ఏపిలోని అచ్యుతాపురం సెస్ లో రియాక్టర్ పేలి 16 మంది దుర్మరణం
x

ఏపిలోని అచ్యుతాపురం సెస్ లో రియాక్టర్ పేలి 16 మంది దుర్మరణం

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలి ఇప్పటి వరకు 16 మంది మృతి చెందారు. సుమారు 50మందికి పైన గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలి ఇప్పటి వరకు 16 మంది మృతి చెందారు. వారిలో పదిమందిని గుర్తించారు. ఈ భారీ ప్రమాదంలో మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన నేటి మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో జరిగింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.రియాక్టర్ పేలుడులో గాయపడిన వారందరినీ స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా సంతాపం ప్రకటించారు.. రియాక్టర్ ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణం మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద ఉన్న ఎస్ ఈ జెడ్ (SEZ) లో ఎసెన్షియ ఫార్మా కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీలో మధ్యాహ్నం రియాక్టర్ పేలినట్లు తెలిసింది. దీంతో సమీపంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆ ధాటికి మరణించినట్లు సమాచారం అందింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో.. ప్లాంట్ ఏజీఎం సన్యాసినాయుడు, ల్యాబ్ హెడ్ రామిరెడ్డి, కెమిస్ట్ హారిక, ప్రొడక్షన్ ఆపరేటర్ పార్థసారథి, ప్లాంట్ హెల్పర్ వై. చిన్నారావు ఆపరేటర్ ఆపరేటర్లు గణేష్, మోహన్, ప్రశాంత్, ఎం నారాయణ, పి. రాజశేఖర్ మృతుల్లో ఉన్నట్లు గుర్తించారు. మరో నలుగురు మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి..

పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ధాటికి పైకప్పు కోరడంతో శిబిరాలకు కింద చాలామంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. శిథిలాలు తొలగించడం ద్వారా వాటి కింద చిక్కుకుపోయిన కార్మికులు, ఉద్యోగులను రక్షించడానికి ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. రియాక్టర్ పేలుడుతో ఫార్మా కంపెనీలో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో అగ్నిమాపక దళంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెలుడు వల్ల తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ముఖ్యమంత్రి రేపు అనకాపల్లి పయనం

సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాదం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన రేపు అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఫార్మా సెజ్ లోని ఎసెన్షియా అనే కంపెనీలో రియాక్టర్ పేలి మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన ఘటనా ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి బుధవారం నిరంతరం సమీక్ష చేశారు. సహాయక చర్యలపై జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు. హెల్త్ సెక్రటరీతో మాట్లాడి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం సూచించారు. అవసరమైతే క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్ తరలించేందుకు ఎయిర్ అంబులెన్సులను వినియోగించాలని ఆదేశించారు. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదంపై ఉన్నత స్ధాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విచారణ ఆధారంగా...ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు.

అచ్యుతాపురం సెజ్ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన మంత్రి టి.జి భ‌ర‌త్

అన‌కాప‌ల్లి జిల్లా రాంబిల్లి మండ‌లం అచ్యుతాపురం ఫార్మా సెజ్ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్పీతో మాట్లాడి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య‌ సేవ‌లు అందించాల‌ని చెప్పారు. హోంమంత్రి వంగ‌ల‌పూడి అనిత‌తో ఫోన్‌లో మాట్లాడి ఘ‌ట‌న నేప‌థ్యంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల‌గ‌కుండా చూడాల‌ని టి.జి భ‌ర‌త్ కోరారు. ప‌రిశ్ర‌మ‌ల శాఖ అధికారులు అక్క‌డే ఉండి స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొనాల‌ని ఆయ‌న‌ ఆదేశించారు.
సీఎం చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఫార్మా సెజ్ లోని ఎసెన్షియా అనే కంపెనీలో రియాక్టర్ పేలి మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన ఘటనా ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి బుధవారం నిరంతరం సమీక్ష చేశారు. సహాయక చర్యలపై జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు. హెల్త్ సెక్రటరీతో మాట్లాడి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం సూచించారు. అవసరమైతే క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్ తరలించేందుకు ఎయిర్ అంబులెన్సులను వినియోగించాలని ఆదేశించారు. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదంపై ఉన్నత స్ధాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విచారణ ఆధారంగా...ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు.
థర్డుపార్టీ ఏజన్సీల వల్లే కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు సన్నగిల్లాయి
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన థర్డు పార్టీ ఏజన్సీ విధానం కారణంగానే కంపెనీల్లో భద్రణా ప్రమాణాలు సన్నగిల్లి ప్రమాదాలకు దారితీస్తున్నాయని రాష్ట్ర కార్మిక, ప్యాక్టరీలు, బాయిలర్స్ & భీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టరు ప్రేలడం వల్ల జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మట్లాడుతూ బాదితులకు తక్షణ సహాయక చర్యలు అందజేస్తున్నట్లు తెలిపారు. అచ్యుతాపురం సెజ్ లో ఎసెన్సియా అడ్వాన్సుడ్ సైన్సెస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ రియాక్టర్ ప్రేలిన ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణ సహాయక చర్యల్లో భాగంగా దగ్గర్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుత్రుల్లో చికిత్స అందజేయడం జరుగుతున్నదన్నారు. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ సంఘన స్థలానికి హుటాహటిన చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ధర్డు పార్టీ ఏజన్సీ విదానాన్ని ప్రవేశపెట్టడం వల్ల కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు పూర్తిగా సన్నగిల్లాయన్నారు. కార్మిక శాఖ పూర్త స్థాయిలో నిర్లక్ష్యానికి గురైందన్నారు. విశాఖపట్నంలో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉందన్నారు. ఇ.ఎస్.ఐ. ఆసుపత్రుల నిర్వహణ కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయడం జరిగిందని, కేంద్ర నిధులను కూడా సక్రమంగా వినియోగించుకో లేకపోవడం జరిగిందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు అందాల్సిన రాయితీలను, సంక్షేమ పథకాలను నిలుపుదల చేయడం జరిగిందన్నారు. ఈ సమస్యలను అన్నింటినీ సరిదిద్దేందుకు అధికారులతో పలు మార్లు సమీక్షలు నిర్వహిస్తూ కార్మిక శాఖలో పూర్వవైభవాన్ని తీసుకు వచ్చేందకు చర్యలు చేపట్టినట్లు
Read More
Next Story