
రాహుల్పై బీజేపీ ఫైర్.. విదేశీ లింకులున్నాయని తీవ్ర ఆరోపణలు..
ఢిల్లీలో AI సమ్మిట్ నిరసనల తర్వాత లోక్సభ ప్రతిపక్ష నేతపై దూకుడు పెంచిన కాషాయ పార్టీ నేతలు
ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ నిరసనల తర్వాత రాజకీయ వాగ్వాదం మరింత వేడెక్కింది. తాజాగా రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. గత వారం ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ సందర్భంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ‘ప్రధాని రాజీ పడ్డారు’ అనే నినాదంతో చొక్కాలు లేకుండా నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో బీజేపీ బుధవారం కాంగ్రెస్పై దాడి మొదలుపెట్టింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మాట్లాడుతూ.. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భద్రతా సంస్థలకు సమాచారం ఇవ్వకుండా విదేశీ పర్యటనలు చేశారని ఆరోపించారు. రాహుల్ 247 విదేశీ పర్యటనలు చేసినట్లు నబిన్ తెలిపారు. విదేశాల్లో భారత వ్యతిరేక వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. కొన్ని అంతర్జాతీయ వ్యక్తుల పేర్లను కూడా ప్రస్తావించారు.
Nehru’s No.1 duty as first PM: Protect & integrate Bharat’s territory.
— Anil Baluni (@anil_baluni) February 25, 2026
Instead all through his reign he did Territorial compromise, piece by piece.
Tibet,
Aksai Chin,
Berubari,
Punjab villages,
Chhad Bet..
Repeated compromise. Repeated retreat. #CompromisedCongress pic.twitter.com/Q3yeVSZzvD
రాహుల్ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి రాజీ రాజకీయాలు కొనసాగుతున్నాయని నబిన్ వ్యాఖ్యానించారు. 1962 చైనా యుద్ధం, 1971 యుద్ధం తరువాతి పరిణామాలను ఉదాహరణలుగా ప్రస్తావించారు. రాజీవ్ గాంధీ కాలంలో బోఫోర్స్ ఒప్పందంపై కూడా ఆరోపణలు చేశారు.
నెహ్రూ పాలనలో పలు ప్రాదేశిక రాజీలు జరిగాయని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి అనిల్ బలూని ఆరోపించారు. సరిహద్దుల విషయంలో తిరోగమన నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. పలు ప్రాంతాల పేర్లు ప్రస్తావిస్తూ వరుస పోస్టులు చేశారు.
వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ కూడా విమర్శలు చేశారు. ఏఐ సమ్మిట్కు జరిగిన నిరసనతో దేశ ప్రతిష్ట దెబ్బతిందని వ్యాఖ్యానించారు. విదేశీ పర్యటనకు సంబంధించిన ఫోటోను బీజేపీఅధికార ప్రతినిధి గౌరవ్ భాటియా షేర్ చేస్తూ ఆరోపణలు చేశారు.
While Rahul Gandhi sends shirtless men to the AI summit to humiliate India on the global stage, it is only a continuation of his family legacy to compromise Bharat's image and interests. #CompromisedCongress pic.twitter.com/A4IaN2Kw4B
— Piyush Goyal (@PiyushGoyal) February 25, 2026
ఈ ఆరోపణలతో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ వైపు నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

