నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..
x

నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..

తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది.


తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అధికార, ప్రతిపక్ష వర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఆంధ్ర ఎన్నికలపై ఒక అంచనాను వేయలేకపోయాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లే ఉంది. దీంతో ఆంధ్ర ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కానీ ప్రజల తీర్పు మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌ను తుఫానులా కాదు సునామీలా ఊపుఊపేయనుందని విశ్లేషకులు చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని రెండు వర్గాలు పునరుద్ఘాటిస్తున్నాయి. తమ నేత జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ ప్రమాణస్వీకార వేడుకలో వడ్డించే ఆహార మెనూ ఇదేనంటూ ఇరు పక్షాలు ప్రకటనలు కూడా చేస్తున్న క్రమంలో అసలు ఆంధ్రలో గెలుపెవరిది అనేది సస్పెన్స్ థ్రిల్లర్‌గా మరింది. ఈ సస్పెన్స్‌కు ఈరోజు ఫలితాలు ప్రకటించి ఈసీ తెర దించనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ వర్గాలు కూడా వళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలని, అటూఇటూ తేడాగా ఏమైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.

Live Updates

  • 4 Jun 2024 8:41 AM IST

    పిఠాపురంలో చెల్లని ఓట్లే ఎక్కువ

    పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువగా చెల్లని ఓట్లు వస్తున్నాయి. పిఠాపురంలో 2,423 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోల్ అయ్యాయి. చెల్లని ఓట్లు అధికంగా ఉండటంతో ముందుగా వాటిని వేరు చేస్తున్నారు అధికారు. వాటిని వేరు చేసిన తర్వాత లెక్కింపు మొదలవుతుంది.

  • 4 Jun 2024 8:37 AM IST

    ముందంజలో టీడీపీ


    ఎన్నికల కౌంటింగ్‌లో ఆది నుంచే టీడీపీ జోరు కనబరుస్తోంది. టీడీపీ రాజమండ్రి అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ముందంజలో ఉన్నారు. ఆయన 900 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు.

  • ఇడుపులపాయలో షర్మిల ప్రార్థనలు
    4 Jun 2024 8:20 AM IST

    ఇడుపులపాయలో షర్మిల ప్రార్థనలు


    కౌంటింగ్ మొదలైన సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్ దగ్గర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రార్థనలు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రానికి బయలు దేరుతున్న సందర్భంగా ఆమె వైఎస్‌ఆర్ ఘాట్‌ను సందర్శించారు.

  • 4 Jun 2024 8:08 AM IST

    మొదలైన కౌంటింగ్

    ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓట్ల లేక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అసెంబ్లీ సహా లోక్‌సభ ఓట్ల లెక్కింపు కూడా ఒకేసారి చేయనున్నట్లు ఇప్పటికే ఈసీ ప్రకటించింది. ప్రణాళిక ప్రకారమే లెక్కింపు జరుగుతుందని అధికారులు చెపతున్నారు. కాగా తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఉదయం 8:30 గంటల తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభించనున్నారు.

  • 4 Jun 2024 8:01 AM IST

    భారీ విజయం పక్కా

    ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని చూడబోతున్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి సృజన చౌదరి ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని చెప్పారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు రాబొతున్నాయి. ఈ విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే ఘంటాపథంగా చెప్తున్నాయి’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

  • 4 Jun 2024 7:58 AM IST

    స్ట్రాంగ్ రూమ్‌లను తెరిచిన కలెక్టర్

    రాజంపేట పార్లమెంటు‌ నియోజకవర్గంకు చెందిన ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్‌లను అబ్జర్వర్లు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో కడప జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీయం అభిషిక్త్ తెరిచారు.


Read More
Next Story