
యూఎస్ అధ్యక్షుడు ట్రంప్, పాక్ సైనిక జనరల్ అసిమ్ మునీర్
అమెరికా అధ్యక్షుడితో భేటీ కానున్న అసిమ్ మునీర్
భారత దౌత్యం విచ్ఛిన్నమవుతుందని కాంగ్రెస్ విమర్శలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను బుధవారం మధ్యాహ్నం భోజన విరామంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కలవబోతున్నారు. వైట్ హౌజ్ లో అధ్యక్షుడి రోజువారీ కార్యకలాపాలను షెడ్యూల్ చేసే విభాగం ఈ మేరకు వివరాలు వెల్లడించింది. అమెరికాను సందర్శించబోతున్న మునీర్ తో ట్రంప్ మధ్యాహ్నం ఒంటిగంటకు క్యాబినేట్ గదిలో సమావేశం కాబోతున్నారు.
జూన్ 14 న జరిగే అమెరికా సైన్యం 250 వ వార్షికోత్సవ వేడుకలకు మునీర్ ను ఆహ్వానించడాన్ని వైట్ హౌజ్ తిరస్కరించిన తరువాత ఇద్దరు నాయకుల మధ్య సమావేశం జరగబోతోంది.
భారత్ - పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ తరువాత తొలిసారి పాక్ జనరల్ తో అమెరికా అధ్యక్షుడు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ యుద్ధంలో ట్రంప్ తనకు తాను శాంతి స్థాపకుడి పాత్రను పోషించుకున్నట్లు స్వయంగా సామాజిక మాధ్యమాల్లో ప్రకటించుకున్నారు.
పాకిస్తాన్ దినపత్రిక డాన్ ప్రకారం.. మునీర్ తన దేశ పర్యటన సందర్బంగా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హేగ్సేత్ లను కూడా కలవనున్నారు.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణ నేపథ్యంలో దాని సరిహద్దు దేశం పాక్, అమెరికా అధ్యక్షుడితో ఆసిమ్ మునీర్ పాల్గనడం అనేక ఊహగానాలకు తావిచ్చింది. ఈ వివాదంలో నేరుగా పాల్గొనాలని అమెరికా నిర్ణయించుకుంటే దానికి పాక్ సహాయం కావచ్చు.
భారత దౌత్యం విచ్ఛినమవుతోంది: కాంగ్రెస్
మునీర్ తో ట్రంప్ భేటీ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ స్పందించింది. భారత దౌత్యం ఛిన్నాభిన్నం అవుతుందని ప్రధాని పూర్తిగా మౌనంగా ఉన్నారని ఆ పార్టీ విమర్శించింది.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్ చార్జ్ కమ్యూనికేషన్స్ జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. అధ్యక్షడు ట్రంప్ తాను భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తీసుకొచ్చినట్లు ఏకంగా 14 సార్లు ప్రకటించుకున్నారు. ఇప్పుడు మునీర్ తో సమావేశం కాబోతున్నారు. అంటే ఆపరేషన్ సిందూర్ ముగించారని అన్నారు.
‘‘ఏప్రిల్ 22 న పహల్గామ్ ఉగ్రవాద దాడితో నేరుగా ముడిపడిన వ్యక్తి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఈ రోజు వైట్ హౌజ్ లో అధ్యక్షుడు ట్రంప్ తో కలిసి భోజనం చేస్తున్నారు’’ అని రమేష్ అన్నారు.
అందుకే అధ్యక్షుడు ఒకరోజు ముందుగానే జీ7 సమావేశాన్ని రద్దు చేసుకున్నారని, ఆయన నరేంద్ర మోదీ కౌగిలింతను తోసిపుచ్చారని అన్నారు.
‘‘ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలలో పాకిస్తాన్ ను అద్భుతమైన భాగస్వామి అని అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ జనరల్ మైఖేల్ కురిల్లా అభివర్ణిస్తున్నారు. ఇది నమస్తే ట్రంప్, హౌడీ మోదీ కి ట్రిపుల్ ధమాకా అని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ అన్నారు.
‘‘భారత దౌత్యం విచ్ఛినమవుతోంది. ప్రధాని పూర్తిగా మౌనంగా ఉన్నారు. రేపు చైనాకు ఆయన క్లీన్ చిట్ ఇచ్చి ఐదు సంవత్సరాలు’’ రమేష్ అన్నారు.
Next Story