ఆర్ధిక సర్వే ఆహర ధరలను మినహయించాలని కోరుతోంది.. కారణం?
x

ఆర్ధిక సర్వే ఆహర ధరలను మినహయించాలని కోరుతోంది.. కారణం?

దేశంలో ఆహర ధరలను ద్రవ్యోల్భణ లక్ష్యాల నుంచి మినహించాలని ఆర్థిక సర్వే సూచించింది. ఆహార ధరలను మినహయించని పక్షంలో ద్రవ్యోల్భణ లక్ష్యాలు..


దేశంలో పెరుగుతున్న నిత్యవసరాల ధరలకు కళ్లెం వేయడానికి ద్రవ్యోల్భణ టార్గెటింగ్ ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేయాలని ఆర్ధిక సర్వే సూచించింది. ఇందులో ఆహార ధరలను మినహయించాలని సర్వే పేర్కొంది. దేశంలో ఆహార ఖర్చులు పేద, తక్కువ- ఆదాయ వినియోగదారులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చడానికి ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు అందించాలని, అలాగే చెల్లుబాటు అయ్యే వ్యవధితో నిర్ధిష్ట కొనుగోళ్ల కోసం కూపన్ ల ద్వారా తగ్గించాలని ఆర్థిక సర్వే కోరింది. దేశంలో వ్యవసాయ రంగాన్ని స్టాక్ టేకింగ్ చేయాలని కోరింది.

“భారతదేశ ద్రవ్యోల్బణ లక్ష్య ఫ్రేమ్‌వర్క్ నుంచి ఆహారాన్ని మినహాయించి ద్రవ్యోల్బణ రేటును తగ్గించాలని ఆర్థిక సర్వే లక్ష్యంగా చేసుకోవడం నిజంగా మంచి పరిణామం. తక్కువ ఆదాయం వస్తున్నవినియోగదారులకు డీబీటీ ద్వారా తగిన కాలంలో మంచి నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను అందించవచ్చని ”అని ఆర్థిక సర్వే 2023-24 అభిప్రాయపడింది.
ఆహార కారకం
అభివృద్ధి చెందుతున్న దేశాలలో వినియోగదారుల ధరల సూచికలో ఆహారం ఎక్కువ భాగాన్ని ఆక్రమించిందని సర్వే పేర్కొంది. అందువల్ల, అభివృద్ధి చెందుతున్న దేశాలలోని కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు, అవి ఆహార ధరలను సమర్థవంతంగా నియంత్రించడాన్ని లక్ష్యంగా చేసుకుంటాయి. కాబట్టి, ఆహార ధరలు పెరిగినప్పుడు, ద్రవ్యోల్బణ లక్ష్యాలు తారుమారు అవుతాయి. అందువల్ల ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదలను తగ్గించాలని కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అది రైతులకు అనుకూలంగా వాణిజ్యం పరంగా పెరగడం నుంచి లాభం పొందకుండా నిరోధిస్తుంది.
అందువల్ల, భారతదేశం ద్రవ్యోల్బణ లక్ష్య ఫ్రేమ్‌వర్క్ ఆహారాన్ని మినహాయించి మిగిలిన ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. అధిక ఆహార ధరలకు కారణం డిమాండ్ వల్ల కావడం లేదు. కేవలం సరఫరా వ్యవస్థలో లోపాల వల్ల ధరలు పెరిగి తద్వారా పేద మధ్య తరగతి వినియోగదారులను కష్టాల్లోని నెడుతున్నాయి.
వీటిని స్వల్పకాలిక ద్రవ్య విధాన సాధనాల వల్ల సమర్థవంతంగా నియంత్రించవచ్చు. సరఫరా పరిమితుల వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి వాటిని మోహరించడం ప్రతికూల ఉత్పాదకతను కలిగిస్తుందని సర్వే పేర్కొంది. భారతీయ వ్యవసాయం ఇప్పుడు సంక్షోభంలో లేదని, అయితే రాబోయే కాలంలో వాతావరణ మార్పులు, నీటి క్లిష్టత ఎక్కువగా ఉన్నందున తీవ్రమైన నిర్మాణాత్మక పరివర్తన అవసరమని కూడా సర్వే ఎత్తి చూపింది.
స్టాక్ టేకింగ్ అవసరం
రివర్స్ మైగ్రేషన్ కారణంగా కోవిడ్ సంవత్సరాలలో వ్యవసాయ ఉపాధిలో పెరుగుదల, FY24లో వ్యవసాయంలో విలువ వృద్ధి రేటు క్షీణత, 2024 వేసవిలో దేశంలోని వాయువ్య, మధ్య ప్రాంతాలలో పెరుగుతున్న నీటి ఒత్తిడితో అత్యంత వేడి వేసవి ఇంధన వినియోగం కారణంగా వ్యవసాయంలో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ముఖ్యంగా భారతదేశంలో ద్రవ్యోల్బణ లక్ష్యాల నుంచి ఆహార ధరలను మినహాయించడం, ఆర్థిక విధానం, సామాజిక ఈక్విటీకి గణనీయమైన ప్రభావాలను కలిగించే అనేక లోపాలకు దారి తీస్తుంది. వీటిని నివారించాలంటే సమర్థవంతమైన ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
గృహ బడ్జెట్లలో ఆహార వినియోగం గణనీయమైన భాగాన్ని ఆక్రమిస్తుంది. ముఖ్యంగా తక్కువ-ఆదాయ కుటుంబాలకు ఇదే పెద్ద సమస్య. ద్రవ్యోల్బణ గణనలలో ఆహార ధరలను విస్మరించడం అధికారిక ద్రవ్యోల్బణం కొలమానాలు- వినియోగదారుల వాస్తవ ఆర్థిక అనుభవాల మధ్య డిస్‌కనెక్ట్‌కు దారితీయవచ్చు. ఇది అధిక జనాభా ఎదుర్కొంటున్న వాస్తవాలకు ద్రవ్య విధానానికి సంబంధం లేదని, ఆర్థిక సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని బలహీనపరిచే అవకాశం ఉందని భావించవచ్చు.
చక్కెర-బెల్లం ఉదాహరణ
అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే ఆహార వస్తువులను ఎగుమతిపై నిషేధం విధించాలని ఆర్థిక సర్వే పేర్కొంది. దేశీయ వినియోగదారుల అవసరాలు తీరిన తరువాతనే విదేశాలకు ఎగుమతి చేయాలనే నిబంధనల వల్ల రైతులు నష్టపోతున్నట్లు పేర్కొంది. ఎగుమతుల పై నిషేధం విధించే ముందు ప్రత్యామ్నాయ వస్తువులపై దేశీయ సరఫరా వ్యవస్థలో ప్రాధాన్యం ఇప్పించాలని కోరింది.
“ఉదాహరణకు, చక్కెర ధరలు పెరిగితే, వినియోగదారులు తక్కువ తినవచ్చు లేదా బెల్లంకు మారవచ్చు. ఇది వారి ఆరోగ్యానికి కూడా మంచి విషయం కావచ్చు. సాధారణంగా, తాత్కాలిక ఎగుమతి నిషేధాలు లేదా భారీ దిగుమతుల కారణంగా రైతులు పెద్ద నష్టాలను చవిచూడడం కంటే వినియోగదారులకు వినియోగాన్ని భర్తీ చేయడం లేదా తగ్గించడం చాలా సులభం. అంతర్జాతీయంగా పెరిగిన ధరల వల్ల రైతులు లబ్ధి పొందేలా చూడాలి. ప్రపంచంలోని ఇతర చోట్ల ఆకలి- కరువు తీవ్రతరం కాకుండా ఉండాలంటే ఆహార ఎగుమతులపై నిషేధాలు కూడా ముందుగానే టెలిగ్రాఫ్ చేయాలి" అని సర్వే పేర్కొంది.
Read More
Next Story