రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడే హింసాత్మక ఘటనలు: సీడీఎస్
x

రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడే హింసాత్మక ఘటనలు: సీడీఎస్

రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచంలో ఇప్పుడే ఎక్కువ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని సీడీఎస్ అనిల్ చౌహన్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో పరిస్థితి అదుపు తప్పిన..


రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పుడే ప్రపంచం అత్యంత హింసాత్మక దశలో ఉందని న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో భారత రక్షణ శాఖ చీఫ్ (సిడిఎస్) అన్నారు. దేశ రాజధానిలో సైనిక మందుగుండు సామగ్రిపై జరిగిన సదస్సులో సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ, మన చుట్టూ చూస్తే ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. "రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం అత్యంత హింసాత్మక దశలో ఉంది" అని చౌహాన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ భౌగోళిక రాజకీయ వాతావరణం ప్రస్తుతం ఫ్లక్స్ స్థితిలో ఉందని చెప్పారు.

ఇంకా, సాంకేతికత నుంచి పర్యావరణం, ఆర్థిక, వాతావరణ మార్పు, ప్రజల వలసలు, శాంతి, భద్రత వంటి అంశాలలో ప్రపంచం అతి పెద్ద అంతరాయాలను ఎదుర్కొంటుందని చౌహన్ పేర్కొన్నారు. జనరల్ అనిల్ చౌహాన్ మయన్మార్, సూడాన్, కాంగోలోని వివాదాల ఉదాహరణలను అందించారు.
" లిబియా, సిరియా, యెమెన్, అర్మేనియాలో యుద్దం పరిస్థితులు ఉన్నాయి. కానీ శాశ్వత శాంతి ఇప్పటికీ అస్పష్టంగా ఉంది…" అని అతను చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న హింసాకాండ రక్షణ సామాగ్రితో సహా ప్రపంచ సరఫరా గొలుసులను ప్రభావితం చేసింది.
"ప్రపంచ సరఫరా గొలుసులు ప్రభావితమవుతున్నాయి, రక్షణ సరఫరాలలో డిమాండ్, సరఫరా మధ్య అంతరం ఉంది" అని ఆయన అన్నారు. అయినప్పటికీ, ఈ అంతరాయాలు మాకు " కొత్త అవకాశాన్ని ఇచ్చాయి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్ పొరుగు దేశాలు..
బంగ్లాదేశ్‌లో ఇటీవలి రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత పరిస్థితిని కూడా జనరల్ చౌహాన్ ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్ చేస్తున్న ప్రాక్సీ వార్‌తో భారత్ ఇప్పటికే పోరాడుతుందని, ఇది పీర్ పంజాల్ రేంజ్‌లో అకస్మాత్తుగా పెరిగిందని చౌహాన్ అన్నారు. ఇంకా, "చైనాతో సుదీర్ఘ సరిహద్దు వివాదం సవాలును కూడా దేశం ఎదుర్కొంటోంది, ఇది ఇంకా తగ్గలేదు," అన్నారాయన.
బంగ్లాదేశ్‌లో ఉద్యోగ కోటాపై చెలరేగిన నిరసనలు తరువాత హింసాత్మకంగా మారాయి. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి పారిపోయేలా చేసింది. బంగ్లాదేశ్‌లో నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆగస్ట్ 8, గురువారం బాధ్యతలు చేపట్టనున్నందున హింస తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది.
ఇదిలా ఉన్న తరుణంలోనే మందుగుండు సామాగ్రిలో స్వావలంబన సమస్యపై, చౌహాన్ రెండు మార్గాలను సూచించారు, ఒకటి నిల్వ చేయడం కంటే సామర్థ్యాలను సృష్టించడం రెండవది, నిల్వ చేయడానికి బదులుగా జాబితా నిర్వహణను తెలివిగా మెయిన్ టైన్ చేయడం.


Read More
Next Story