అస్ఫష్టమైన రోడ్ మ్యాప్, సమాధానంలేని ప్రశ్నలు..
x

అస్ఫష్టమైన రోడ్ మ్యాప్, సమాధానంలేని ప్రశ్నలు..

కేంద్ర కేబినేట్ మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటి ఇచ్చిన నివేదికకు ఆమోదముద్ర వేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ..


(పునీత్ నికోలస్ యాదవ్)

లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు అలాగే స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించాలని సిఫారసు చేసిన భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం బుధవారం (సెప్టెంబర్ 18) ఆమోదించింది.

కేబినెట్ నిర్ణయం గురించి విలేకరులకు వివరించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, సాధారణంగా 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' అని పిలవబడే ప్రతిపాదనకు దేశంలోని మెజారిటీ రాజకీయ పార్టీలు ముఖ్యంగా దేశ యువతలో అత్యధిక మద్దతు ప్రకటించారని వెల్లడించారు.
అయితే ఇది ఎప్పుడు అమలులోకి వస్తుందనే విషయంలో మాత్రం నిర్ణీత గడువును ఇవ్వలేదు. ఈ విధానంపై ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి ప్రభుత్వం ఇంకా విస్తృత స్థాయి సంప్రదింపులను నిర్వహించాల్సిన అవసరం ఉందని మాత్రం పేర్కొన్నారు.
'మళ్లింపు వ్యూహం' అని ప్రతిపక్షాలు విమర్శలు..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వన్ నేషన్-వన్ ఎలక్షన్ గురించి మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రాజకీయ ఎజెండా వాస్తవమవుతుందని ఆయన షా ప్రకటించారు. మరుసటి రోజే కేంద్ర కేబినేట్ దీనికి ఆమోదం తెలిపింది. మరో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దీని వివరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని “ప్రజాస్వామ్య విరుద్ధం”, “రాజ్యాంగ విరుద్ధం”, ఫెడరలిజం సూత్రాలకు విరుద్ధమని అభివర్ణిస్తూనే ప్రతిపక్షం అటువంటి చర్యను వ్యతిరేకిస్తుందని అంచనా వేసింది. క్యాబినెట్ నిర్ణయం వెనుక ఉన్న సమయం, ఆవశ్యకత, ప్రేరణపై కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష ఇండి కూటమిలోని దాని భాగస్వాములు కూడా ప్రశ్నలు లేవనెత్తారు.
హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మధ్యలో వచ్చిన ఈ ప్రకటన జీవనోపాధి, ఇతర సమస్యల నుంచి పౌరుల దృష్టిని మరల్చడానికి వేసిన ఎత్తుగడగా విమర్శిస్తున్నారు.
ఇంకా టైమ్‌లైన్ ప్రకటించలేదు
కేంద్రం, ప్రతిపక్షాల మధ్య వాదనలు, ప్రతివాదాలు ఆశ్చర్యం కలిగించవు. కోవింద్ నేతృత్వంలోని హెచ్‌ఎల్‌సికి ముందు కూడా ఇరుపక్షాలు ఇవే అభిప్రాయాలను వెలువరించాయి.
అయితే, క్యాబినెట్ నిర్ణయం భారతదేశ ఎన్నికల ప్రజాస్వామ్యం రూపురేఖలను గణనీయంగా మార్చే పర్యవసానమైన చర్యపై సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించే దానికంటే ఎక్కువ ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇంకా, షా, వైష్ణవ్ లేదా కేంద్ర కేబినెట్‌లోని మరే ఇతర సభ్యులు కూడా కేంద్రం వన్ నేషన్, వన్ ఎలక్షన్ ప్లాన్ వివరాలను వివరించాల్సిన అవసరం లేదు. దాని రోల్ అవుట్‌కు సంబంధించి టైమ్‌లైన్‌ను కూడా వివరించలేదు.
కేంద్రం సమర్థనలో లొసుగులు..
కేంద్రం అందించే ఏకైక సమర్థనలు, ప్రకటనలు సాధారణమైనవి. ఇది డబ్బును ఆదా చేస్తుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తరచుగా విధించడం వల్ల పాలనలో ఏర్పడే అంతరాయాలను తగ్గిస్తుంది. ఎన్నికల వ్యవస్థలో నల్లధనాన్ని తగ్గించవచ్చు.
అన్ని ఎన్నికలు ఒకే దగ్గరికి వచ్చిన తర్వాత పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో వివరించడానికి ప్రభుత్వం నిరాకరించింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికలు మాత్రమే 76 రోజులు, ఏడు దశల్లో జరిగాయి. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే చిన్న పార్టీలకు సమానమైన ప్రాతినిధ్యం లభిస్తుందా అనే సందేహం ఎలాగూ ఉంది.
అలాగే ఎన్నికల్లో నల్లధనం చలామణిపై ఎలాంచి నిరోధక చర్యలు తీసుకుంటారో స్పష్టం చేయలేదు. ఇప్పటికే దేశంలో ఏకాభిప్రాయం ఉందని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. మరోసారి ఏకాభిప్రాయం సాధిస్తామని చెప్పుకోవడం ఎందుకు..?
2029 నాటికి వన్ నేషన్.. వన్ ఎలక్షన్ సాధ్యం కాదా?
2029కి ముందే వన్ నేషన్, వన్ ఎలక్షన్ రోల్‌అవుట్ సిద్ధమవుతుందని షా చేసిన ప్రకటన ఖచ్చితమైనదైతే, కోవింద్ ప్యానెల్ తన 322 పేజీల నివేదికలో చేసిన మొదటి సిఫార్సును కూడా తప్పుబట్టింది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ రోల్‌అవుట్ ఫ్రేమ్‌వర్క్‌పై, కోవింద్ నేతృత్వంలోని హెచ్‌ఎల్‌సి ఇలా చెప్పింది, “ప్రజల సభ( లోక్ సభ) రాష్ట్ర శాసనసభలకు ఎన్నికల సమకాలీకరణ ప్రయోజనం కోసం రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా అపాయింట్ డేట్ ను మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
కాబట్టి దీని మార్చకుండా వన్ నేషన్- వన్ ఎలక్షన్ సాధ్యంకాదు. ఎందుకంటే ఎనేబుల్ నోటిఫికేషన్ మొదటి దశను రాష్ట్రపతి జారీ చేస్తారు. జూన్ 4 ఫలితాల తర్వాత 18వ లోక్‌సభ మొదటిసారి సమావేశమైనప్పుడు సాధారణ ఎన్నికల తర్వాత ప్రజల సభ మొదటి సమావేశం తేదీ” నెరవేరలేదు.
మహిళా రిజర్వేషన్ చట్టమే ఉదాహరణ
కేంద్ర హోం మంత్రి వాదన కూడా అదే ద్రోహ పథాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది, పార్లమెంటు.. రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం)ను కేంద్రం గత సెప్టెంబరులో ప్రత్యేక సెషన్ ద్వారా పార్లమెంటు ఆమోదించింది. అయితే రిజర్వేషన్లు వాస్తవంగా అమలులోకి రావడానికి నిర్ణీత కాలపరిమితిని వచ్చే జనగణన తరువాత అమలు చేస్తామని ప్రకటించింది.
HLC నివేదికను పూర్తిగా అనుసరించాలంటే, కేంద్రం రెండు వేర్వేరు రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఆమోదించాలి; వాటిలో ఒకటి, దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఒకే సమయానికి జరపడానికి బిల్లు ఆమోదించాలి. తరువాత సగం రాష్ట్రాలు ఆమోదించాలి. దీనిపై కేంద్రం ప్రభుత్వం ఎలాంటి వివరణను పూర్తిగా ఇవ్వలేదు.
పార్లమెంట్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఎదురుదెబ్బ..
కోవింద్ ప్యానెల్ ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణలు పార్లమెంటు ఉభయ సభలకు హాజరైన, ఓటింగ్ చేస్తున్న ఎంపీలలో మూడింట రెండొంతుల మెజారిటీ మద్దతు ఉన్నట్లయితే మాత్రమే అమలు చేయబడతాయి.
గత దశాబ్దం వలె కాకుండా, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి ఇప్పుడు లోక్‌సభలో ఏకపక్ష మెజారిటీ లేదు. రాజ్యసభలో దాని సంఖ్య సరిగ్గా సగం (సింపుల్ మెజారిటీ)లో ఉంది. ఈ బిల్లులు ఓటింగ్‌కు వచ్చినప్పుడు లోక్‌సభలోని మొత్తం 543 మంది ఎంపీలు హాజరైనట్లయితే, సవరణలు తీసుకురావడానికి మూడింట రెండొంతుల మార్కు అవసరం. ప్రస్తుతం లోక్ సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల మద్దతు ఉంది. కానీ మూడింట రెండోంతులు అంటే 363 మంది సభ్యుల మద్ధతు కావాలి.
ప్రస్తుత బలంతో లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించాలంటే, ఎన్‌డీఏ ప్రతిపక్షం నుంచి దాదాపు 70 మంది ఎంపీలను గెలిపించుకోవాలి. దాదాపు 100 మంది ఎంపీలను ఓటింగ్ నుంచి వాకౌట్ చేసేలా బీజేపీ ఫ్లోర్ మేనేజర్‌లు ఒప్పించాల్సి ఉంటుంది. తద్వారా మూడింట రెండు వంతుల మార్కు తగ్గుతుంది. NDA, ఇండి కూటమిల మధ్య వైరం, ఒక దేశం, ఒకే ఎన్నికలకు వ్యతిరేకంగా ఇండి కూటమి భాగస్వాముల శత్రు వైఖరి కారణంగా ఈ రెండూ అసంభవం.
రాజ్యసభలో, సవరణలు పూర్తి సభలో ఆమోదించబడాలంటే 160 మందికి పైగా ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం NDAకి 122 మంది ఎంపీలు ఉన్నారు. మరలా, గత 10 సంవత్సరాల మాదిరిగా కాకుండా, BRS, BJD, YSRCP వంటి దాని స్నేహపూర్వక NDA యేతర పార్టీల నుంచి దానికి ఉదారంగా మద్దతు లభించింది. ఆ తర్వాతి రెండు పార్టీల మధ్య ఇప్పటికీ రాజ్యసభలో డజనుకు పైగా ఎంపీలు ఉన్నారు.
రియాలిటీ..
రాజ్యాంగాన్ని సముచితంగా సవరించే వరకు ఏకకాలంలో పోల్‌లను నిర్వహించడం సాధ్యం కాదు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ కోసం ఈ ముందస్తు ఆవశ్యకతను అమలు చేయడానికి కేంద్రానికి శాసన బలం లేనట్లయితే, అది అసలు కసరత్తును ఎలా అమలు చేస్తుంది? ఇదో పెద్ద ప్రశ్న..
ప్రధానమంత్రిగా మోదీ మూడవసారి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్రం తాము పూర్తి చేసిన పనుల గురించి గొప్పలు చెప్పుకుంది.
సమాధానాలు లేని ప్రశ్నలు, వేధించే సందేహాలు, అనిశ్చిత కాలక్రమం, అస్థిరమైన పాలక సంకీర్ణ బలంతో, ఈ 100 రోజులలో, వివిధ విధానాలు, శాసన ప్రతిపాదనలపై ఇప్పటికే పదేపదే వోల్ట్ ఫేస్ చేయవలసి వచ్చింది. నేషన్, వన్ ఎలక్షన్ వాస్తవానికి... వాస్తవంగా మారుతుందా లేదా మోదీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఎన్నికల, పరిపాలనా, సామాజిక-రాజకీయ - మరింత ముఖ్యమైన సవాళ్ల నుంచి క్షణికమైన మళ్లింపుగా మిగిలిపోతుందా? చెప్పడం కష్టం.



Read More
Next Story