నేనెప్పుడు రిటైర్ అవుతానంటే.. అదానీ మనసులో మాట..
x

నేనెప్పుడు రిటైర్ అవుతానంటే.. అదానీ మనసులో మాట..

అపర కుబేరుడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన మనసులోని మాటలను బయటపెట్టాడు. ముఖ్యంగా వ్యాపార సామ్రాజ్యాన్ని తన వారసులకు అప్పగిస్తానని ప్రకటించారు.


అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన పదవీ విరమణ, వారసత్వ ప్రణాళికలను వెల్లడించారని, ఓ అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది. మీడియా కథనం ప్రకారం తన 70 వ ఏట వ్యాపారాల నుంచి రిటైర్ మెంట్ తీసుకుంటానని ఆయన వెల్లడించారు.

బ్లూమ్‌బెర్గ్ న్యూస్‌తో గౌతమ్ అదానీ ఇంటర్వ్యూను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్‌లో ఒక వార్తను ప్రచురించింది. ఆదాని ఇంటర్యూ ప్రకారం 2030ల ప్రారంభంలో పదవీ విరమణ చేయనున్నాడని పేర్కొంది. గౌతమ్ అదానీ ప్రస్తుత వయస్సు 62 సంవత్సరాలు. అదానీ గ్రూప్ నియంత్రణను అతని నలుగురు కుమారులు కరణ్,జీత్ తో పాటు బంధువులు ప్రణవ్,సాగర్ - కుటుంబ ట్రస్ట్ సమాన లబ్ధిదారులు అవుతారని నివేదిక పేర్కొంది.

"వ్యాపార స్థిరత్వానికి వారసత్వం చాలా ముఖ్యమైనది. పరివర్తన సేంద్రీయంగా, క్రమంగా, చాలా క్రమబద్ధంగా ఉండాలి కాబట్టి నేను ఎంపికను రెండవ తరానికి వదిలివేసాను" అని గౌతమ్ అదానీ చెప్పారు.
కరణ్ ప్రస్తుతం అదానీ పోర్ట్స్, SEZ లిమిటెడ్ (APSEZ) మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. జీత్ అదానీ గ్రూప్ అన్ని వర్టికల్స్‌తో పని చేస్తున్నారు. అదానీ గ్రూప్ వెబ్‌సైట్ ప్రకారం అదానీ ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారంతో పాటు అదానీ డిజిటల్ ల్యాబ్స్‌కు కూడా జీత్ నాయకత్వం వహిస్తున్నాడు.
ప్రణవ్ అదానీ గ్రూప్ అంతర్గత ఇంక్యుబేటర్ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ (ఆగ్రో, ఆయిల్ & గ్యాస్) డైరెక్టర్. అతను సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, ఆగ్రో, రియల్ ఎస్టేట్ నేచురల్ రిసోర్సెస్ వంటి విభిన్న వ్యాపారాలకు కూడా నాయకత్వం వహిస్తున్నాడు.
సాగర్ అదానీ గ్రీన్ ఎనర్జీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అతను ప్రస్తుతం సంస్థ నిర్మాణాన్ని అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీ అన్ని వ్యూహాత్మక ఆర్థిక విషయాలను పర్యవేక్షిస్తున్నాడు.
Read More
Next Story