రేపు ఆరావళి కేసును విచారించబోతున్న సుప్రీంకోర్టు
x
నిరసన చేస్తున్న పర్యావరణవేత్తలు

రేపు ఆరావళి కేసును విచారించబోతున్న సుప్రీంకోర్టు

కొత్త నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణవేత్తలు


ఆరావళి కొండల నిర్వచనంపై సుప్రీంకోర్టు ఆమోదించిన వివాదం పై తిరిగి సుప్రీంకోర్టు సుమోటోగా కేసును విచారించబోతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, అగస్టీన్ జార్జ్ మసిహ్ లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల వేకేషన్ బెంచ్ ఈ విషయాన్ని రేపే విచారించబోతోంది. ఈ కేసుకు ‘ఇన్ రి డెఫినేషన్ ఆఫ్ ఆరావళి హిల్స్ అండ్ రేంజ్స్ అండ్ యాన్సిలరీ ఇష్యూస్’ అనే పేరు పెట్టారు.

దేని గురించి గొడవ..
ఈ సమస్యకు ప్రధాన కారణం ఏంటంటే.. ఢిల్లీ శివార్ల నుంచి గుజరాత్ వరకూ నాలుగు రాష్ట్రాలలో విస్తరించిన పురాతన పర్వత శ్రేణి. ఇది వాతావరణాన్ని నిరోధిస్తుంది. కొత్తగా రూపొందించబడిన నిర్భంధ చట్టపరమైన నిర్వచనం వివాదానికి కారణమవుతోందని, ఈ చర్య నియంత్రణ లేని మైనింగ్, నిర్మాణ కార్యకలాపాలకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇటీవల కోర్టు తీర్పులు అధికారిక వివరణలు కొండ అంటే ఏమిటో పునర్నిర్వచించడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఈ వివాదం ఢిల్లీ, ఎన్సీఆర్, హర్యానా, రాజస్థాన్ అంతటా మైనింగ్, నిర్మాణం, పరిరక్షణపై చాలా విస్తృతమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఇది ప్రపంచంలోనే పురాతన పర్వత శ్రేణులలో ఒకటి.
కొండ అంటే ఏంటీ?
నవంబర్ 20న సుప్రీంకోర్టు ఆరావళి కొండలు, శ్రేణుల కొత్త నిర్వచనాన్ని ఆమోదించింది. ప్రపంచంలోని పురాతన పర్వత వ్యవస్థను రక్షించడానికి ఆరావళి కొండలు, శ్రేణుల నిర్వచనంపై పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కమిటీ చేసిన సిఫార్సులను సుప్రీంకోర్టు ఆమోదించింది.
‘‘అరవల్లి కొండ’’ అనేది ఆరావళి జిల్లాల్లోని ఏదైనా భూరూపం నిర్వచిస్తామని కమిటీ పేర్కొంది. ఇది దాని స్థానిక భూభాగానికి 100 మీటర్ల లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉంది.
ఈ నియమం ప్రకారం వంద మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కొండలు మాత్రమే ఆరావళి పర్వతాలుగా గుర్తిస్తారు. ముఖ్యంగా ఈ కొలతలు సముద్ర మట్టం నుంచి కాదు, ప్రతి కొండ అడుగు భాగం నుంచి ఈ లెక్కలు పరిగణించబోతున్నారు.
ఇదే సమస్యకు ప్రధాన కారణంగా ఉంది. ‘అరవల్లి శ్రేణి’ అనేది ఒకదానికొకటి 500 మీటర్ల దూరంలో ఉన్న రెండు లేదా అంతకంటే ఎక్కువ కొండల సమాహారం.
నిర్వచనం ఏంటంటే..
ఆరావళి కొండలను నిర్వచించేటప్పుడు కమిటీ కొన్ని సూచనలు చేసింది. ‘‘స్థానిక ప్రాంతం నుంచి వంద మీటర్ల లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఆరావళి జిల్లాల్లో ఉన్న ఏదైనా భూరూపాన్ని ఆరావళి కొండలుగా పిలుస్తారు.
దాని చుట్టు ఉన్న స్థానిక రూపాలను ఆరావళి కొండలలో భాగంగా చూస్తారు’’ ఆరావళి లోని రెండు కొండల మధ్య దూరం 500 మీటర్ల కంటే తక్కువగా ఉండాలని సూచించింది.
పర్యావరణవేత్తలు ఏం చెబుతున్నారు..
కొత్త కమిటీ నిర్వచనాలను పర్యావరణవేత్తలు సానుకూలంగా స్పందించలేదు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) ప్రకారం ఆరావళి శ్రేణులు 90 శాతానికి పైగా విస్తరించి ఉన్నాయని హెచ్చరించింది.
ముఖ్యంగా వంద మీటర్ల ఎత్తు నిబంధనలు వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం రాజస్థాన్ లోని ఆరావళి పర్వతాలు 99 శాతం తుడిచిపెట్టుకుపోతాయని అన్నారు.
ఈ నిబంధనలు ఇలాగే అమలు చేస్తే కొండ వ్యవస్థలను భూ వినియోగ మార్పుకు ఉపయోగించబడే ప్రమాదం ఉంది. భౌగోళిక శాస్త్రం, జీవావరణ శాస్త్రం, వన్యప్రాణుల అనుసంధానం, వాతావరణ స్థితి స్థాపకత వంటి శాస్త్రీయ ప్రమాణాలను ఉపయోగించి ప్రభుత్వం ఆరావళి ప్రాంతాలను నిర్వచించాలని పర్యావరణ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం ఏమనుకుంటోంది..
ఆరావళి పై కొత్త నిర్వచనం నియంత్రణను బలోపేతం చేయడం, ఏకరూపతను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రాల అంతటా మైనింగ్ ను స్థిరంగా నిర్వచించడానికి ఒకే లక్ష్యంతో కూడి ఫ్రేమ్ వర్క్ అవసరమని అంటోంది.
ఈ నిర్వచనం ప్రకారం వాలులు, దాని పక్కనే ఉన్న భూరూపాలు, కొండ సమూహాలను, వాటి పర్యావరణ సంబంధాలను కాపాడుతుందని అది పేర్కొంది. వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తులో అన్ని భూభాగాలు స్వయంచాలకంగా మైనింగ్ కోసం అనుమతి ఇస్తామనే ఆరోపణలను పర్యావరణ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది.
ఆరావళి పర్వత శ్రేణిలో 1,47,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో కేవలం రెండు శాతం మాత్రమే తవ్వకాలు జరుపుతున్నామని దీనికి వివరణాత్మక అధ్యయనాలు, అధికారిక ఆమోదం తరువాత మాత్రమే అని పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు.
ఆరావళి కొండలు ముఖ్యమైనవి..
ఆరావళి శ్రేణి ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ దేశ పర్యావరణ స్థిరత్వాన్ని కాపాడటంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది థార్ ఎడారి నుంచి వచ్చే దుమ్ముతో కూడిన గాలులను ఆపుతుంది.
ఇసుక, సూక్ష్మ కణాలు ఇండో- గంగా మైదానాలు వ్యాపించకుండా నిరోధిస్తుంది. తద్వారా వాయు కాలుష్యాన్ని అరికడుతుంది. రెండోవది జైపూర్, గురుగ్రామ్, వంటి పట్టణ కేంద్రాలను నిలబెట్టే జలశయాలను తిరిగి నింపడానికి వర్షపు నీరు పగిలిన రాళ్ల ద్వారా ఫిల్టర్ చేయడం వలన భూగర్భ జలాల శుద్దీ చేయడానికి ఆరావళీ కీలకంగా మారుతున్నాయి.
ఇది ఎడారీకరణను నివారించడంతో పాటు భూగర్భ జలాలను తిరిగి రీఛార్జ్ చేయడంలో, జీవనోపాధికి మద్దతు ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని నిఫుణులు అంటున్నారు.
వాతావరణం నియంత్రించడం..
ఆరావళి అడవులు, పొదలు స్థానిక వాతావరణాన్ని నియంత్రించడంలో వేడిని తగ్గించడంలో, ఎడారీకరణకు గురయ్యే పాక్షిక శుష్క మండలాల్లో నేలలను నిలుపుకోవడంలో సహయపడతాయి. పర్యావరణపరంగా ఈ శ్రేణి హర్డీ పొడి అడవులు, గడ్డి భూములు, వన్య ప్రాణుల కారిడార్ లను నిలబెట్టి వాతావరణ తీవ్రతలకు వ్యతిరేకంగా బఫర్ జోన్ గా పనిచేస్తోంది.
సుప్రీంకోర్టు..
సుప్రీంకోర్టులో టీఎన్ గొదవర్మన్ తిరుముల్పాడ్ కేసులో చాలాకాలంగా నడుస్తున్న పర్యావరణ వ్యాజ్యం నుంచి కేసులో సుప్రీంకోర్టు 29 పేజీల తీర్పును వెలువరించింది.
‘‘కోర్ అతిక్రమించని ప్రాంతాలలో మైనింగ్, నిషేధానికి సంబంధించిన సిఫార్సులను మేము మరింత అంగీకరిస్తున్నాము’’ అని సీజేఐ గవాయి అప్పట్లో తీర్పు చెప్పారు.
ఆరావళి కొండలు, శ్రేణులలో అక్రమ మైనింగ్ నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలను, స్థిరమైన మైనింగ్ కోసం సిఫార్సులను కూడా ధర్మాసనం అంగీకరించింది.
పర్యావరణ, పరిరక్షణ- క్లిష్టమైన, పునరుద్దరణ ప్రాధాన్యత గల ప్రాంతాలకు అనుమతించబడిన ప్రాంతాలను గుర్తించాలని కూడా తన ఆదేశాలలో పేర్కొంది.
ఆరావళి పర్వతాలను పచ్చని అవరోధంగా అభివర్ణిస్తూ, థార్ ఎడారి తూర్పు వైపు వ్యాపించకుండా నిరోధించి, జీవ వైవిధ్యానికి మద్దతు ఇస్తుందని పేర్కొంది. పర్యావరణ పరిరక్షణను నిర్ధారించడానికి, భూ వినియోగాన్ని నియంత్రించడానికి, అనుమతించదగిన మైనింగ్ కార్యకలాపాలను నిర్ణయించడానికి స్పష్టమైన, శాస్త్రీయ నిర్వచనం అవసరమని కోర్టు అభిప్రాయపడింది.


Read More
Next Story