బడ్జెట్‌పై రాహుల్ గాంధీ అసహనం..
x

బడ్జెట్‌పై రాహుల్ గాంధీ అసహనం..

దేశం ఎదుర్కొంటున్న ప్రధాన ఆర్థిక-సామాజిక సమస్యలను పట్టించుకోలేదన్న లోక్‌సభా ప్రతిపక్ష నేత


Click the Play button to hear this message in audio format

యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని, తయారీ రంగం క్షీణిస్తోందని, రైతులు కష్టాల్లో ఉన్నారని రాహుల్ గాంధీ(Rahul Gandhi) పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి బడ్జెట్‌(Budget)లో స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. “ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు తగ్గుతున్నాయి, గృహ పొదుపులు పడిపోతున్నాయి, ప్రపంచ ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉంది” అని ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


సరైన పరిష్కారాలేవి?

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Kharge) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో విధాన దృష్టి, రాజకీయ సంకల్పం లోపించాయని అన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సవాళ్లకు సరైన పరిష్కారాలు చూపలేదని విమర్శించారు. రైతుల సంక్షేమం, ఆదాయ భద్రత, పెరుగుతున్న అసమానత వంటి అంశాలు నిర్లక్ష్యం చేయబడ్డాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీలకు తగిన మద్దతు కనిపించలేదని ఖర్గే అన్నారు.

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కూడా ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను సరిగా పరిగణలోకి తీసుకోలేదని, సమాఖ్యవాదానికి ప్రాధాన్యం తగ్గిందని వ్యాఖ్యానించారు. తయారీ రంగ పునరుద్ధరణ, విశ్వసనీయ ఉద్యోగ ప్రణాళిక, ఎగుమతులు-వాణిజ్య సవాళ్లపై స్పష్టత లేదని పేర్కొన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు ద్రవ్యోల్బణ ఉపశమనం కూడా కనిపించలేదన్నారు.

ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో పెట్టుబడులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెవెన్యూ వ్యయాన్ని ₹11.2 లక్షల కోట్ల నుంచి ₹12.2 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య ఘర్షణలు, అమెరికా సుంకాల ప్రభావం వంటి పరిస్థితుల మధ్య ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఆమె వివరించారు. ఇది ఎన్‌డీఏ ప్రభుత్వ మూడో పదవీకాలంలో మూడో బడ్జెట్ కావడం విశేషం.

Read More
Next Story