13, 14 వందల కేంద్రాల్లో కొనసాగుతున్న పోలింగ్


రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఇప్పటికి కూడా 13 నుంచి 14 వందల పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతుందని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. శాంతిభద్రతల్లో ఎటువంటి సమస్య రాలేదని తెలిపారు. ఈవీఎంలలో సమస్య వస్తే వెంటనే వాటిని పరిష్కరించామని తెలిపారు. ‘‘సాయంత్రం 5 గంటల వరకు వచ్చిన పోలింగ్ శాతం కేవలం అంచనా మాత్రమే. కచ్ఛితమైన పోలింగ్ శాతం రావాలంటే మరో అరగంట సమయం పట్టొచ్చు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.330 స్వాధీనం చేసుకున్నాం. కేంద్ర ఆధ్వర్యంలో ఉన్న యాప్ ద్వారా 415 ఫిర్యాదులు వచ్చాయి. 225 ఫిర్యాదులు సీ-విజిల్ యాప్ ద్వారా వచ్చాయి. ఈ ఒక్కరోజు 38 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి’’అని వివరించారు.

Read More
Next Story