కూటమి గెలుపుపై అంబటి ఏమన్నారంటే..


ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. పలు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చిత్తు చేసింది. తాజాగా కూటమి గెలుపుపై అంబటి రాయుడు స్పందించారు. ఈరోజు ఆంధ్రప్రజలు విజయం సాధించారు. ‘‘టీడీపీ కూటమి సాధించిన విజయం ప్రజలది. జనసేన, బీజేపీ, టీడీపీలకు అభినందనలు.  రాష్ట్రాన్ని అభివృద్ధి, సామరస్య మార్గంలో నడిచేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్.. రాష్ట్రాన్ని ఏకం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు మంచిరోజులు వస్తున్నాయి. నారాలోకేష్ చేపట్టిన యువగళం యాత్ర కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించింది’’ అని ఎక్స్‌ వేదికగా పోస్ట్ పెట్టారు.

Read More
Next Story