గాజాపై కమ్యూనిస్టులు వేసిన పిటిషన్ కొట్టేసిన బాంబే హైకోర్టు?
x
గాజాలో ఆహరం కోసం ఎగబడుతున్న పాలస్తీనియన్లు

గాజాపై కమ్యూనిస్టులు వేసిన పిటిషన్ కొట్టేసిన బాంబే హైకోర్టు?

దేశభక్తులుగా ఉండండని సలహ ఇచ్చిన ధర్మాసనం


పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై సీపీఎం ర్యాలీ నిర్వహించాలని కోరుకుంది కానీ.. దీనిపై వేసిన పిటిషన్ ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఇలాంటి నిరసనలు దేశీయ సమస్యలు నుంచి ప్రజల దృష్టి మరల్చవచ్చని అభిప్రాయపడింది.

‘‘ఇంగ్లాండ్ ఆంగ్లేయులది, ఫ్రాన్స్ ఫ్రెంచి వారిది, అలాగే పాలస్తీనా అరబ్బులది’’ అని గాంధీ 1938 లో పాలస్తీనాలో హింస పెరిగిన సమయంలో అభిప్రాయపడ్డారు. ఎనిమిది సంవత్సరాల తరువాత యూదు సమాజం పట్ల సానుభూతి చూపిస్తూనే, యూదులు చేస్తున్న హింసను ఆయన వ్యతిరేకించారు.

బాంబే హైకోర్టు 1862 లో ఏర్పాటు అయింది. అక్కడి వేల మైళ్ల దూరంలో జరుగుతున్న విషయాల్లో ఎందుకు వేలు పెట్టాలని గాంధీ అనుకోలేదు. దేశంలో సొంత కష్టాలు ఉన్నప్పటికీ గాంధీ తన అభిప్రాయాలను వెల్లడించారు.

గాజాలో యుద్దానికి వ్యతిరేకంగా ముంబైలో బహిరంగ ర్యాలీని నిర్వహించడానికి అనుమతి కోరిన తరువాత దాతృత్వ మాటలతో కాకుండా బహిరంగంగా వ్యాఖ్యానించడం సముచితమని న్యాయస్థానం భావించింది.
శిథిలావస్థలో గాజా స్ట్రిప్..
అక్టోబర్ 7 న ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రమూక పాశవిక దాడి చేసి 1200 మంది యూదులను ఊచకోత కోసాక ఐడీఎఫ్ ప్రతీకార దాడులకు దిగింది. దీనివలన గాజా స్ట్రిప్ మొత్తం నాశనం అవడమే కాకుండా 60 వేల మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది పౌరులు ఉన్నారు. వేలాది మంది గాయపడ్డారు. అనేక వేల మంది వికలాంగులు అయ్యారు. అయినప్పటికీ హామాస్ ఇంకా పోరాటం చేస్తూనే ఉంది.
హమాస్ చేసిన దానికి భయంకరమైన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. హమాస్ అమాయక పాలస్తీనియన్ పౌరుల సలహ తీసుకోకుండానే ఇజ్రాయెల్ పై దాడి చేసింది. 1200 మందిని పాశవికంగా చంపడమే కాకుండా.. 250 మందిని కిడ్నాప్ చేసింది.
ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక దురాగతాలపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇంతకుముందేన్నడూ జరగని రీతిలో మానవతా సంక్షోభానికి దారితీసింది. ఇజ్రాయెల్ ఆహారాన్ని సైతం ఆయుధంగా మార్చింది. వారికి సాయం అందకుండా చేసింది. టెల్ అవీవ్ కు సుదీర్ఘంగా ఉన్న మిత్రదేశాలు ఇప్పుడు పాలస్తీనాను గుర్తించడానికి సిద్దంగా ఉన్నాయి.
దేశ భక్తులుగా ఉండండి: బాంబే హైకోర్టు
గాజాలో ఉన్నటువంటి దయనీయ స్థితికి అనుగుణంగానే సీపీఎం బహిరంగంగా ర్యాలీ తీయాలని నిశ్చయించుకుంది. పశ్చిమాసియాలో గణనీయ సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉన్నారు. భారత ఇంధన అవసరాలలో 40 శాతం ఈ దేశాలే తీరుస్తున్నాయి.
ముంబైలో చేసే ర్యాలీ న్యూఢిల్లీ ప్రయోజనాలకు ఎటువంటి హనీ కలిగించదు. గాజాలో జరుగుతున్న మానవ హనాన్ని ఖండించకుండా భారత ప్రభుత్వం నిరాకరించడం ఆ ప్రాంతానికి వ్యతిరేక సంకేతాన్ని పంపిస్తుంది. కానీ బాంబే హైకోర్టు మాత్రం భిన్నంగా ఆలోచించింది.
సీపీఎం వేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన న్యాయస్థానం.. గాజా, పాలస్తీనా నిరసనలు నిరుద్యోగం, మౌలిక సదుపాయాల బలహీనతలు వంటి దేశీయ సమస్యలను నుంచి ప్రజల దృష్టి మరల్చే అవకాశం ఉందని జస్టిస్ రవీంద్ర ఘగే, గౌతమ్ అంఖద్ అభిప్రాయపడ్డారు.
‘‘మన దేశంలో ఎదుర్కోవడానికి తగినన్ని సమస్యలు ఉన్నాయి. ఇలాంటివి మనకొద్దు. మీర సంకుచిత దృష్టి కలవారు అని చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది’’ అని న్యాయమూర్తులు అన్నారు.
‘‘మీరు గాజా, పాలస్తీనా వైపు చూస్తునే ఇక్కడ జరుగుతున్న వాటిని విస్మరిస్తున్నారు. మీ స్వంత దేశం గురించి మీరు ఎందుకు ఆలోచించడం లేదు? దేశభక్తులుగా ఎందుకు ఉండకూడదు’’ అని ప్రశ్నించింది.
యూదులపై గాంధీ సానుభూతి..
1938 లేదా 1946 లో గాంధీ ఇప్పుడున్న న్యాయస్థానంలా ఆలోచించి ఉండలేదు. ఆయన పాలస్తీనియన్ల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనియన్ పై యూదులు చేస్తున్న హింసను ఖండించారు.
గాంధీ దేశభక్తుడైన హిందువు. కమ్యూనిస్టుల నాస్తికులు కాదు. కానీ పాలస్తీనాలో జరుగుతున్న మానవ సంక్షోభాన్ని ఆయన మానవతా దృక్ఫథాన్ని అనుసరించారు. భారీ సంఖ్యలో పాలస్తీనా వాసులను బహిష్కరించిన తరువాత అమెరికా, బ్రిటన్ సహయాంతో యూదుల తమ మాతృభూమిగా మార్చుకున్నారు.
మతం కారణంగా హిట్లర్, యూరప్ చేతులో జాతి నిర్మూలన కు గురైన యూదులపై సానుభూతి వ్యక్తం చేయడానికి గాంధీ వెనకాడలేదు. ‘‘వారు క్రైస్తవంలో అంటరానీ వారు’’ అని అహింసా ప్రచారకుడు హరిజన్ లో పేర్కొన్నారు.
‘‘క్రైస్తవులు వారి పట్ల వ్యవహరించే తీరుకు, హిందువులు అంటరానీపట్ల వ్యవహరించే తీరుకు మధ్య ఉన్న అంతరాలు ఒకేలా ఉన్నాయి’’ అని తన పత్రికలో పేర్కొన్నారు.
గాజా గురించి..
మహత్మాగాంధీ యూదులు పాలస్తీనాపై తమను తాము రుద్దుకున్నందుకు, జియోనిస్ట్ పద్దతులను సూటిగా ప్రస్తావిస్తూ అనేక విమర్శలు చేశారు. వాటిని ఉగ్రవాద చర్యలుగా అభిప్రాయపడ్డారు. సమాజ సభ్యులు సాధించిన అద్బుతమైన విజయాలకు గాను యూదులను ప్రశసించిన ఆయన ఇలా అభిప్రాయపడ్డారు.
‘‘ ప్రతికూలత వారికి శాంతి పాఠఆలు నేర్పుతుందని ఎవరైనా అనుకుంటారు. స్వాగతించని భూమిపై తమను తాము బలవంతంగా ప్రతిస్థాపించుకునేందుకు ఎందుకు బ్రిటిష్, అమెరికన్ ఆయుధాలపై ఆధారపడాలి? పాలస్తీనాలో బలవంతంగా దిగినందుకు ఉగ్రవాదాన్ని ఎందుకు ఆశ్రయించాలి’’? అని పలు ప్రశ్నలు సంధించారు.
‘‘1947 లో ఉపఖండాన్ని ఇండియా- పాకిస్తాన్ గా విభజించి హిందూ- ముస్లిం గొడవలతో బ్రిటిష్ ఇండియా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు గాంధీజీ అనుభవించిన వేదన ఇది’’.
రెండో ప్రపంచ యుద్ధం, బెంగాల్ కరువులు, స్వాతంత్యోద్యమం కూడా పీక్ గా జరుగున్న సమయం ఇదే.
పాలస్తీనా- ఇజ్రాయెల్ సమస్యపై చర్చించే బదులు, దేశీయ సమస్యలపై దృష్టిపెట్టాలని న్యాయవ్యవస్థ సభ్యుడు గాంధీని అడిగి ఉంటే పరిస్థిని ఒకసారి ఊహించుకోండి.
ఇప్పుడు బాంబే హైకోర్టు సీపీఎంకి చెప్పిన విషయాలు కూడా ఈ కోవలోని చెందిన సారూప్యతలు ఉన్నాయి. తాము పరిపాలన పరమైన అంశాల్లోకి జోక్యం చేసుకోమని చెప్పి, న్యాయమూర్తులు సీపీఎం అభ్యర్థనను తిరస్కరించి ఉండేవారు.
న్యాయమూర్తులు చెల్లుబాటు అయ్యే ఇతర అంశాలను ఉదహరించి ఉండేవారు. కానీ సీపీఎం పార్టీని మీకు సంకుచిత దృష్టి కలవారని, దాని సభ్యులు ప్రపంచవ్యాప్తంగా ఖండించిన గాజా మారణ హోమాన్ని ఖండించాలని అనుకున్నప్పుడూ దానిని దేశభక్తులుగా ఉండాలని కోరడం నిజంగా ఆశ్చర్యం.
నిజానికి యూదు దేశానికి మిత్రరాజ్యంగా ఉంటునన దేశాలన్నీ కూడా దానికి దూరమవడం ప్రారంభించాయి. గాంధీలా ఆలోచించకూడదని భారత ప్రజలు గాజా భయానకతను విస్మరించాలని న్యాయ వ్యవస్థ పేర్కొంది.
( ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను గౌరవిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. ఇవి ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబిచవు)


Read More
Next Story