బడ్జెట్ 2026: ఉత్తరప్రదేశ్‌కు బహుమతుల వర్షం
x

బడ్జెట్ 2026: ఉత్తరప్రదేశ్‌కు బహుమతుల వర్షం

పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఆరోగ్యం, పర్యాటక రంగాల్లో భారీ ప్రాజెక్టులు.. వారణాసికి ప్రత్యేక ప్రాధాన్యం-హై–స్పీడ్ రైలు కారిడార్లు, షిప్ రిపేర్ పోర్ట్‌..


Click the Play button to hear this message in audio format

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026లో ఉత్తరప్రదేశ్ (Utter Pradesh) రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధి పథకాలు లభించాయి. ముఖ్యంగా వారణాసి(Varanasi) నగరానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, రాష్ట్రంలోని 25 ప్రధాన నగరాలకు పట్టణ అభివృద్ధి దిశగా ప్రణాళికలు ప్రకటించారు.

బడ్జెట్ ప్రసంగాన్ని నిశితంగా పరిశీలిస్తే..ఎక్కువ నిధులు ఉత్తరప్రదేశ్ కేటాయించినట్లు తెలుస్తుంది. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో ఓడల మరమ్మతు కేంద్రం (షిప్ రిపేర్ పోర్ట్) ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. అదనంగా, రాష్ట్రంలో రెండు హై–స్పీడ్ రైలు మార్గాలు నిర్మించనున్నారు. ఇవి సుమారు 1,500 కిలోమీటర్ల పొడవున ఉండి, ఒకటి వారణాసిని న్యూఢిల్లీతో, మరొకటి సిలిగురితో కలుపుతుంది. ఈ ప్రాజెక్టులు ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.


పట్టణాభివృద్ధికి ఊతం..

ఐదు లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రూ.12 లక్షల కోట్లకుపైగా పెట్టుబడితో టైర్–2, టైర్–3 నగరాల్లో రహదారులు, నీటి సరఫరా, డ్రైనేజీ, రవాణా వంటి మౌలిక వసతులను మెరుగుపరచనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో లక్నో, కాన్పూర్, నోయిడా, ఘజియాబాద్, వారణాసి, గోరఖ్‌పూర్, అయోధ్య వంటి 25 నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి.


చేనేత, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం..

మహాత్మా గాంధీ చేనేత పథకం ద్వారా చేనేత రంగానికి ప్రోత్సాహం ఇవ్వనున్నారు. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే అమలులో ఉన్న “వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్” (ODOP) పథకానికి బలాన్నిస్తుంది. చిన్న వ్యాపారాలు, చేతివృత్తులవారికి ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.


పరిశ్రమలకు లాభాలు..

సెమీకండక్టర్ రంగం: ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రకటనతో నోయిడా వంటి ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

తోలు పరిశ్రమ: తోలు వస్తువులను చౌకగా చేసే చర్యలతో కాన్పూర్, ఆగ్రా నగరాల పరిశ్రమలకు లాభం.

క్రీడా వస్తువులు: క్రీడా సామగ్రి తయారీకి ప్రోత్సాహం ఇవ్వడంతో మీరట్ పరిశ్రమకు ఊతం.

విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యం..

ప్రతి జిల్లాలో బాలికల కోసం ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రకటించింది. అంటే యూపీలోని 75 జిల్లాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. జిల్లా ఆసుపత్రుల సామర్థ్యాన్ని 50 శాతం పెంచే నిర్ణయం కూడా తీసుకున్నారు. దీని వల్ల ఆరోగ్య, విద్య రంగాల్లో రాష్ట్రానికి మేలు కలగనుంది.

మొత్తం మీద, బడ్జెట్ 2026 ఉత్తరప్రదేశ్‌కు మౌలిక వసతులు, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య రంగాల్లో గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించినట్లు కనిపిస్తోంది.


క్లుప్తంగా కేంద్ర బడ్జెట్ 2026 – ఉత్తరప్రదేశ్:

  1. రైలు మార్గాలు, నగరాలు, పరిశ్రమలు, ఆరోగ్యం, పర్యాటక రంగాల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రాజెక్టులు ప్రకటించారు.
  2. వారణాసిలో ఓడల మరమ్మతు కేంద్రం (షిప్ రిపేర్ పోర్ట్) ఏర్పాటు చేయడంతో పాటు, రెండు కొత్త హై–స్పీడ్ రైలు కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు.
  3. ఐదు లక్షలకుపైగా జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని 25 నగరాలకు ప్రధాన మౌలిక వసతుల అప్‌గ్రేడ్లు చేపట్టనున్నారు.
  4. మహాత్మా గాంధీ చేనేత పథకం ద్వారా ODOP (వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్) కార్యక్రమానికి బలం చేకూర్చి, చేతివృత్తులవారికి మద్దతు ఇస్తారు.
  5. తోలు వస్తువుల ధరలు తగ్గించే చర్యలతో కాన్పూర్, ఆగ్రా వంటి పరిశ్రమ కేంద్రాలకు లాభం కలుగుతుంది.
  6. మీరట్‌లోని క్రీడా సామగ్రి తయారీ పరిశ్రమకు కొత్త తయారీ ప్రోత్సాహకాలు ఉపయోగపడతాయి.
  7. ప్రతి జిల్లాలో బాలికల కోసం ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేసి, జిల్లా ఆసుపత్రుల సామర్థ్యాన్ని 50 శాతం పెంచే ప్రణాళిక ఉంది.
Read More
Next Story