
బోట్స్వానా నుంచి కునోకు 8 చిరుతలు
ఆరు ఆడ, రెండు మగ చిరుతలు
మధ్య ప్రదేశ్లో ‘ప్రాజెక్ట్ చీతా’ మరో ముందడు వేస్తుంది. ఆఫ్రికా దేశం బోట్స్వానా నుంచి 8 చిరుతలు శనివారం ఉదయం కునో నేషనల్ పార్క్కు చేరతాయని అధికారులు తెలిపారు. వీటి రాకతో దేశంలో చిరుతల మొత్తం సంఖ్య 46కి చేరనుంది.
బోట్స్వానా నుంచి తీసుకువస్తున్నచిరుతలతో ఆరు ఆడ, రెండు మగ చిరుతలున్నాయి. తొలుత విమానంలో గ్వాలియర్క్కు చేరుకుంటాయి. అక్కడి నుంచి ఉదయం 9:30 గంటలకు హెలికాప్టర్ల ద్వారా కునోకి తరలిస్తారు. ఈ ప్రక్రియలో భారత వైమానిక దళం (IAF) కీలక సహకారం అందిస్తోంది.
ప్రాజెక్ట్ చీతా డైరెక్టర్ ఉత్తమ్ శర్మ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ చీతా మిషన్ 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారని చెప్పారు. మొదటి బ్యాచ్ నమీబియా నుంచి, రెండవ బ్యాచ్ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చాయని పేర్కొన్నారు.
చిరుతల పునరావాసం సవాళ్లతో కూడుకున్నది. ఆరోగ్య సమస్యలు, వాతావరణం, గాయాల కారణంగా కొన్ని చిరుతలు మరణించాయి. 2023 నుండి ఇప్పటివరకు 39 పిల్లలు జన్మించగా, అందులో 27 మాత్రమే బతికాయి. ప్రస్తుతం మూడు చిరుతలను గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యానికి, మిగతావి కునోలో ఉంచారు. అధికారులు, వ్యాధులు వ్యాప్తి చెందకుండా, చిరుతలను వేర్వేరు ప్రాంతాల్లో ఉంచడం అవసరం అని తెలిపారు. ఈ తాజా బ్యాచ్ రాకతో ప్రాజెక్ట్ చీతా మరింత బలవంతం అవుతుంది మరియు దేశంలో చిరుతల పునరుజ్జీవన ప్రయాణం వేగం పుంజుకుంటుంది.

