
పవన్ కల్యాణ్ కాన్వాయ్కు తృటిలో తప్పిన ముప్పు
ఒకదానికొకటి ఢీకొనడం వల్ల ప్రమాదం చోటు చేసుకుంది.
విశాఖపట్నంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్కు స్వల్ప ప్రమాదం జరిగింది. సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వైపు కాన్వాయ్ వెళ్తున్న సమయంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం ఎలా జరిగింది?
కాన్వాయ్ లో ముందు వెళ్తున్న ఒక వాహనం అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ వరుస ఢీకొనడం వల్ల కాన్వాయ్లోని చివరి వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది.
పవన్ కల్యాణ్ క్షేమం
ప్రమాదం జరిగిన సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ కాన్వాయ్లో లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆయనను పికప్ చేసుకోవడానికి వాహనాలు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో భద్రతా సిబ్బందికి కూడా ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు.

