LIVE చల్లారని భారత్, పాక్ ఉద్రిక్తలు.. అలెర్ట్‌గా ఉన్న భద్రతా బలగాలు..(LIVE)
x

చల్లారని భారత్, పాక్ ఉద్రిక్తలు.. అలెర్ట్‌గా ఉన్న భద్రతా బలగాలు..(LIVE)

పాక్ చేస్తున్న డ్రోన్, మిస్సైల్ దాడులను ఎక్కడిక్కడ పడగొడుతోంది భారత్.


భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్ని ఉద్రిక్తలు ఇంకా చల్లారలేదు. ఏ క్షణాన ఎటునుంచి, ఎలాంటి దాడులు జరుగుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. కాగా పాక్ ఎలాంటి దాడి చేసిన ఎదుర్కోవడానికి భారత్ సన్నద్ధం అవుతోంది. ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరిస్తోంది. పలు ప్రాంతాల్లో హఅలెర్ట్ ప్రకటించింది. భద్రతను భారీగా పెంచింది. అన్ని విధాల భద్రతా సంస్థలను రంగంలోకి దించింది. సరిహద్దుల్లో దెబ్బకు దెబ్బ కొడుతూ బదులిస్తోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాయి. ఎక్కడిక్కడ మార్గదర్శకాలను విడుదల చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఏమాత్రం అలసత్వానికి అవకాశం ఉండకూడదని అధికారులను సూచిస్తున్నాయి. కేంద్రంలో కేబినెట్ అంతా కూడా ఉన్నతాధికారులకు వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. పరిస్థితులను తెలుసుకుంటున్నాయి. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సన్నద్ధం అవుతోంది భారత్. ఈ క్రమంలోనే చేపట్టిన ఆపరేషన్ సిందూర్ 2.0పై భద్రతా బలగాలు బ్రీఫింగ్ కూడా ఇచ్చాయి.

ఈ క్రమంలోనే దేశరాజధాని ఢిల్లీలో కొత్త సైరన్లను అమర్చనున్నట్లు అధికారులు చెప్పారు. ‘‘సైరన్లను అమర్చుతున్నాం. ఎత్తైన భవనాలపై ఏర్పాటు చేసి, వీటి పనితీరును పరిశీలిస్తున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని ప్రదేశాల్లో ఏర్పాటు చేయనున్నాం. 11 జిల్లాల పరిధిలో ఇప్పటివరకు 10 సైరన్లు ఏర్పాటు చేశాం. కొన్ని సైరన్‌ శబ్దాలు రెండు కి.మీలు, కొన్ని నాలుగు, మరికొన్ని 16 కి.మీ పరిధి వరకు వినిపిస్తాయి’’ అని రెవెన్యూ అధికారులు వెల్లడించారు.

మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో చొరబాటుకు ప్రయత్నాలు కూడా ముమ్మరంగానే జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం దాదాపు పలువురు భారత్‌లోకి చొరబడే ప్రయత్నం చేశారు. కాగా వారిని భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. ఈ కాల్పుల్లో దాదాపు ఏడుగురు చొరబాటు దారులు మరణించారు. ఈ అంశంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్ని వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే త్రిదళాదిపతులు సహా పలువురు ఉన్నతాధికారులతో ప్రత్యేక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఇందులో సరిహద్దుతో పరిస్థఇతులతో పాటు, భారత్ దగ్గర ఉన్న ఆయుద్ధ సంప్పత్తిపై కూడా చర్చించినట్లు సమాచారం.

పాక్‌ దాడులు నిర్వీర్యం

ఈ ఉద్రిక్తల నేపథ్యంలో పాకిస్థాన్ భారీగా డ్రోన్‌లను ప్రయోగించింది. కాగా వాటన్నింటిని భారత డిఫెన్స్ ఫోర్సెస్ నిర్వీర్యం చేశఆయి. పాక్ చేస్తున్న డ్రోన్, మిస్సైల్ దాడులను ఎక్కడిక్కడ పడగొడుతోంది భారత్. దాంతో పాటుగానే పాక్ టార్గెట్ చేసుకునే అవకాశం ఉందన్న అన్ని కీలక ప్రాంతాల్లోనూ భారీ భద్రతను ఏర్పాటు చేసింది.

Live Updates

  • 10 May 2025 1:57 PM IST

    చార్ ధామ్ యాత్ర హెలికాప్టర్ పునఃప్రారంభం

    చార్‌దమ్ యాత్ర సజావుగా నడుస్తోందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. చెడు వాతావరణం కారణంగా కొంతకాలంగా హెలికాప్టర్ సర్వీస్ మూసివేయబడిందని ప్రభుత్వం తెలిపింది.

  • 10 May 2025 1:49 PM IST

    ఉదంపూర్‌ ఎయిర్ బేస్‌కి ఏం కాలేదు: ఇండియా

    భారత్‌లోని ఉదంపూర్ ఎయిర్ బేస్‌కు ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ చేస్తున్న ప్రచారాన్ని భారత్ తిప్పికొట్టింది. ఉదంపూర్ ఎయిర్ బేస్‌ బాగానే ఉందని, కార్యకలాపాలను కొనసాగిస్తుందని చెప్పారు. పాకిస్థాన్‌ షేర్ చేస్తున్న వీడియో.. ఇప్పుడున్న పరిస్థితులతో సంబంధం లేదని స్పష్టం చేసింది.

  • 10 May 2025 1:47 PM IST

    బీఆర్ఎస్ సీఎం కీలక భేటీ

    పాక్‌తో పరిస్థితులు చేయిదాటుతున్న క్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ అలెర్ట్ అయ్యారు. నేపాల్, బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకుంటున్న ప్రాంతాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

  • 10 May 2025 1:45 PM IST

    ఇంట్లోనే ఉండండి.. బయటకు రావొద్దు.. రాజస్థాన్‌లో హైఅలెర్ట్

    ఉద్రిక్తతల పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్‌లోని జైసల్మార్‌లో అధికారులు కీలక హెచ్చరికలు చేస్తున్నారు. ప్రజలంతా కూడా ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని చెప్తున్నారు. అంతేకాకుండా తలుపులు, కిటీకీలు అన్నీ మూసేసి ఉంచుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు పోలీస్ వ్యాన్‌లలో తిరుగుతూ ప్రకటనలు చేస్తున్నారు.

  • 10 May 2025 1:42 PM IST

    కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ దళాలు

    జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి, గురేజ్ సెక్టార్లలో శనివారం పాకిస్తాన్ దళాలు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి కాల్పుల విరమణను ఉల్లంఘించాయని అధికారులు తెలిపారు. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌లోని చారుండా మరియు హత్లంగా ప్రాంతాలను పాకిస్తాన్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయని వారు తెలిపారు. ఉత్తర కాశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలోని గురెజ్ సెక్టార్‌లోని బాగ్టోర్ ప్రాంతంలో కూడా వారు కాల్పుల విరమణను ఉల్లంఘించారని అధికారులు తెలిపారు. అధికారుల ప్రకారం, ఈ ప్రదేశాలపై భారీ షెల్లింగ్ జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవు. మరిన్ని వివరాలు అందాల్సి ఉందని వారు తెలిపారు. శుక్రవారం, బారాముల్లా మరియు కుప్వారా జిల్లాల ఎల్‌ఓసి మీదుగా పాకిస్తాన్ దళాలు జరిపిన భారీ షెల్లింగ్‌లో ఒక మహిళ మరణించగా, ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరు గాయపడ్డారు.

  • 10 May 2025 1:41 PM IST

    ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్ర హెలికాప్టర్ సేవలను ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ (UCADA) తక్షణమే నిలిపివేసింది. చార్ ధామ్ యాత్ర ప్రదేశాల నుండి యాత్రికులను తరలించడానికి మాత్రమే హెలికాప్టర్ సేవ అందుబాటులో ఉందని UCADA పేర్కొంది.

  • 10 May 2025 1:38 PM IST

    ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నక్రమంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

  • 10 May 2025 1:37 PM IST

    సంయమనం పాటించండి: చైనా

    తీవ్ర సరిహద్దు ఉద్రిక్తల నడుమ భారత్, పాక్‌‌కు చైనా కీలక సూచనలు చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. శాంతియుత పరిష్కారికి ప్రయత్నించాలని కోరింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన చేసింది. "శాంతి మరియు స్థిరత్వం యొక్క విస్తృత ప్రయోజనాల కోసం వ్యవహరించాలని, ప్రశాంతత మరియు సంయమనం పాటించాలని, శాంతియుత మార్గాల ద్వారా రాజకీయ పరిష్కారానికి తిరిగి రావాలని మరియు ఉద్రిక్తతలను మరింత పెంచే ఏ చర్య నుండి దూరంగా ఉండాలని మేము రెండు వైపులా గట్టిగా కోరుతున్నాము" అని పేర్కొంది.

  • 10 May 2025 12:11 PM IST

    జోద్‌పూర్‌లో అలెర్ట్

    ఎయిర్ స్ట్రైక్స్ జరిగే ప్రమాదం ఉందని జోద్‌పూర్ కలెక్టర్ అలెర్ట్ ప్రకటించారు. ఏ క్షణమైనా సైరెన్ మోగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ దగ్గర్లో ఉన్న భవనాల్లోకి వెళ్లాలని, రోడ్లపై ఎవరూ ఉండొద్దని హెచ్చరించారు.

  • 10 May 2025 11:55 AM IST

    దాల్ సరస్సులో క్షిపణి లాంటి వస్తువు లభ్యం

    శనివారం ఉదయం నగరాన్ని కుదిపేసిన భారీ పేలుళ్ల తర్వాత శ్రీనగర్‌లోని ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన దాల్ సరస్సులో క్షిపణి లాంటి వస్తువు లోతుగా దిగిందని అధికారులు తెలిపారు. వస్తువు దిగినప్పుడు సరస్సు ఉపరితలం నుండి పొగలు వెలువడ్డాయని అధికారులు తెలిపారు. భద్రతా దళాలు బయటకు తీసిన వస్తువు యొక్క శిథిలాలను విశ్లేషిస్తున్నారని వారు తెలిపారు. శనివారం ఉదయం నగర శివార్లలోని లాస్జన్ నుండి మరో అనుమానిత వస్తువును స్వాధీనం చేసుకున్నామని, దీనిని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.

Read More
Next Story