
ఈయూ మద్దతుతో జనరల్ అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చిన ఉక్రెయిన్
శాంతి చర్చలు ఆపేది లేదని ప్రకటించిన అమెరికా
ఉక్రెయిన్ భూభాగంలో ఉన్న రష్యన్ దళాలను ఉపసంహరించాలని కోరుతూ యూరోపియన్ యూనియన్ మద్దతుతో కీవ్, ఐరాసలో తీసుకొచ్చిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని అమెరికా ఆ దేశాలపై ఒత్తిడి చేస్తోంది. ఈ విషయాన్ని అమెరికా అధికారి, యూరోపియన్ దౌత్యవేత్త ఆదివారం తెలిపారు.
కానీ ఉక్రెయిన్ మాత్రం ముసాయిదా తీర్మానాన్ని ఉపసంహరించుకోవడానికి నిరాకరించింది. ఉక్రెయిన్ పై రష్యా దాడికి మూడవ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం యూఎస్ జనరల్ అసెంబ్లీ దానిపై ఓటు వేస్తుందని ఇద్దరు యూరోపియన్ దౌత్యవేత్తలు తెలిపారు.
పేరు వెల్లడించకూడదనే షరతుతో ఓ అధికారి ఈ విషయాలు వెల్లడించారు. 193 దేశాల జనరల్ అసెంబ్లీ అప్పుడూ అమెరికా ముసాయిదా తీర్మానంపై ఓటు వేసే అవకాశం ఉందని దౌత్యవేత్తలు, ప్రయివేట్ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.
యూఎన్ భద్రతామండలిలో ఈ ప్రతిపాదనపై ఓటింగ్ కోరుతోంది. 15 దేశాల మండలి సోమవారం మధ్యాహ్నం ఉక్రెయిన్ సమావేశం అవుతోంది. ఆదివారం సాయంత్రం వెంటనే ఓటింగ్ షెడ్యూల్ చేసింది. రష్యా అభ్యర్థన మేరకు దానిని మంగళవారం వాయిదా వేయవచ్చని యూరోపియన్ దౌత్యవేత్తలు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఉక్రెయిన్ ను పక్కన పెట్టి రష్యాతో చర్చలు ప్రారంభించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సౌదీ వేదికగా చర్చలు జరిగాయి. అయితే దీనిలోకి ఈయూ, ఉక్రెయిన్ ను ఆహ్వానం లేకుండా చేయడంతో ఆ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
భద్రతామండలిలో రష్యా ఉండటంతో అక్కడ ఎలాంటి తీర్మానం పాస్ కాదు. అయితే జనరల్ అసెంబ్లీ లో ఎవరికి వీటోలు ఉండవు. దాని ఓట్లను ప్రపంచ అభిప్రాయానికి చిహ్నంగా భావిస్తారు. అయితే వీటికి చట్టబద్ధంగా పరిగణించవు.
ఫిబ్రవరి 24, 2022 న రష్యా, ఉక్రెయిన్ పై దాడికి దిగింది. అప్పటి నుంచి జనరల్ అసెంబ్లీ అనేక తీర్మానాలు చేసినప్పటికీ రష్యా వాటిని పట్టించుకోలేదు. ప్రస్తుతం అమెరికా ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేస్తోంది. ట్రంప్ సోమవారం వాషింగ్టన్ లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటున్న తరుణంలో ఇది జరిగింది.
అమెరికా ఏమనుకుంటోంది..
యుద్దాన్ని ముగించడానికి అమెరికా కట్టుబడి ఉంది. ఆ క్షణం ఇదే అని మేము నమ్ముతున్నామని అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో శుక్రవారం రాత్రి అన్నారు.
ఈ ప్రక్రియలో ఎన్ని సవాళ్లు ఎన్నైనా ఉండవచ్చు కానీ శాశ్వత శాంతి సాధించాలని మా లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. కానీ ఐరాస దానిని అంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ మేము వాటిని సాగనీయం అన్నారు.
రష్యా - ఉక్రెయిన్ వివాదం అంతటా విషాదకరమైన ప్రాణనష్టాన్ని ‘‘ యూఎస్ ముసాయిదా తీర్మానం అంగీకరిస్తుంది. వివాదానికి త్వరిత ముగింపును సూచిస్తుంది.
ఉక్రెయిన్ - రష్యా మధ్య శాశ్వత శాంతిని మరింత ప్రొత్సహిస్తుంది’’ ఇది మాస్కో దండయాత్రను ఎప్పుడూ ప్రస్తావించలేదు. రష్యా ఐక్యరాజ్యసమితి రాయబారీ వాసిలీ నెబెంజియో మాట్లాడుతూ.. అమెరికా తీర్మానం మంచి చర్య అన్నారు.
Next Story