
రష్యా చమురు కొనుగోలుకు అమెరికా అనుమతి తీసుకోవాలా?
కాంగ్రెస్ విమర్శకు అధికార పార్టీ సమాధానమేంటి?
అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వ్యాఖ్యలు భారత్లో అగ్గిరాజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాన పక్షానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చమురు కొరత రాకుండా ఉండేందుకు రష్య నుంచి చమురు కొనేందుకు భారత్కు తామే అనుమతినిచ్చామని ఓ టెలివిజన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్చార్జ్ కమ్యూనికేషన్స్ జైరామ్ రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను ప్రధాని మోదీ పాటిస్తున్నారని చెప్పడానికి ఇదే సాక్ష్యమని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఈ ఆరోపణలను తిరస్కరించింది. భారతదేశం సార్వభౌమ రాష్ట్రం అని, ఏ దేశం అనుమతి తీసుకోవడానికి బందీ కాదని వ్యాఖ్యానించింది. ఇక్కడ ప్రధానంగా అమెరికా కొన్ని ఆంక్షల నుంచి మినహాయింపును ఇచ్చినప్పటికీ, రష్యా చమురు కొనుగోలు చేయడానికి భారత్ స్వతంత్ర నిర్ణయం తీసుకుంది అని ప్రతిపక్ష అభిప్రాయాన్ని తోసిపుచ్చింది.

