
ట్రంప్ టారిఫ్ అటలు ఎందుకు ఆడుతున్నాడో తెలుసా?
ట్రంప్ కొలంబియా యూనివర్శిటీ మీద గురిపెట్టడం కూడా టారిఫ్ ఆటలో భాగమే...
-ప్రొఫెసర్ కె.ఎస్. చలం
అమెరికా అధ్యక్ష పదవి జనవరి 20, 2098 చేపట్టిన వెంటనే కొన్ని అతిశయోక్తులతో కూడిన ప్రకటనలు చేశాడు. పక్కనున్న కెనడను కలిపేసుకుంటానన్నాడు. గ్రీన్ లాండ్ మాదేనన్నాడు. అసలు సూయిజ్ కెనాల్ అమెరికా సొత్తు అమెరికా అధీనంలోకి తెచ్చుకుంటా అన్నాడు.
చైనా పీచమణచి వేస్తానన్నాడు. తను జర్మనీ మూలాలున్న (హిట్లర్?) ఎలాన్ మాస్క్ ను అధికారిగా నియమించి డోజె (డిపార్ట్మెంట్ ఆఫ్ ' గవర్నమెంటు ఎఫీషియన్సీ) ప్రభుత్వ సమర్థత పెంచడానికి ఉద్యోగుల్ని తొలగించాలని మాస్క్ కు అధికారం ఇచ్చాడు. వీటన్నిటి కంటే, అమెరికాతో విదేశీ వాణిజ్యం నిర్వహిస్తున్న చైనా, ఇండియా వంటి దేశాల నుంచి దిగుమతి అయ్యే వాటిపై టారిఫ్, దిగుమతి సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించాడు. ఇదంతా తాను ఎన్నికలకు వెళ్లే ముందు కూడా మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్ అన్న ప్రకటనతో గెలిచాను. కాబట్టి వాటి కనుగుణంగా అమెరికాను తిరిగి ప్రపంచంతో తిరుగులేని శక్తిగా నిలబెట్టడానికి చేస్తున్న ఆర్థిక విధానాలుగా ప్రకటించాడు.
ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. చైనా చూద్దాంలే అన్నది, భారత్ పాకిస్థాన్ పరిమితి యుద్ధం ముగిసిన వెంటనే వాణిజ్య మంత్రి పియూష్ గోయెల్ హుటాహుటిన అమెరికా ప్రయాణమయ్యాడు. ఇదంతా ఐదునెలల అధికారంలో ట్రంప్ చేయగలిగాడంటే ఎంత గొప్పవాడో గదా? అనుకొంటూ వ్యాసాలు, మీడియా కథనాలు విపరీతంగా వచ్చాయి.
నిజానికి ఇదంతా అమెరికా ఆధిపత్య రంకెలేనా లేక లోలోపల జరుగుతున్న ఆర్థికసంక్షోభం నుంచి బయటపడడానికి చేస్తున్న ఏర్పాట్లా? ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి అడ్డులేని ఆగడాలకు కాలం దగ్గరపడి వేస్తున్న గంతులా! ఇటువంటి పరిస్థితి వస్తుందని కమ్యూనిస్టు మేధావులైన మార్క్స్ - లెనిన్ ఏమీ చెప్పలేదా? 2008 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికా నాయకత్వంలోనే ఏర్పాటు చేసుకున్న గాట్ తదనంతర డబ్ల్యుటీవో (ప్రపంచ వాణిజ్య సంస్థ) ద్వారా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను అధీనంలోకి తీసుకొని ప్రపంచ ఆర్థిక లావాదేవీలు స్వేచ్ఛా వాణిజ్యం ద్వారానే జరగాలని, తద్వారా ప్రపంచ సంపద పెరుగుతుందని, పేదరికం తగ్గిపోతుందని చెల్లింపు మేధావులు పరిశోధనల సారం అదేనని చెప్పి నలభై ఏళ్లు కాకముందే యీ గందరగోళం ఎందుకు జరుగుతోంది?
ట్రంప్ టారిఫ్ ల ద్వారా స్వేచ్ఛా వాణిజ్యానికి చరమగీతం పాడినట్లేనా ఇప్పుడు ప్రగతిశీల, వామపక్ష ప్రజాస్వామ్యవాదులు వేయవలసిన ప్రశ్నలు ఇది. ఇప్పుడు అడగండి మీరు గత ఐదు దశాబ్దాలుగా ముఖ్యంగా బెర్లిన్ వాల్ కూలగొట్టిన తరువాత మీరు పలికిన ప్రగల్బాలు అయిపోయాయా? ప్రపంచానికి మీరుచేసిన మేలేమిటి, ప్రజాస్వామ్యం, పేద ప్రజలు కోల్పోయిందే మిటి? అని అడగండి. ప్రగతిశీలురు ముందడుగు వేయండి!
ట్రంప్ విధించిన టారిఫ్ రేట్ల గురించి రెసిప్రోకల్, అంటే పరస్పర విలోమ సుంకాల గూర్చి మాట్లాడుకొనే ముందు మార్క్సిస్ట్ సాహిత్యంలో ఈ సమస్యపై ఉన్న కనీస ఆలోచనలేమిటో తెలుసుకుంటే, వామపక్ష వాదులు ధైర్యంగా ముందుకు అడుగులువేసే సిద్ధాంతి వెలుగు కొంత ఉపయోగపడుతుంది.
ఆర్థిక శాస్త్రవేత్తలైన ఆడమ్ స్మిత్, రికార్డుల మాదిరిగా వారిని అనుసరించిన మార్క్స్ స్వేచ్చా వాణిజ్యం గూర్చి మాట్లాడాడు. ఇక్కడే అందరూ తొందరపడి మారన్న అపార్థం. చేసుకుంటారు. ఆ మాటలు అన్న సందర్భంలోనే చాలా స్పష్టంగా తాను స్వేచ్ఛా వాణిజ్యం ఎందుకు కోరుకుంటున్నానంటే, పెట్టుబడిదారీ వ్యవస్థ విశ్వవ్యాప్తంగా పెరిగి, వైరుధ్యాలు మూటగట్టుకొని కూలిపోవాలని చెప్పాడు.
అప్పటి సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్తలైన ఆడమ్ స్మిత్, రికార్డోల మాదిరిగా వారిని అనుసరించిన మార్క్స్ స్వేచ్ఛా వాణిజ్యం గూర్చి మాట్లాడాడు. ఇక్కడే అందరూ తొందరపడి మార్ను అపార్థం చేసుకుంటారు. ఆ మాటలు అన్న సందర్భంలోనే చాలా స్పష్టంగా తాను స్వేచ్చా వాణిజ్యం ఎందుకు కోరుకుంటున్నానంటే, పెట్టుబడిదారీ వ్యవస్థ విశ్వవ్యాప్తంగా పెరిగి, వైరుధ్యాలు మూటగట్టుకొని కూలిపోవాలని చెప్పాడు. దీనిని మరికొంత ముందుకు నడిపించినవాడు లెనిన్, ఇప్పుడు ట్రంప్ ఆర్థిక విధానాల సందర్భంగా అమెరికా ప్రపంచ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద కేంద్రంగా ఎటువంటి లక్షణాలు కలిగి ఉందో తెలుసుకుంటే, లెనిన్ చెప్పిన 1961లో రాసి 1917 లో ప్రచురించిన ఇంపీరియలిజమ్, ది హైయస్ట్ స్టేజ్ ఆఫ్ కేపిటలిజమ్ (సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధాన అత్యంత చివరి దశ) అన్న చిన్న పుస్తకంలో వివరించిన ప్రధాన అంశాలను తెలుసుకుంటే ఇప్పుడు అమెరికా పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
లెనిన్ ఈ గ్రంథంలో ఒక పరిశోధకునిగా నాటి పెట్టుబడిదారీ దేశాలైన జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్ల బ్యాంకింగ్ రంగ గణాంకాలను సోదాహరణంగా ఇస్తూ. చెప్పిన విషయం ఏమిటంటే సామ్రాజ్యవాదం- బ్యాంకులలో నుంచే డబ్బు . రూపంలో ఉన్న పెట్టుబడిని, పారిశ్రామికరంగ పెట్టుబడిని కలిపి ఫైనాన్స్ కాపిటల్ గా రూపొందిస్తుంది. అది దాని అవసరం.
పెట్టుబడి దారి వ్యవస్థ మనుగడ సగించాలంటూ విదేశాలకు విస్తరించాలి, తప్పాదు, ఈ మాటలు లెనిన్ కు ముందు హబ్సన్ , హిల్ఫర్ డింగ్ ముఖ్యంగా రోజాలక్స0బర్గ్ వంటి వారు చెప్పిన అంశం ఏమిటంటే ... సమ్రాజ్యవాద పెట్టుబడి దారి వ్యవస్థలో పశ్చిమ దేశాలపై పెట్టుబడి ని వెనుకబడిన దేశాల పెట్టుబడిగా మార్చి ఆ దేశాల వైపు పయనిస్తుంది. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను తమ కబంధ హస్తాల్లోకి తీసుకొని పీల్చి వేస్తారు. అందుకు వారు ఎంచుకున్న మార్గాలు 1. ఏకస్వామ్యాన్ని, మోనోపోలీని పెంచటం 2. బ్యాంకులు పెట్టుబడి దార్ల సేవలోనే తరించటం, షేర్ మార్కెట్ విస్తరణ. 3. మొత్తం వ్యవస్థ మూలధన ఆధిపత్యంలోకి వెళ్లటం 4. వస్తువులకు బదులు పెట్టుబడే ఎగుమతి చేయటం 5.ప్రపంచాన్ని ముక్కలుగా చేసి పెట్టుబడిదార్లు పంచుకోవటం.
కొలంబియా యూనివర్శిటీ మీద కోపమెందుకు?
సుమారు 110 సంవత్సరాలకు పూర్వం లెనిన్ చెప్పిన ఈ ఆర్థిక విశ్లేషణలో పొల్లు పోకుండా జరిగిన తీరు చాలామంది పరిశోధకులు ముఖ్యంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందిన మార్క్సిస్ట్లు "నియో కొలోనియలిజమ్” నూతన వలస వాదం పేరుతో ఓ కోనర్, మెండల్, ఫ్రాంక్, తిరిగి, సమీర్ అమీన్ బాటు లూసియా ప్రడెల్లా, వుల్ఫ్, వాలర్ స్టీన్, అరిగి గియోవాన్ని వంటి వారెందరో గణాంకాలతో సహా వివరించి ఉన్నారు. వారికి తోడుగా పర్యావరణవేత్తలలో చాలామంది గొంతు కలిపి ఈ ఆర్థిక సామ్రాజ్యవాద లక్షణాలు, సమాజంలో అది సృష్టిస్తున్న నూతన పోకడలు, వర్గాలు గూర్చి బోలెడంత సాహిత్యం సృజించి ఉన్నారు.
గత అరవై సంవత్సరాల కోల్డ్వర్ పిరియడ్లో వచ్చిన ఆధిపత్య ఆర్థిక విశ్లేషణలలో ఇవి సాధారణ మేధావుల చర్చల్లో మార్జినలైజ్ అయినా, భారతదేశంలో కొన్ని వామపక్ష మేధావులు ఉదాసీనంగా ఉన్నా అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే హార్వర్డ్, కొలంబియా వంటి విశ్వవిద్యాలయాలను ట్రంప్ టార్గెట్ చేశాడు.
ఇప్పుడు వీరితో బాటు పర్యావరణ కార్యకర్తలు మేధావులు గ్రీన్పిస్ కార్యకర్తలతో బాటు థామస్ పికెటి వంటి ఆర్థిక శాస్త్రవేత్తలు అసమానతలపై చేస్తున్న పరిశోధనలు. ఇస్ఈక్వాలిటీ లాబ్ (Inequality Lab) ఏర్పాటు ద్వారా ఎంతో సమాచారం అందిస్తున్నారు. వీరి పరిశోధనలతో బాటు ఆక్స్ఫామ్ వంటి సంస్థలు ఆర్థిక అసమానతలపై ప్రచురించిన రిపోర్ట్ ముఖ్యంగా 2025 నాటి రిపోర్ట్ ట్రంప్ పదవి చేపట్టిన రోజునే ప్రకటించి బిలియనీర్ల సంపద ఎలా పెరుగుతుందో వివరించి నూతన వలసవాదం విస్తరిస్తోంది అని వివరించారు. దీనితో బాటు 1765-1990 మధ్య భారతదేశం నుంచి ఇంగ్లాండ్ 33.8 ట్రిలియన్ల డాలర్లు ఎలా 10 శాతం ఇంగ్లీషు వారు దోచుకున్నారో వివరిం చారు.
డాలర్ తో బ్లాక్ మెయిల్
కొంతమంది సాంప్రదాయవాదులకు ఈ మాటలు రుచించకపోవచ్చు. గత ఐదు దశాబ్దాల్లో ఏం జరిగింది? భారత్ వంటి దేశాల్లో జరిగిన పోరాటాలు ఏమయ్యాయి? పెట్టుబడిదారీ వ్యవస్థ అచేతనంగా ఉండిపోలేదు. తనకు తాను మార్చుకుంటూ నూతన పద్ధతులు, వ్యవస్థలు నిర్మించుకుంటూ తన సంక్షోభాన్ని వాయిదా వేసుకుంటూ వెళ్లినా, సమాజంపై, రాజ్యంపై, వర్గాలపై దాని ప్రభావం 20 వ శతాబ్ధం కంటే భిన్నంగా ఉందా? అన్న అంశాలు మేధావుల ముందు ఉన్నాయి. ట్రంప్-2 ఆర్ధిక విధానాలు లెనిన్ చెప్పిన సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగానే కాకుండా రెండో ప్రపంచ యుద్ధం తరువాత బ్రెటన్ వుడ్స్ సంస్థలు.. ప్రపంచ బ్యాంక్, ఐఎన్ఎఫ్ ద్వారా నాటో ఏర్పాటుతో జవసత్వాలు పొంది ఎలా మనగలుగుతుందో అర్థం చేసుకోవాలి. డాలర్ను అంతర్జాతీయ కరెన్సీ గా మార్చి ఎవరైనా కాదంటే శాంక్షన్స్ పేరు మీద డాలర్లను నిరాకరించి. అంతర్జాతీయ చెల్లింపుల్లో ఆటంకాలు సృష్టించటం అమెరికా నేర్చుకున్న కొత్త ఎత్తుగడ. దీనితో బాటు అమెరికా, యూరప్ ఆర్థిక వ్యవస్థల్లో మిలటరీ ఇండస్ట్రియిల్ కాంప్లెక్స్ అనే యుద్ధ పరిశ్రమలను ప్రోత్సహించుట ద్వారా ప్రపంచాన్ని అస్థిరపరిచే ఎత్తుగడలకు తెర తీసింది.
అమెరికాలో పేదరికం పెరిగింది
అమెరికా ఎన్నికలప్పుడు, ఉక్రెయిన్- రష్యా యుద్ధం, ఇజ్రాయిల్-పలస్తీనా యుద్ధం ఆపేస్తాను అంటే అమెరికా ప్రజలు సంతోషించారు, ఓట్లు వేశారు. కారణం, పెట్టుబడి అంతా దేశంలో ఉండి పరిశ్రమలు పెరిగి ఉద్యోగాలు కల్పిస్తే, ప్రభుత్వ సబ్సిడీల మీద ఆధారపడి బతికే దౌర్భాగ్యం నుంచి బయటపడవచ్చు అనుకొని దిగువ తరగతివారు ఓట్లు వేసినట్లు కొన్ని విశ్లేషణలు వచ్చాయి. మన బాకాలు ఎప్పుడూ చెప్పని విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే అమెరికాలో పేదరికం పెరిగింది. అది వారి లెక్కల ప్రకారమే (రోజుకు 2 డాలర్లు) 11.2 శాతం మంది నల్లవారు, హిస్పానిక్స్ వంటి ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారు.
భారత ఆహార భద్రతా చట్టం సత్ఫలితాలు
విచిత్రంగా 2013 నాటి యూపీఏ (UPA) ప్రభుత్వం తెచ్చిన ఆహార భద్రతా చట్టం (The National Food Security Act (NFSA) 2013) ద్వారా నెలకు ప్రతి ఒక్కరికీ 5 కిలోల ఆహారధాన్యాలు ఉచితంగా ఇవ్వాలి అన్నది పనిచేసింది. భారత్లో పేదరికం 5శాతానికి తగ్గటానికి అది కారణం అయితే బహువిధ పేదరిక సూచికలో భారత్ 109 దేశాల్లో 66 వ స్థానంలో ఉంది. మొదటిది ఆహార ఆధారిత పేదరికం, రెండవది బహుముఖ అంశాల ఆధారంగా నిర్మించినది. రెండో దాని గూర్చి మేధావులు మాట్లాడరు.
ఇక్కడ యుద్ధాలు గురించి మాట్లాడుకునేప్పుడు రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడు పెద్దగా ప్రపంచ స్థాయి యుద్ధాలు లేకపోయినా ఐక్యరాజ్యసమితి వంటి వేదికలు కొంత వరకు పనిచేస్తున్నా, యుద్ధ సామగ్రి కొనుగోలు పెరిగింది. నేటి ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో నాశనం అవుతున్న సంపద ఎవరు సృష్టించారు? ఏ వ్యవస్థ దాన్ని నిర్మించింది తెలుసుకోవాలి. కమ్యూనిస్టు రష్యా, జర్మనీ వంటి దేశాలు కూలిపోవటానికి రాజకీయ వ్యవస్థాపూర్వక కారణాలు అనేకం ఉన్నాయి. కాని ఈ దేశాల్లో సృష్టించిన సంపద అంతా అర్ధ శతాబ్దంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించిందే. పెట్టుబడిదారీ దేశాలతో సమానంగా పెరిగింది. ఈ విషయాన్ని ఇటు వామపక్షవాదులు, అటు వారి వ్యతిరేకులెవరూ ప్రస్తావించరు. ఈరోజు ప్రపంచ సంపదలో నాలుగోవంతు కమ్యూనిస్టు దేశాలైన చైనా, వియత్నాంతో పాటు ఒకప్పటి రష్యా, క్యూబా తదితర దేశాల జనాభా ప్రపంచ శాతంలో తక్కువ. (భారత్ మినహా) అయినా సంపదపరంగా ఆనాటి కమ్యూనిస్టు వ్యవస్థలే ఉత్పాదక శక్తులను పెంచి, టెక్నాలజీని అభివృద్ధిచేసి పెంచింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకవసర మయిందంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో నాశనమవుతున్న సంపదంతా ఆనాటిదే. నాటో నాటకం యిందులో ఉంది. గత రెండు దశాబ్దాల్లో పెద్ద ఒరిగిందేమీ లేదు. ముఖ్యంగా రష్యా సంపద కొందరు మాఫియాలు అమెరికా చేరవేశారనే ఉదంతాలు ఉన్నాయి కూడా! గాని యీ దేశాల్లో చైనాతో సహా యుద్ధ సామగ్రి తయారు చేసే సంస్థలు పెద్దగా పెరగలేదు.
యుద్ధం అంటే పెట్టుబడి
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీలను ఎదుర్కోవటానికి పెట్టిన పెట్టుబడి తప్ప రష్యా మినహా మిగతా దేశాలు పెద్దగా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స పై పెట్టింది లేదు. అంటే పెట్టుబడిదారీ దేశాలు తమ ఆర్థిక సామ్రాజ్య విస్తరణలో భాగంగా యుద్ధాలపై పెట్టుబడులు పెట్టడమే కాదు ఒక విధంగా యుద్ధ సామగ్రిని కొనుగోలుచేసే ఎత్తుగడలు చేస్తున్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా స్టాక్ హోం కేంద్రంగా పనిచేసే పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్) ప్రచురిస్తున్న గణాంకాల ప్రకారం ప్రపంచ దేశాల్లో అమెరికా సుమారు 37 శాతం యుద్ధం ఆధారిత వస్తువులు కొనుగోలు చేస్తోంది. చైనా 12 శాతం, రష్యా 5 శాతం, భారత్ 3.2 శాతం. ఇందులో ఎక్కువ భాగం ఉత్పత్తులు అమెరికా లేక అమెరికా సంబంధ కార్పొరేట్ సంస్థలే ఉత్పత్తి చేస్తున్నాయి.
యుద్ధ సామగ్రికి, వినియోగ వస్తువులకు తేడా ఉంది. వినియోగ వస్తువులు వాడుకుని తృప్తి పొందితే మరల అవి ఉత్పత్తి చేయవలసి వస్తుంది. అదే యుద్ధ సామగ్రి మరలా కొనాలంటే గతంలో కొన్న సామగ్రిని వినియోగించాలి. అందుకు యుద్ధాలు, అటువంటి సంఘటనలు అవసరమవు తాయి. అంటే గతంలో సామ్రాజ్య విస్తరణకు అవసరమయ్యే పెట్టుబడి ఫైనాన్షిలైజేషన్(లెనిన్) ఆర్థికీకరణ జరగాలి అన్న వివరణతోబాటు ఇప్పుడు యుద్ధాలు, యుద్ధ సామగ్రి అమ్మకాలు సామ్రాజ్య విస్తరణలో భాగమైపోయాయి అని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత యుద్ధ సామగ్రి తయారుదార్లు వాకీ హీడ్ మార్టిన్, ఆర్ టిఎక్స్, బోయింగ్, జనరల్ డైనమిక్స్ వంటి సంస్థలు అమెరికా కంపెనీలు. మొత్తం 3 ట్రిలియన్ల అమెరికా డాలర్ల విలువ గల సామగ్రి ఉత్పత్తి జరిగితే అందులో సగం వీళ్లే ఉత్పత్తి చేస్తారు. మన దేశం లాంటి దేశాలకు ఎలా ఎగుమతి చేస్తారో, వారి లాబీయింగ్ ఎలా ఉంటుందో, దేశాల రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తారో కొంతమందికయినా తెలుసు. ఇది సామ్రాజ్య విస్తరణలో ఓ ప్రధాన భూమిక.
అమెరికా టారిప్ వ్యూ హం ఏమిటి?
ట్రంప్ టారిఫ్లు ఆ దేశానికి కొత్త కాదు. రెసిప్రోకల్ టారిఫ్ అంటే వారి విదేశీ వాణిజ్య లోటును ఎగుమతులలో ఎంత శాతమో చూసి దాని ప్రకారం దిగుమతులపై సుంకం విధించి, ఆ లోటును భర్తీ చేసుకోవటం ఒక పద్ధతి. అయితే గతంలో వలసవాద కాలంలో అన్ని దేశాలు టారిఫ్లపైనే ఆధారపడ్డాయి. 1790 నుంచి 1860 వరకు అమెరికా ఆదాయ మార్గం దిగుమతి సుంకాలే. 1934 నుంచి రెండో ప్రపంచ యుద్ధం వరకు 50 శాతానికి పరిమితం చేశారు. యుద్ధం తరువాత ప్రపంచంపై ఆధిపత్యం కోసం స్వేచ్ఛా వాణిజ్యం, వేస్టేజి ఫేర్ మీద సుంకాలు ఎత్తివేసి అన్ని దేశాలకు తమ వస్తువులు ఎగుమతులు చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి డాలర్తో చెల్లింపులు చేసి పెత్తనం చేసింది. అందుకు అనుగుణంగా సిద్ధాంతాలు వల్లంచి డబ్ల్యుటీవోను ఏర్పాటు చేసుకొని పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరణకు చైనా వంటి దేశాల్లో తయారీరంగాన్ని బదిలీచేసి వ్యాపారం మాత్రమే చేస్తూ (టిలియన్లు ఆర్జించింది అమెరికా.
ట్రంఫ్ టారిఫ్ ఆట మొదలుపెట్టాడు
ఇప్పుడు చైనా తమ ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వ అజమాయిషీని పెంచి ప్రణాళికాబద్దంగా తమ వస్తువులు ఎగుమతిచేసి సంపదను వృద్ధి చేసింది. మిగులును పెంచి పి.పి.పి (పర్చేజింగ్ పవర్ పారిటీ) ధరలలో చూసుకున్నప్పుడు అమెరికా జాతీయాదా యాన్ని 2015 లోనే అధిగమించింది అని స్టిగ్లిట్జ్ అంచనా వేశాడు. అంటే అమెరికా చేసే వ్యాపారాలే మిగతా దేశాలు చేసి మిగులును వాణిజ్యంలో సంపాదించి అమెరికా పెత్తనానికి సవాలుకు చైనా, ఇండియాతో కూడుకున్న బ్రిక్స్ వంటి సంస్థలు రావటం డాలర్ను కాదని తామే వేరే కరెన్సీ రూపొందించి చెల్లింపులు చేసుకుందాం అని నిర్ణయించే క్రమంలో తమ పెత్తనానికి చివరి ఘడియలు వచ్చాయని ట్రంప్ ద్వారా టారిఫ్ ఆట మొదలు పెట్టారు. అమెరికాలో ఎవరు అధికారంలోకి వచ్చినా బడా కార్పొరేట్ కనుసన్నల్లో నడవవలసిందే. అధికారం చేపట్టక ముందే ట్రంప్ ముంగిట వీళ్లంతా చేరటంతో బైడెన్ ఆక్షేపిస్తూ, 12 అలిగార్కి ఆఫ్ వ్యూ కొద్దిమంది రాజ్యాధికారం ప్రజాస్వామ్యానికి చేటు అన్నాడు. వీళ్లంతా ఎవరో? ట్రంప్ ఎన్నికలకు అమెరికా పరిభాషలో డార్క్మనీ 4 బిలియన్ డాలర్లు (సుమారు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు) ఎన్నికలకు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇది పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య లక్షణం. ఇది ఇప్పుడు అన్ని దేశాలకు పాకి ప్రజాస్వామ్య విలువలను వెక్కిరిస్తోంది. భారత్ అందుకు మినహాయింపు కాదని మన అనుభవంలో తెలుస్తోంది.
ట్రంప్-2 టారిఫ్లో విచిత్రం
ఒక రోజు డొనాల్డ్ ట్రంప్ రోజ్ గార్డెన్ ప్రెస్మీట్ లో ఒక బోర్డు చేత పట్టుకొని అందరికీ చూపించాడు. అందులో చైనా మొదటి సంఖ్యలో ఉంది. చైనా అమెరికాపై 67 శాతం సుంకం విధిస్తుంది కాబట్టి అమెరికా ఇప్పుడు అందులో సగం 34 శాతం, భారత్ 52 శాతం విధిస్తోంది కాబట్టి 26 శాతం అంటూ 6 వ స్థానంలో చూపించాడు. గతంలో తక్కువ ఉన్న టారీఫ్లను కనీసం 10 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించి ఒక్కో దేశంతో బేరాలాడటం మొదలుపెట్టాడు. ఇందులో భారత్కు కొంత నష్టం వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే భారత్ ఎగుమతుల్లో 18 శాతం అమెరికాకు అందులో అత్యధిక సుంకం ఉన్న స్టీల్ యంత్ర సామగ్రి 22 శాతం ఉంది కాబట్టి. అసలు అమెరికా టారిఫ్ మీదకు రావటానికి వేరే కారణం కూడా ఉంది. లెనిన్ చెప్పినట్లు వస్తువులు కాకుండా పెట్టుబడినే ఇప్పుడు దిగుమతి చేస్తోంది. దీనితో బాటు కంటికి కనబడని వ్యాపారం, బరువు లేని వస్తువులు అయిన సాఫ్ట్వేర్, ఫిస్టిక్, ఆన్లైన్ వ్యాపారం విస్తరిస్తోంది. గమ్మత్తుగా వీటిపై ఇప్పటికి సుంకాలు లేవు. ఎప్పుడో ఆర్థిక శాస్త్రవేత్తలు కనీసం రెండు శాతం సుంకం విధించాలని చెప్పినా ఎవరు వింటారు? అమెరికా విదేశాల్లో 6.6 ట్రిలియన్ల డాలర్లు అంటే సుమారు మన దేశ జాతీయాదాయానికి ఒకటిన్నర రెట్లు పెట్టుబడులు పెడుతోంది. అవి ఏ రంగంలో అనుకున్నారు? ఇందులో సగం హోల్డింగ్ కంపెనీలు అంటే విదేశీ పెట్టుబడిలో 3.25 ట్రిలియన్లు, 3.3 ట్రిలియన్లు ఇన్ఫర్మేషన్ రంగం (మీడియాతో సహా) లో పెట్టుబడి పెట్టారు. అదే అమెరికాలో విదేశీయులు భారతీయులతో సహా 5.39 ట్రిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడితే అందులో ఎక్కువ శాతం 2.2 ట్రిలియన్లు తయారీరంగం, కంప్యూటర్, హోల్సేల్ ట్రేడ్ వంటి రంగాల్లో ఉంది. దీని ద్వారా లాభం 2.65 ట్రిలియన్లు విదేశాలకు వస్తే అమెరికాకు 5.7 ట్రిలియన్లు అంటే దాదాపు తాను పెట్టిన పెట్టుబడి అంతా లాభాలుగా గుంజుతోంది. ఇందులో ప్రముఖంగా చెప్పుకోదగ్గ అమెరికా కంపెనీల గూర్చి చెప్పుకోవాలి. అమెజాన్, వాల్మార్ట్, మైక్రోసాఫ్ట్, ఏపిల్, గూగుల్ వంటి సంస్థలు కంటికి కనపడని సేవలతో వ్యాపారం చేస్తున్న ట్రిలియనీర్లు. ఒక్క యాపిల్ మార్కెట్ విలువే భారత జాతీయదాయం కంటే ఎక్కువ.
లెస్ గవర్నమెంటు మోర్ గవర్నెన్స్
ప్రపంచాన్ని మొత్తం తన కనుసన్నల్లోకి తెచ్చుకోవటానికి కావలసిన మేధాపరమైన క్రియాశీల పరిశోధనలకు కోచ్ బ్రదర్స్ వంటి వారు పెట్టుబడులు పెట్టి బుకానన్ వంటి వారితో "లెస్ గవర్నమెంటు మోర్ గవర్నెన్స్" అనిపిం చారు. ప్రభుత్వ రంగం పనికిరానిది ప్రైవేట్ రంగం ఉత్పాదకనిస్తోంది అంటూ అమెరికాలో ఉన్న భారతీయ మేధావి వర్గం ముఖ్యంగా గుజరాత్కు చెందిన భగవతి, పణగారియా వంటి వారు ఎన్నో గ్రంథాలు పరిశోధన పత్రాలు ప్రచురించి యువతరాన్ని ప్రభావితం చేశారు. ప్రభుత్వ సలహాదారులుగా విధాన నిర్ణేతలుగా కొనసాగుతున్నారు. వీటన్నింటి వెనుక ఒక ఆర్థిక ఎత్తుగడ ఉంది. ఇది లెనిన్ కొంత వరకూ గ్రహించి ప్రపంచం మొత్తం షేర్ మార్కెట్ మాయా జాలంలోకి నెట్టే పరిస్థితి ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది.
అది ఎంత వరకూ పోయిందంటే ప్రపంచ దేశాల సంపద 124 ట్రిలియన్ల డాలర్లు ఉంటే షేర్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న మార్కెట్ కాపిటలైజేషన్ 159 ట్రిలియన్లు డాలర్లు ఉంది. అంటే 140 శాతం ప్రపంచ సంపద కొద్దిమంది చేతుల్లో ఊగిసలాడు తోంది. ఇందులో అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ కలిపి 65 ట్రిలియన్లు అంటే సగం కంటే ఎక్కువ వీరి అధీనంలో ఉంది. అందుకే గతంలో కేప్చర్ వాల్ట్ అనే ఉద్యమం అమెరికాలో ప్రారంభమయింది. ఇందులో రోజూ మీడియాలో చూస్తున్న ట్రేడింగ్ ట్రెండ్స్ వాటి ఆధారంగా గంటల్లో లక్షల కోట్లు రావడం, ఆవిరి అయిపోవటం చూస్తూనే ఉన్నాం.
మిలియనీర్ కూడా కాని అదాని ట్రిలియనీర్ ఎలా అయ్యాడో హిండెన్బర్గ్ వ్యవహారం చూశాము. ఇందులో మీడియా పాత్ర ముఖ్యంగా సుమారు 25 వేల మంది బ్రోకర్ల చేతివాటంతో నడుస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు, ఎవరి కోసం మారుతుందో, కూలుతుందో తెలియని గందరగోళంగా ఈనాటి సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థ గూర్చి మార్క్స్ వాదులే కాదు, సామాన్య మానవులు దాని మాయలోపడి నలిగిన బాధితులు గొంతు విప్పుతూనే ఉన్నారు. ట్రంప్-మస్క్ భాగస్వామ్యంలో జరగబోయే ప్రమాదాన్ని గ్రహించి అమెరికా ప్రజలు గత నెలరోజులుగా చేసిన ఆందోళనల ఫలితంగా అతని షేర్ మార్కెట్కు వీలయింది, వ్యాపారం దెబ్బతింది. ట్రంప్ ఇతగాడితో మనకు ప్రమాదమని వదిలించుకుందామనుకున్నాడు.
ఇంకా చాలా నాటకాలు ప్రపంచ అవనికలో చూడబోతున్నాం. అయితే చైతన్యవంతమైన ప్రజలు జరుగుతున్న దగా, మోసం చెల్లింపు మేధావుల మీడియా హుంకరింపు లను తప్పకుండా అర్థం చేసుకుంటున్నారు అని ఇటీవలి సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఇరవై ఒకటో శతాబ్దం మనం ఊహించిన దానికంటే భిన్నంగా మెజారిటీ ప్రజలకు మంచి జరగాలని కోరుకుందాం. అది ప్రజా చైతన్యం ద్వారా సాధ్యం.
(ఫ్రొఫెసర్ చలం ఆర్థిక వేత్త, ఆంధ్ర ప్రదేశ్ ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్ లర్)