విద్యాశాఖలో ఉద్యోగులను తొలగించవచ్చు: యూఎస్ సుప్రీంకోర్టు
x
అమెరికా సుప్రీంకోర్టు

విద్యాశాఖలో ఉద్యోగులను తొలగించవచ్చు: యూఎస్ సుప్రీంకోర్టు

ఉద్యోగాలు కోల్పోనున్న వందలాది ఉపాధ్యాయులు, గొప్ప తీర్పు ఇచ్చారన్నా ట్రంప్


విశ్వవిద్యాలయాల పరిధిలో ఉద్యోగులను తొలగించేందుకు డొనాల్డ్ ట్రంప్ కు ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతించడంతో ఆయన వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో దాదాపు 14 వందల మంది ఉద్యోగులను తొలగించేందుకు మార్గం సుగమమైంది.

బోస్టన్ లోని యూఎస్ జిల్లా న్యాయమూర్తి మ్యోంగ్ జోన్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది. జిల్లా న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులో తొలగింపుల వల్ల విద్యావ్యవస్థ కుంగుబాటుకు గురవుతుందని ప్రాథమిక నిషేధాజ్ఞను జారీ చేశారు.
తొలగింపులు విద్యా విభాగాన్ని కుంగదీసే అవకాశం ఉందని తన తీర్పులో రాశారు. ఈ తీర్పుపై ట్రంప్ ప్రభుత్వం ఫెడరల్ కోర్టును ఆశ్రయించగా అది స్టే ఇవ్వడానికి నిరాకరించింది. సోమవారం కేసు ను విచారించిన సుప్రీంకోర్టు త్రి సభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ అనుకూలమైన తీర్పును ఇచ్చారు.
సుప్రీంకోర్టు చర్య పరిపాలన శాఖను మూసివేసే పనిని తిరిగి ప్రారంభించడానికి వీలు కల్పిస్తుంది. ట్రంప్ ఎన్నికల సందర్బంగా విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తానని వాగ్ధానం చేశారు. ఈ తీర్పు పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.
‘‘సుప్రీంకోర్టు దేశ వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు, విద్యార్థులకు పెద్ద విజయాన్ని అందించింది.’’ అన్ని తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో అన్నారు. ఈ నిర్ణయం తన పరిపాలన శాఖ అనేక విధులను బ్యాక్ టూ ది స్టేట్స్ కి తిరిగి ఇచ్చే చాలా ముఖ్యమైన ప్రక్రియను ప్రారంభించడానికి వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు.
న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు..
అత్యవసర అప్పిళ్లలో ఉండే నిబంధనల ప్రకారం.. ట్రంప్ కు అనుకూలంగా కోర్టు తన నిర్ణయాన్ని వివరించలేదు. కానీ భిన్నాభిప్రాయంతో జస్టిస్ సోనియా సోటో మేయర్ తన సహచరులు పరిపాలన వైపు నుంచి చట్టబద్దంగా ప్రశ్నించదగిన చర్యకు వీలు కల్పిస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ఆమోదించిన చట్టాలను వాటిని అమలు చేయడానికి అవసరమైన వారందరిని తొలగించడం ద్వారా రద్దు చేసే అధికారాన్ని ట్రంప్ కు ఇచ్చిందని ఆమె అన్నారు.
‘‘చట్టాన్ని ఉల్లంఘించాలనే ఉద్దేశాన్ని కార్యనిర్వాహక సంస్థ బహిరంగంగా ప్రకటించి, ఆ వాగ్ధానాన్ని అమలు చేసినప్పుడూ ఈ వేగాన్ని అరికట్టడం న్యాయ వ్యవస్థ విధి’’ అని సోటో మేయర్ తో పాటు న్యాయమూర్తులు కేతాంజీ బ్రౌన్ జాక్సన్, ఎలెనా కాగన్ లు రాశారు.
ట్రంప్ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం సిగ్గుచేటు అని విద్యా కార్యదర్శి లిండా మెక్ మోహన్ అన్నారు.
ఈ రోజు సుప్రీంకోర్టు మరోసారి ఓ విషయాన్ని ధృవీకరించింది. యూఎస్ అధ్యక్షుడు కార్యనిర్వాహకశాఖ అధిపతిగా సిబ్బంది స్థాయి, పరిపాలన సంస్థ సమాఖ్య సంస్థల రోజువారీ కార్యకలాపాల గురించి నిర్ణయాలు తీసుకునే అంతిమ అధికారి’’ అని మెక్ మోహన్ ఓ ప్రకటనలో తెలిపారు.
వ్యాజ్యం కొనసాగుతుంది..
ఈ ప్రణాళికపై దావా వేసిన మసాచుసెట్స్ ఇతర విద్యా సముహాల తరఫున న్యాయవాదీ మాట్లాడుతూ.. దావా కొనసాగుతోందని, పరిపాలన చేయాలనుకుంటున్న అంశంపై ఇంకా తుది తీర్పు రాలేదని అన్నారు.
‘‘అమెరికన్ ప్రజలకు దాని తార్కికతను వివరించకుండానే యూఎస్ సుప్రీంకోర్టులోని మెజారిటీ న్యాయమూర్తులు ఆ దేశం పిల్లలందరికీ ప్రభుత్వ విద్య అనే వాగ్ధానికి వినాశకరమైన దెబ్బ కొట్టారు. మరోసారి వాదన లేకుండా వాటిని రద్దు చేసింది. ’’ అని డెమోక్రసీ ఫార్వర్డ్ అధ్యక్షుడు సీఈఓ స్కై ఫెర్రీమాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
సుప్రీంకోర్టు మద్దతు ఎందుకు?
పరిపాలన చర్యలు సమాఖ్య చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందని దిగువ కోర్టులు తీర్పు ఇచ్చిన తరువాత సమాఖ్య ప్రభుత్వాన్ని పున: నిర్మించే ప్రయత్నంలో సుప్రీంకోర్టు ట్రంప్ వైపు నిలిచింది.
సమాఖ్య ఉద్యోగుల పరిమాణం భారీగా తగ్గించాలనే ట్రంప్ ప్రణాళికకు న్యాయమూర్తులు రాచమార్గం వేశారు. విద్యారంగంలో ఉపాధ్యాయ శిక్షణ గ్రాంట్లలో కోతలు ముందుకు సాగడానికి హైకోర్టు గతంలో అనుమతి ఇచ్చింది.
ఒక్క సోమవారం నాడే 20 కి పైగా రాష్ట్రాలు పాఠశాల తరువాత సంరక్షణ వేసవి కార్యక్రమాలు నిర్వహించేందుకు మంజూరు చేసే బిలియన్ డాలర్ల నిధులను స్తంభింపజేయడంపై దావా వేశాయి.
అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ లోకల్ 252 ప్రకారం ఎవరినీ తిరిగి పనికి అనుమతించనప్పటికీ వారిని పూర్తిగా తొలగించకుండా డిపార్ట్ మెంట్ నిరోధించింది. జూన్ ప్రారంభంలో విద్యాశాఖ ఉద్యోగులను ఎలా తిరిగి చేర్చుకోవాలో అంచనా వేస్తున్నట్లు యూనియన్ తెలిపింది. వీరంతా వేరే ఉపాధిని చూసుకున్నారా లేదా అని తెలియజేయమని డిపార్ట్ మెంట్ ఈ మెయిల్ ద్వారా కోరింది.
రెండు వ్యాజ్యాలు..
ప్రస్తు కేసులో ట్రంప్ ప్రణాళిక విద్యాశాఖను చట్టవిరుద్దంగా మూసివేస్తున్నారని ఆరోపిస్తూ రెండు వ్యాజ్యాలు వేశారు. మసాచు సెట్స్ లోని సోమర్ విల్లే, ఈస్ట్ హాంప్టన్ లోని పాఠశాల జిల్లాలు, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్, ఇతర విద్యా సంఘాలు ఒక దావాను దాఖలు చేశాయి. మరొక దావాను 21 మంది డెమోక్రాటిక్ అటార్నీ జనరల్ సంకీర్ణం దాఖలు చేసింది.
ఉద్యోగుల తొలగింపుల కారణంగా కాంగ్రెస్ నిర్దేశించిన బాధ్యతలను నిర్వర్తించలేకపోయిందని ప్రత్యేక విద్యకు మద్దతు ఇవ్వడం, ఆర్థిక సాయం పంపిణీ, పౌరహక్కుల చట్టాలను అమలు చేయడం వంటి విధులను కూడా ఆ శాఖ నిర్వర్తించలేకపోయిందని దావాలో అవి కోర్టు దృష్టికి తీసుకొచ్చాయి.
అమెరికాలో న్యాయమూర్తులను ప్రభుత్వాలు నియమించే విధానం ఉంది. ఇందులో కూడా రిపబ్లికన్ న్యాయమూర్తులు, డెమొక్రాటిక్ న్యాయమూర్తులు ఉంటారు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే తమ వారిని న్యాయమూర్తులుగా ఖాళీలలో నియమించుకుంటారు.


Read More
Next Story