Butta Renuka
x
బుట్టా రేణుక

బుట్టా రేణుక ఎక్కడ బోల్తా పడ్డారు?

ఆస్తుల వేలం దాకా ఎందుకు వచ్చింది? నిజంగానే నష్టాలా లేక రాజకీయ/బిజినెస్ ప్లాన్ లో భాగమా?


YSRCP మాజీ MP బుట్టా రేణుకను అప్పులు చుట్టుముట్టాయా? 2014-2019 మధ్య కర్నూలు నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన ఆమె ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసీ నిర్ణయించింది. బుట్టా రేణుక, ఆమె భర్త బుట్టా నీలకంఠ శివ ఆస్తుల్ని వేయనున్నట్టు LIC Housing Finance Limited (LICHFL) ప్రకటించింది. 2018లో తీసుకున్న రూ. 310-340 కోట్ల లోన్ లో వీరు డిఫాల్ట్ అయ్యారు. ఆ లోను బకాయి ఇప్పుడు రూ. 782 కోట్లకు చేరింది.

హైదరాబాద్‌లోని KPHB కాలనీలో 3,833 చదరపు గజాల సైట్ (మెరిడియన్ స్కూల్ భవనం సహా) వేలం ప్రకటన జారీ అయింది. రిజర్వ్ ప్రైస్ రూ. 65 కోట్లు, మార్చి 24న ఈ-వేలం. ఇది LICHFLకు 13వ వేలం ప్రయత్. మునుపటివి అన్నీ ఫెయిల్ అయ్యాయి.
బుట్టా రేణుకకు కన్వెన్షన్ సెంటర్లు, ఎడ్యుకేషన్ బిజినెస్ (మెరిడియన్ ఎడ్యుటెక్ సొల్యూషన్స్ మొదలైనవి) ఉన్నాయి. సక్సెస్‌ఫుల్ బిజినెస్‌వుమన్‌గా పేరున్నవారు. కానీ ఎక్కడో బోల్తా పడ్డారు? ఆస్తుల వేలం నిజమైన ఫైనాన్షియల్ క్రైసిస్ వల్లా లేక బిజినెస్/రాజకీయ ప్లాన్ భాగమా?

లోన్ ఎలా వచ్చింది?

బుట్టా రేణుక, నీలకంఠ శివ 2018లో Butta Infrastructure Pvt Ltd, Butta Convention Services Pvt Ltd, Meridian Edutech Solutions Pvt Ltd పేరుతో LICHFL నుంచి రూ. 310 కోట్ల లోన్ తీసుకున్నారు. 15 ఏళ్లలో తీర్చాలి. లోన్ సెక్యూరిటీగా హైదరాబాద్ బంజారా హిల్స్, మధాపూర్ ప్రాపర్టీలు (సైట్స్, స్కూల్ భవనాలు) మార్ట్‌గేజ్ చేశారు. మొదట్లో EMIలు (రూ. 40 కోట్లు) చెల్లించారు, కానీ 2019 నుంచి డిఫాల్ట్ అయ్యారు.
COVID-19 పాండమిక్ వల్ల బిజినెస్ లాసెస్ (కన్వెన్షన్ సెంటర్లు, స్కూల్స్ షట్‌డౌన్), ఇంటరెస్ట్ పెరిగి బకాయి రూ. 340-782 కోట్లకు చేరింది. NCLT (National Company Law Tribunal)లో కేసు నమోదు అయింది. LICHFL 2020లో పిటిషన్ ఫైల్ చేసింది. NCLT ఆర్డర్ ప్రకారం, లీజ్ అగ్రీమెంట్స్ ఇన్వాలిడ్ (ప్రీ-ఎగ్జిస్టింగ్ లీజెస్ ఉన్నాయి, కాన్సల్ చేయలేదు), ఇది లోన్ సెక్యూరిటీని దెబ్బతీసింది. ఫలితంగా, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ (CIRP) ప్రారంభమైంది, ఆస్తులు వేలం ద్వారా రికవరీ చేస్తున్నారు.

ఎక్కడ బోల్తా పడ్డారు?

బుట్టా రేణుక బిజినెస్ ఎంపైర్ (కన్వెన్షన్ సెంటర్లు, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్లు) COVID-19 వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. కోవిడ్ సమయంలో స్కూల్స్, కన్వెన్షన్ సెంటర్లు షట్‌డౌన్ అయ్యాయి, రెవెన్యూ జీరో అయింది, EMIలు చెల్లించలేకపోయారు. ఇది నిజమైన ఫైనాన్షియల్ క్రైసిస్‌గా కనిపిస్తుంది, ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలా బిజినెస్‌లు (ముఖ్యంగా ఎడ్యుకేషన్, ఈవెంట్స్ సెక్టర్) ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాయి.
అయితే, ఇది ఓ పద్ధతి ప్రకారం చేసిన ప్లాన్ అనే మాటలూ వినపడుతున్నాయి. NCLT డాక్యుమెంట్లలో "పొటెన్షియల్ ఫ్రాడ్, అబ్యూస్ ఆఫ్ పవర్" ఆరోపణలు ఉన్నాయి. లీజ్ అగ్రీమెంట్స్ ఇన్వాలిడ్, ప్రీ-ఎగ్జిస్టింగ్ లీజెస్ ఉండి కాన్సల్ చేయకపోవటం వల్ల లోన్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయి. దీన్ని ఇంటెన్షనల్ మిస్‌రెప్రజెంటేషన్‌గా చూపుతున్నారు. కానీ కన్‌ఫర్మ్ ఫ్రాడ్ ఆధారాలు లేవు. రేణుక రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ (YSRCP MP, ఎలక్షన్స్‌లో డిఫీట్ తర్వాత బిజినెస్ ఫోకస్) వల్ల రాజకీయ మోటివ్ ఉందని స్పెక్యులేషన్స్ లేవు. ఇది ప్రధానంగా బిజినెస్ మిస్‌మేనేజ్‌మెంట్, పాండమిక్ ఇంపాక్ట్‌గా కనిపిస్తుంది.

ముందున్న దారి ఏమిటి?

వేలం మార్చి 24న జరగనుంది. బిడ్స్ మార్చి 23 వరకు స్వీకరిస్తారు. బుట్టా ఫ్యామిలీ లోన్ రీస్ట్రక్చర్ ప్రపోజల్స్ (మంత్లీ EMIలు రూ. 3.4 కోట్ల నుంచి స్టార్ట్ చేసి పెంచుకుంటూ పోతారు). రూల్స్‌కు విరుద్ధంగా రిజెక్ట్ అయ్యాయి. ఇది రాజకీయంగా కూడా ఇంపాక్ట్ చూపవచ్చు. ఎందుకంటే రేణుక YSRCP సీనియర్ లీడర్.
ఇంతకుముందు చాలాసార్లు ఈ తరహా వేలం ప్రతిపాదనలు వచ్చినా ఎవరూ వేలానికి ముందుకు రాలేదు. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి.
Read More
Next Story