ఇరాన్ అణు కేంద్రాల వద్ద రేడియేషన్ లీక్ అవుతుందా?
x
ఫోర్డో అణు కేంద్రం

ఇరాన్ అణు కేంద్రాల వద్ద రేడియేషన్ లీక్ అవుతుందా?

ఐఏఈఏ అభిప్రాయం ఏంటీ?


ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ తో పాటు అమెరికా దాడులు చేయడంతో రేడియేషన్ ముప్పు తప్పదా అనే అనుమానాలు ముసురుకుంటున్నాయి. అయితే ఈ విషయం ఇంకా అంతర్జాతీయ సమాజానికి ఎటువంటి సమాచారం అందలేదు.

ఇరాన్ రెండు కీలక ప్రదేశాలైన నతాంజ్, ఫోర్డోలలో యురేనియం శుద్ది చేస్తోంది. ఆదివారం తెల్లవారుజామున అమెరికా ఈ రెండు కేంద్రాలతో పాటు, మూడో ప్రదేశం అయిన ఇస్ఫహాన్ పై కూడా దాడులు జరిపింది.

దాడుల తరువాత అణుకేంద్రాల వద్ద ఎలాంటి రేడియేషన్ కనిపించలేదని ఐరాస నిఘా సంస్థ, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తెలిపింది. మరికొంత సమాచారం వచ్చాక ఇరాన్ పరిస్థితిని అంచనా వేస్తామని పేర్కొంది.
శాంతియుత ప్రయోజనాలకే కార్యక్రమం..
అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనం కోసమే అని ఇరాన్ నాయకులు చెబుతున్నారు. కానీ రేడియో ధార్మికత కలిగించే అత్యంత సుసంపన్నమైన యురేనియం అణ్వాయుధాల తయారీలో ఉపయోగిస్తారు. అయితే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు సాధించకూడదని ఇజ్రాయెల్ గట్టి లక్ష్యంతో ఉంది.
ఈ లక్ష్యంతో నతాంజ్ వద్ద ఇజ్రాయెల్ దాడి చేసి వాటిని నాశనం చేసింది. ఇక్కడ యురేనియం 60 స్వచ్ఛతను సాధించడానికి అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి. నతాంజ్ లోని కింది సొరంగంలో శుద్ది చేసిన సెంట్రిప్యూజ్ లు ఉన్నాయి. వీటిని ఇజ్రాయెల్ నాశనం చేయలేకపోయింది. అందుకే అమెరికా సాయం కోరింది.
సెంట్రీ ప్యూజ్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఐఏఈఏ విశ్వసిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సెంట్రీప్యూజ్ లు ఐదుశాతం స్వచ్చతను పెంచే పనిలో ఉన్నాయి.
నతాంజ్ లోపల రేడియోలాజికల్, రసాయన కాలుష్యం ఉండే అవకాశం ఉన్నప్పటికి కాంప్లెక్స్ వెలుపల రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉందని ఐఏఈఏ చీఫ్ రాఫెల్ గ్రాస్సీ జూన్ 16న బోర్డు అత్యవసర సమావేశంలో తెలిపారు.
పర్వతం దిగువన..
టెహ్రాన్ కు వంద కిలోమీటర్ల దూరంలో, షియాల పవిత్ర నగరమైన కోమ్ కు సమీపంలో ఫోర్డో ఉంది. ఇది అణు శుద్దిని చేస్తుంది. అలాగే తన ఆయుధ గ్రేడ్ సామగ్రిని ఉత్పత్తి చేస్తుంది.
అది భూగర్భంలో అడుగున ఉండటంతో ప్రత్యర్థులు దాడులు చేయడం కష్టతరమైంది. 2007 లో నిర్మాణం ప్రారంభించగా, 2009 లో బయట ప్రపంచానికి తెలిసింది. అందుకే వీటిని ధ్వంసం చేయడానికి భారీ బంకర్ బస్టర్ బాంబులను వాడారు.
ఇస్ఫహాన్ లో కూడా..
ఇజ్రాయెల్ ఇప్పటికే ఇస్ఫహాన్ లోని నాలుగు అణు కేంద్రాలపై దాడి చేసింది. వాటిలో యూరేనియం మార్పిడి కూడా ఉంది. టెహ్రాన్ కు ఆగ్నేయంగా దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్ఫహాన్ లో రేడియేషన్ పెరిగినట్లు ఎటువంటి సంకేతాలు లేవని ఐఏఈఏ తెలిపింది.
యురేనియం వల్ల ప్రమాదం తక్కువ..
ఈ ప్రదేశం నుంచి రేడియేషన్ లీక్ అయినప్పటికీ ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. ‘‘ఈ రకమైన దాడులలో చాలా తక్కువ యురేనియం విడుదల అవుతుంది’’ అని వాషింగ్టన్ డీసీలో ఉన్న ఇన్ట్సిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ సెక్యురిటీ స్థాపించిన భౌతిక శాస్త్రవేత్త, అణ్వాయుధ నిపుణుడు డేవిడ్ ఆల్పైడ్ అన్నారు.
యురేనియం విషపూరితమైనదని కాదని పర్యావరణంలోని కొన్ని ప్రాంతాలలో సర్వసాధారణమని ఆయన అన్నారు. ఎవరైన అనారోగ్యానికి గురికావాలంటే పెద్ద మొత్తంలో యురేనియం తీసుకోవాల్సి ఉంటుందని, సముద్రం, నీరు, భూమిలో ఈ మూలకం సహజంగా ఉంటుందన్నారు. అయితే ఇందులో ఉపయోగించే ఫ్లోరిన్ వాయువు ఎక్కువ ప్రమాదకరంగా ఉంటుందని చెప్పారు.
యురేనియం హెక్సా ఫ్లోరైడ్ ను తయారు చేయడానికి ఫ్లోరిన్ ను సాంద్రీకృత యురేనియంతో కలుపుతారు. తరువాత దీనిని సెంట్రీఫ్యూజ్ లోకి పంపుతారు. ఫ్లోరిన్ చాలా అస్థిరంగా ఉంటుంది. త్వరగా క్షీణించి, చర్మాన్ని కాల్చే స్వభావం కలిగి ఉంటుంది. ఇది పీల్చుకుంటే ప్రాణాంతకమే.
ఇరాన్ లోని ఏకైక వాణిజ్య అణు విద్యుత్ ప్లాంట్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తే ప్రజలకు చాలా పెద్ద ప్రమాదమని ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ కు చెందిన ఫాబియన్ హింజ్ అన్నారు.
అణు విద్యుత్ కేంద్రంలో రియాక్టర్ కోర్, అణు ఇంధనం కోసం వాడిన భాగాలు అత్యంత రేడియో ధార్మికతను కలిగిస్తాయి. ఇవి కొన్నివేల సంవత్సరాల పాటు ప్రమాదకరమైనవి.
బుషేహర్ విద్యుత్ కేంద్రం టెహ్రన్ కు 750 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇజ్రాయెల్ దీనిపై దాడి చేసే అవకాశాలు చాలా తక్కువ అని హింజ్ అన్నారు. ఇది ఆయుధాలు తయారు చేసే కార్యక్రమం కింద అది భావించకపోవడమే అని టెల్ అవీవ్ భావిస్తోందని అన్నారు.


Read More
Next Story