
దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా
‘‘ఇరాన్ లో పాలన మార్చడం మా లక్ష్యం కాదు’’
వెల్లడించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ , ఇరాన్ ప్రజలే తమ భవిష్యత్ నిర్ణయించుకోవాలని సూచన
ఇరాన్ లో పాలనను మార్చాలని తాము అనుకోవడం లేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రతినిధి బ్రిగ్రేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ సోమవారం విలేకరులతో అన్నారు.
‘మా సైనిక లక్ష్యాలు కేవలం ఇజ్రాయెల్ కు ముప్పును తొలగించడం, ఇజ్రాయెల్ పై అణుబాంబు, బాలిస్టిక్ మిస్సైల్ ముప్పును తొలగించడం, ఈ ప్రాంతం అంతటా ఉగ్రవాద విస్తరణను అడ్డుకోవడం’’ అని డెఫ్రిన్ అన్నారు.
‘‘పాలనను మార్చడం ఇరాన్ ప్రజల ఇష్టం, మాది కాదు.’’ అని డెఫ్రిన్ అన్నారు. మేము ఈ ముప్పును తొలగిస్తున్నాము. ఇరాన్ కు మార్గం సుగమం చేస్తున్నామన్నారు.
అంతకుముందు ఇజ్రాయెల్ విదేశాంగమంత్రి గిడియన్ సార్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇరాన్ లో తమ దాడుల లక్ష్యం పాలకుల మార్పు కాదని పేర్కొన్నారు.
‘‘ఇది ఇరాన్ ప్రజలు నిర్ణయించుకోవాలి’’ అని సార్ సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని తొలగించడం, దాని నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణి ముప్పును తగ్గించడం ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం లక్ష్యాన్ని నిర్దేశించిందని ఆయన అన్నారు.
‘‘అమెరికాకు, పాశ్చాత్య నాగరికతకు మిత్రదేశంగా మనం చేస్తున్నది ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల స్థిరత్వానికి చాలా కీలకమని నేను నమ్ముతున్నాను’’ అని సార్ అన్నారు.
తమ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం.. ఇరాన్ ఆరు నెలల్లో తొమ్మిది అణుబాంబులు నిర్మించే సత్తా సాధించుకుందని అన్నారు.
ఇరాన్ సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ పై కొత్తగా క్షిపణి దాడులు చేసింది. దీనితో ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్ మోతలు వినిపించాయి. నాలుగో రోజు ఇరాన్ చేసిన దాడుల వల్ల నలుగురు ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. డజన్ల కొద్ది పౌరులు గాయపడ్డారు. దీనితో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.
ఇరాన్ దాదాపు 100 క్షిపణులు ప్రయోగించిందని ప్రకటించింది. తమ దేశంలో 224 మంది పౌరులు మరణించారని, అందుకు ప్రతీకారం తీర్చుకుంటారని ఇరాన్ ప్రకటించింది.
Next Story