బెంగాల్‌లో ఎన్నికలకు ముందే కేంద్ర బలగాల మోహరింపు..
x

బెంగాల్‌లో ఎన్నికలకు ముందే కేంద్ర బలగాల మోహరింపు..

EC ఆదేశాలతో రాష్ట్రంలో 23 జిల్లాలకు చేరుకున్న 240 కంపెనీలు


Click the Play button to hear this message in audio format

అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌ను కేంద్ర బలగాలు మోహరించాయి. మార్చి 1 నుంచి కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని EC నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే 240 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రంలోకి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో అడుగు మోపాయి. వీటిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)‌కు చెందిన 110 కంపెనీలు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కు చెందిన 55 కంపెనీలు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కు చెందిన 21 కంపెనీలు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమా బల్ (SSB) కు చెందిన 27 కంపెనీలు ఉన్నాయి.


రిటైర్డ్ IPS అధికారి పర్యవేక్షణలో..

ప్రతి కంపెనీలో కనీసం 72 మంది సిబ్బంది ఉంటారు. మూడు పోలీస్ జిల్లాలు, రెండు కమిషనరేట్‌లు ఉన్న నార్త్ 24-పరగణాకు అత్యధికంగా 30 కంపెనీలను పంపగా.. ముర్షిదాబాద్‌కు 16, హౌరా, సౌత్ 24-పరగణాలకు 15–15 కంపెనీలు, తూర్పు మిడ్నాపూర్, హూగ్లీ 14 కంపెనీలు చొప్పున పంపారు. మాల్డా, నదియా, డినాజ్‌పూర్, డార్జిలింగ్, కూచ్ బెహార్, బంకురా, బిర్భూమ్ వంటి జిల్లాల్లోనూ బలగాలు మొహరించాయి. ఈ బలగాల పర్యవేక్షణ బాధ్యతను రిటైర్డ్ IPS అధికారి NK మిశ్రాకు అప్పగించారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 1,100 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. అయితే ఈ సారి ముందస్తుగా వాటిని రంగంలోకి దింపారు. ఎన్నికలకు ముందు సున్నితమైన ప్రాంతాల్లో హింసను అరికట్టడం, స్థానిక భద్రతా పరిస్థితులను పర్యవేక్షించడం ఇవన్నీ ఈ వ్యూహంలో కీలక అంశాలు.

Read More
Next Story