొట్టుకోవడం నాయకుల పార్టీల బాధ్యత తప్ప పోటాపోటీలతో తప్పు దోవలను కొనసాగించడం సరికాదు. అదే ప్రెస్ అకాడమీలు మహిళా కమిషన్ల బాధ్యత కూడా.
(ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. వాటితో ఫెడరల్ తెలంగాణ ఏకీభివించినట్లుకాదు. ఫెడరల్ తెలంగాణ భావవ్యక్తీకరణ వేదిక)