రాంచీ–ఢిల్లీ ఎయిర్ అంబులెన్స్ కూలి ఏడుగురు మృతి
x

రాంచీ–ఢిల్లీ ఎయిర్ అంబులెన్స్ కూలి ఏడుగురు మృతి

ఝార్ఖండ్‌లో ఘటన..


Click the Play button to hear this message in audio format

ఝార్ఖండ్‌ రాష్ట్రంలో మంగళవారం విమాన ప్రమాదం జరిగింది. రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఛాత్రా జిల్లా సిమారియా సమీపంలోని కసారియా పంచాయతీ ప్రాంతంలో కుప్పకూలడంతో కూలిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. టేకాఫ్ అయిన సుమారు 20 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయినట్లు రాంచీ విమానాశ్రయ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. 65 శాతం కాలిన గాయాలయిన సంజయ్ కుమార్ (41) ను మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఢిల్లీకి తరలించేందుకు ఎయిర్ అంబులెన్స్ సాయంత్రం 4.30 గంటలకు విమానం బయలుదేరింది. ప్రతికూల వాతావరణం వల్లే రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ C90 (VT-AJV) ఈ విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందాన్ని సంఘటన స్థలానికి పంపించారు. ప్రమాద స్థలానికి జిల్లా పరిపాలన, రక్షణ బృందాలు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు. ఈ ప్రమాదంలో కెప్టెన్ వివేక్ వికాస్ భాగత్, కెప్టెన్ సవ్రజ్‌దీప్ సింగ్, సంజయ్ కుమార్, డా. వికాస్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చనా దేవి, ధురు కుమార్ మృతి చెందారు. ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపాయ్ సోరెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనతో విమానాశ్రయంలో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి.

Read More
Next Story