
వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ (VIP) సత్తా చాటాలేకపోయింది. పోటీ చేసిన 12 నియోజకవర్గాల్లోనూ వెనకబడి పోయింది. ఇదే పార్టీ 2020లో నాలుగు సీట్లు గెలుచుకుంది. పార్టీ అధినేత సహానీ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. తన సోదరుడు సంతోష్ సహానీని గౌరా బౌరం నుంచి పోటీకి దింపారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సుజిత్ కుమార్ 7వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆర్జేడీ నుంచి పోటీ చేసిన అఫ్జల్ అలి కూడా వెనకబడి పోయారు. కాగా 243 సభ్యుల అసెంబ్లీలో మహాఘటబంధన్ 38 సీట్లలో మాత్రమే ముందంజలో ఉంది. ఎన్డీయే 200 సీట్ల మార్కును దాటి ముందుకు దూసుకుపోయింది.
Next Story

