సంయమనం పాటించండి: చైనా


తీవ్ర సరిహద్దు ఉద్రిక్తల నడుమ భారత్, పాక్‌‌కు చైనా కీలక సూచనలు చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. శాంతియుత పరిష్కారికి ప్రయత్నించాలని కోరింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన చేసింది. "శాంతి మరియు స్థిరత్వం యొక్క విస్తృత ప్రయోజనాల కోసం వ్యవహరించాలని, ప్రశాంతత మరియు సంయమనం పాటించాలని, శాంతియుత మార్గాల ద్వారా రాజకీయ పరిష్కారానికి తిరిగి రావాలని మరియు ఉద్రిక్తతలను మరింత పెంచే ఏ చర్య నుండి దూరంగా ఉండాలని మేము రెండు వైపులా గట్టిగా కోరుతున్నాము" అని పేర్కొంది.

Read More
Next Story