
మెడికల్ కాలేజీల్లో పిపిపికి వ్యతిరేకంగా ధర్నా
‘వైద్యరంగంలో పిపిపి విధానమే పెద్ద స్కాం, దాన్ని వదిలేయండి’
ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పిపిపి పేరుతో ప్రయివేటు యాజమాన్యాలకు అప్పగించే ప్రయత్నం విరమించుకోవాలని జనవరి 9న విజయవాడలోని ధర్నా చౌక్ లో జరిగే సామూహిక నిరసన దీక్షను పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. పిపిపి విధానాన్ని వ్యతిరేకించే అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు, బహుజన సంఘాలు భాగస్వామ్యులై సామూహిక నిరసన దీక్షను విజయవంతం చేయాలని కమిటీ కోరింది.ధర్నా ద్వారా ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి చేరవేయాలని కమిటీ అందరికి విజ్ఞప్తి చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో నేడు వైద్య రంగాన్ని పిపిపి విధానంలో కొనసాగించడం అతి పెద్ద స్కాం గా మారబోతుందని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ అనుమానాన్ని వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో నేడు వైద్య రంగాన్ని పిపిపి విధానంలో కొనసాగించడం అతి పెద్ద స్కాం గా మారబోతుందని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ హెచ్చరించింది.
ఈనెల 26వ తేదీ గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ డా. ఆలా వెంకటేశ్వర్లు, కో - కన్వీనర్లు, జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి ప్రసంగిస్తూ వ్యవసాయ రంగం లో నిరంతరం నష్టాన్ని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రైతులకు కూడా వయాబిలిటీ గ్యాప్ ఫండ్ వర్తింప చేయగలరా అని రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
"రాష్ట్ర ప్రభుత్వం 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పిపిపి పద్ధతిలో నిర్మించి నిర్వహించడం వలన ఆ భారం రోగులపై, వైద్య విద్యార్థులపై పడుతుంది, పిపిపి విధానంలో నిర్మించే విమానాశ్రయాలు, రహదారులతో వైద్య రంగాన్ని పోల్చకూడదు. 4 ప్రభుత్వ వైద్య కళాశాలలకు రెండు పర్యాయాల టెండర్ల ప్రక్రియను నిర్వహించినా కేవలం ఒకే ఒక్క బిడ్ రావడానికి ప్రజా వ్యతిరేకతయే కారణం. దీనిని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి పిపిపి విధానానికి స్వస్తి పలకాలి," అని వారు కోరారు. ఉద్యోగాలలో రాజ్యాంగ పరమైన రిజర్వేషన్లను పరోక్షంగా అంత మొoదిడంచడానికే చంద్రబాబు నాయుడు పిపిపి విధానం పట్ల అమిత ప్రేమను కనబరుస్తున్నారని విమర్శించారు.

