బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ రాడికల్ గ్రూపుల వీరంగం
x
రాడికల్ ఇస్లామిక్ గ్రూపుల నిరసన

బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ రాడికల్ గ్రూపుల వీరంగం

పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కచేరీ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న విద్యార్థులు, ఢాకా పరిస్థితులపై తస్లీమా నస్రీన్ ఆందోళన


బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ మూక సంస్కృతి పెరిగిపోతోంది. బెంగాలీ సంస్కృతికి ఆయువు పట్టు అయిన కళలు, సంగీతంపై జిహాదీ శక్తులు యథేచ్ఛగా దాడులు చేస్తున్నాయి. తాజాగా ఢాకాకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరీద్ ఫూర్ లో ప్రముఖ బంగ్లాదేశ్ గాయకుడు జేమ్స్ కచేరీకి చేయడానికి ఏర్పాట్లు చేసుకోగా జిహాదీ మూకలు ఇటుకలు, రాళ్లతో దాడులు చేసి విధ్వంసం సృష్టించాయి.

ఈ ఘటన శుక్రవారం రాత్రి 9.00 గంటలకు చోటు చేసుకుంది. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా కచేరీ ఏర్పాటు చేసుకున్నట్లు తెలియగానే ఇస్లామిస్టులు వందల సంఖ్యలో విచ్చేసినట్లు స్థానికులు తెలిపారు.

ఒక బృందం బలవంతంగా వేదికలోకి బలవంతంగా ప్రవేశించిందని వెల్లడించారు. వేదిక వద్ద ఉన్న విద్యార్థులు మొదట్లో దాడి చేసిన వారిని ప్రతిఘటించారని, కానీ స్థానిక అధికారుల ఆదేశాల మేరకు చివరకు కచేరీని రద్దు చేసినట్లు ప్రకటించారు.

ఈ సంఘటన పై రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పందించారు. బంగ్లాదేశ్ లో కలవరపెట్టే విధంగా పరిస్థితులు మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో ‘‘సాంస్కృతిక కేంద్రం ఛాయానౌత్ కాలి బూడిదైంది. సంగీతం, థియోటర్ నృత్యం, పారాయణం, జానపద సంస్కృతి ద్వారా లౌకిక, ప్రగతిశీల చైతన్యాన్ని పెంపొందించడానికి నిర్మించిన ఉడిచి అనే సంస్థ కూడా బూడిదగా మారింది. నేడు జిహాదీలు ప్రఖ్యాత గాయకుడు జేమ్స్ ను ప్రదర్శన ఇవ్వడానికి అనుమతించలేదు’’ అని పోస్ట్ చేశారు.

బాలీవుడ్ గాయకుడు..
జేమ్స్ ప్రసిద్ద గేయ రచయిత, గిటారిస్ట్, స్వరకర్త, నేపథ్య గాయకుడు కూడా. అతను రాక్ బ్యాండ్ నగర్ బౌల్ ప్రధాన గాయకుడు, పాటల రచయిత, గిటారిస్ట్. అతను గ్యాంగ్ స్టర్ నుంచి భీగిభీగి, లైఫ్ ఇన్ ఏ.. మెట్రో, అల్విదా వంటి అనేక ప్రసిద్ది చెందిన హిందీ పాటలు కూడా పాడాడు.
బంగ్లాదేశ్ లో కచేరికి మంచి ఆదరణ ఉంది. ఇది బెంగాలీ సంప్రదాయంలో భాగం. దేశంలో రాడికల్ అంశాలు మహ్మద్ యూనస్ కాలంలో రెచ్చిపోతూ విధ్వంసం సృష్టిస్తున్నాయి.
కళాకారులు.. సాంస్కృతిక సంస్థ..
ఇంతకుముందు ప్రముఖ సంగీత కళాకారుడు అలీ అక్భర్ ఖాన్ మనవడు, ప్రపంచ ప్రఖ్యాత మాస్ట్రో ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ కుమారుడు సిరాజ్ అలీ ఖాన్ ఇటీవల ఢాకాలో కచేరీ నిర్వహించాల్సి ఉండగా, పరిస్థితులు సజావుగా లేకపోవడంతో భారత్ కు తిరిగి వచ్చాడు.
‘‘మైహార్ ఘరానాకు చెందిన ప్రముఖ కళాకారుడు సిరాజ్ అలా ఖాన్, కళాకారులు, సంగీతం, సాంస్కృతిక సంస్థలు, సురక్షితంగా ఉండే వరకూ తాను బంగ్లాదేశ్ తిరిగి వెళ్లను’’ అని ప్రకటించాడు.
రెండు రోజుల క్రితం ఉస్తాద్ రషీద్ ఖాన్ కుమారుడు అర్మాన్ ఖాన్ ఢాకాలో ప్రదర్శన ఇవ్వడానికి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించాడు. ‘‘సంగీతాన్ని ద్వేషించే జీహాదీలు నివసించే బంగ్లాదేశ్ లో అడుగు పెట్టాలని నేను కోరుకోవడం లేదు’’ అతను స్పష్టం చేశాడు.
ఇటీవల కాలాల్లో బంగ్లాదేశ్ లో కఠినమైన ఇస్లామిక్ రాడికల్ గ్రూపులు వీధుల్లోకి రావడం పెరిగిపోతోంది. రాష్ట్ర జోక్యం అంతగా లేదు. ఛాయానౌత్, ఉడిచి వంటి సాంస్కృతిక సంస్థలు, కళాకారులు, జర్నలిస్టులు, వార్తా పత్రికల కార్యాలయాలు దాడికి గురవుతున్నాయి.
మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అల్లర్లును అదుపు చేయడంలో విఫలం అవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో జరనున్న ఎన్నికలను ఆలస్యం చేయడానికి హింస, దహనం వంటి కుట్రలు పన్నుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.


Read More
Next Story