
పుట్టా మహేష్ కుమార్ తండ్రి సుధాకర్ యాదవ్
మా అబ్బాయి పుట్టా మహేష్ కి డ్రగ్స్ వాసనే పడదు!
మార్చి 15న జరిగిన ఘటనపై పది రోజుల తర్వాత మహేష్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించారు
డ్రగ్స్ కేసు ప్రకంపనలు మొదలైన 10 రోజుల తర్వాత ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించారు. పది రోజుల మౌనం తర్వాత స్పందించిన ఆయన, తన కుమారుడు నిష్కళంకుడని, రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పుట్టా సుధాకర్ యాదవ్ వివరణ ప్రకారం, ఆ రోజు ఘటన ఇలా సాగింది.. ఓ విందు కార్యక్రమానికి అందిన ఆహ్వానం మేరకే మహేష్ అక్కడికి వెళ్లారు.
అక్కడ డ్రగ్స్ వ్యవహారం జరుగుతోందని తెలుసుకుని, మహేష్ వెలుపలికి వచ్చే ప్రయత్నం చేస్తుండగానే 'ఈగల్ టీమ్' అధికారులు అక్కడికి చేరుకున్నారు. మొదట నిర్వహించిన పరీక్షల్లో 'నెగిటివ్' వచ్చిందని, అయితే ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన ఐదు గంటల తర్వాత పోలీసులు 'పాజిటివ్' అని ప్రకటించడం విచిత్రంగా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఆరోగ్య కారణాల ప్రస్తావన..
తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సుధాకర్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మహేష్కు 2021లో గుండె శస్త్రచికిత్స జరిగింది. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటే ప్రాణాపాయం అని తెలిసి కూడా అంత సాహసం చేస్తారా?" అని ఆయన ప్రశ్నించారు.
పోలీసుల విచారణ అనంతరం ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో మహేష్ రక్త, మూత్ర పరీక్షలు చేయించుకున్నారని, అక్కడ ఫలితాలు 'నెగిటివ్' అని వచ్చాయని సుధాకర్ యాదవ్ వెల్లడించారు. ఇది తమ నిజాయితీకి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్గా స్పందించి ఎంపీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి మహేష్ ఇప్పటికే తన వివరణను పార్టీకి పంపించారని తండ్రి ధృవీకరించారు.
పూర్వాపరాలు: వివాదం ఎలా మొదలైంది?
మార్చి 15న హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ లో జరిగిన పార్టీపై పోలీసులు దాడి చేసినప్పుడు ఎంపీ పుట్టా మహేష్ పేరు తెరపైకి వచ్చింది. డ్రగ్స్ వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. ప్రత్యర్థి పార్టీలు ఎంపీ రాజీనామాకు డిమాండ్ చేయగా, ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
తండ్రిగా సుధాకర్ యాదవ్ ఇచ్చిన వివరణ ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఎయిమ్స్ నివేదిక వర్సెస్ స్థానిక పోలీసుల నివేదికల మధ్య ఉన్న వ్యత్యాసం ఈ కేసును మరిన్ని మలుపులు తిప్పేలా కనిపిస్తోంది. నిజం నిలకడ మీద తెలుస్తుందని పుట్టా కుటుంబం ధీమా వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యమయ్యాయి.
టీడీపీ ఎంపీ పుట్టా మహేష్తో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అతని సోదరుడు పలువురు డ్రగ్స్ తీసుకున్నట్ల నిర్ధారించారు. వారందరికి ప్రస్తుతం డ్రగ్స్ టెస్టులు జరుగుతున్నాయన్న పోలీసులు.. వాళ్లు తీసుకున్నది ఎలాంటి డ్రగ్స్ అనేది పూర్తిస్థాయిలో టెస్టులు ఫలితాల తరువాతే తెలుస్తాయని చెప్పారు.
డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు
అయితే మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూరిన్ టెస్ట్ విషయంలో ఎంపీ పుట్టా మహేష్ నాటకం ఆడినట్లు తేలింది. యూరిన్ శాంపిల్ బదులు వాటర్ ఇచ్చారు. అనుమానం రావడంతో శాంపిల్ బాటిళ్లను టెస్టు చేయగా..శాంపిల్ బాటిల్లో ఉంది యూరిన్ కాదని నీళ్లని గుర్తించారు. దీంతో ఎంపీ పుట్టాపై పోలీసులు సీరియస్ అయ్యారు. టెస్టులు కోసం యూరిన్ శాంపిల్ ఇవ్వాలని.. నీళ్లు కాదని టీడీపీ ఎంపీ పుట్టా మహేష్పై పోలీసులు సీరియస్ అయ్యారు. అనంతరం పుట్టా మహేష్ నుంచి యూరిన్ సేకరించి టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో ఎంపీ పుట్టా మహేష్ బ్లడ్ టెస్టులో పాజిటీవ్గా నిర్ధారణైంది.
డగ్స్ పార్టీపై ఈగల్ ఎస్పీ గిరిధర్..
డగ్స్ పార్టీపై ఈగల్ ఎస్పీ గిరిధర్ మీడియాతో మాట్లాడారు. శనివారం అర్ధరాత్రి 3గంటల నుంచి ఫాం హౌస్లో పార్టీ జరుగుతోంది. రాత్రి 7.30 సమయంలో ఎంపీ పుట్టా మహేష్ ఫాం హౌస్కు వచ్చారు. సోదాల సమయంలో కాల్పులు జరిపారు. గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 11మందిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వారిలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించాం’అని పేర్కొన్నారు.
Next Story

