ఆర్మీ హెలికాప్టర్‌తో స్ట్రాంగ్‌ రూమ్‌కు ఈవీఎంలు, వీవీప్యాట్‌



అల్లూరి జిల్లాలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ఆర్మీ హెలికాప్టర్‌తో స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. ఏజెన్సీలోని రంపచోడవరం నియోజకవర్గంలో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలైన వై రామవరం మండలంలోని.. గుర్తేడు, పాతకోట, బొడ్డగండి పోలింగ్ కేంద్రాల నుంచి హెలికాప్టర్‌తో రంపచోడవరానికి ఈవీఎంలు తీసుకొచ్చారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్‌కు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను తీసుకొచ్చారు ఎన్నికల అధికారులు.

Read More
Next Story