
ఖామెనీ హత్యపై సోనియా గాంధీ ఆగ్రహం.
పార్లమెంట్లో చర్చకు డిమాండ్..
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటనపై పార్లమెంట్లో చర్చ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ హత్య అంతర్జాతీయ చట్టానికి వ్యతిరేకమని, భారత విదేశాంగ విధానంపై సందేహాలు తలెత్తిస్తున్నాయని పేర్కొన్నారు. మార్చి 1న ఖామెనీని అమెరికా–ఇజ్రాయెల్ సైన్యాలు హతమార్చినట్లు ఆమె చెప్పారు. పదవిలో ఉన్న దేశాధినేతను హత్య చేయడం అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీస్తుందన్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం మౌనం పాటించడం గమనార్హమన్నారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
Next Story

