
డీఎంకే కూటమిలో 5 సీట్లు కోరిన ఐయుఎంఎల్
తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల భాగస్వామ్యంపై చర్చలు మొదలయ్యాయి
తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల వేడి పెరుగుతోంది. డీఎంకే కూటమిలో ఐదు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) డిమాండ్ చేసింది. 2026 అసెంబ్లీ ఎన్నికలలో లౌకిక ప్రగతిశీల కూటమికి డీఎంకే నాయకత్వం వహిస్తోంది. సీట్ల భాగస్వామ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో టీఆర్ బాలు నేతృత్వంలోని డీఎంకే కమిటీతో ఐయుఎంఎల్ ప్రతినిధులు సమావేశమయ్యారు.
సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడు ఖాదర్ మొహిద్దీన్ మీడియాతో మాట్లాడారు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేవలం రాజకీయ పార్టీ కాదని, రాష్ట్రంలో 60 లక్షలకు పైగా ముస్లిం ఓటర్లకు ప్రాతినిధ్యం వహించే సంస్థ అని పేర్కొన్నారు.
ముస్లిం సమాజాన్ని పరిగణనలోకి తీసుకుని కలైంజర్ హయాంలో తమకు ఐదు నియోజకవర్గాలను కేటాయించబడిన విషయాన్ని ఖాదర్ గుర్తుచేశారు. అదే ఫార్ములాను ప్రస్తుత డీఎంకే నాయకత్వం కూడా అనుసరించాలని కోరినట్లు తెలిపారు. కూటమిలో విస్తృత ముస్లిం ప్రాతినిధ్యం అవసరమని, అసెంబ్లీలో కనీసం 16 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించినట్లు తెలిపారు.
సీట్ల భాగస్వామ్యంపై తుది నిర్ణయం డీఎంకే నాయకత్వం తీసుకోనుంది. ఎన్నికల సమీకరణల్లో ఈ డిమాండ్కు ఎంత ప్రాధాన్యం దక్కుతుందో చూడాలి.

