ఢిల్లీలో నిత్యావసరాల కొరత లేదు: మంత్రి


సరిహద్దులో హైటెన్షన్ ఉన్న క్రమంలో ఢిల్లీలో నిత్యావసరాల కొరత ఏర్పడిందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి మంజిందర్ సింగ్ సీర్సా క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో అన్ని నిత్యావసరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఏదైనా దొరకదేమో అని భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ప్రధాని మోదీ, సీఎం రేఖా గుప్తా పరిస్థితులను రాత్రింబవళ్లు పరిశీలిస్తున్నారని చెప్పారు.

Read More
Next Story